-
అక్షర పూదోటలో విహారం
‘తోటలో అడుగుపెట్టినప్పుడు చెట్లకు పూచిన అందమైన పూలను చూస్తాం, వాటి పరిమళాలను ఆస్వాదిస్తాం. ఎండి రాలిన ఆకులను చూసి బాధపడుతూ కూర్చోం. జీవితమూ అంతే... మనం దేనిని తీసుకోవాలో తెలిస్తే అదే మన జీవితం అవుతుంది’ అంటారు అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన సాహితీ ప్రేమికురాలు ఆమె. అక్షరం అమూల్యమైనది. మనసు పలికిన అక్షరాలను మాలలుగా అల్లుతున్న ఈ కవయిత్రి... విశ్రాంత జీవనాన్ని హైదరాబాద్లో ఆమె అల్లుకున్న అక్షర పూదోటలో విహరింప చేస్తున్నారు. రాయాలి... ఏం రాయాలి? రాయాలంటే... రాయాలనే తపన ఉండాలి. అంతకంటే ముందు చదవాలనే తృష్ణ దహించి వేయాలి. అలా లైబ్రరీ మొత్తం చదివేసిందామె. ‘పెద్ద లైబ్రరీలో తనకు నచ్చిన రచనలకు మాత్రమే పరిమితమై ఉంటే... సాహిత్యంలో కొన్ని కోణాలను మాత్రమే స్పృశించగలిగేదాన్ని. లైబ్రరీ మొత్తం అక్షరం అక్షరం చదివేశాను... కాబట్టి, అందులో కొన్ని రచనల మీద పెద్దవాళ్ల విశ్లేషణను, అభిప్రాయాలను విన్నాను కాబట్టి ఏం రాయకూడదో తెలిసివచ్చింది. నా బాల్యంలోనే జై ఆంధ్ర ఉద్యమాన్ని చూశాను, ఇండో – పాక్ యుద్ధాన్ని చూశాను... కాబట్టి మనిషి ఎదుర్కొనే అసలైన కష్టం ఏమిటో అర్థమైంది. మనం కష్టాలుగా భావించే ఏదీ నిజానికి కష్టం కాదు. ఇవన్నీ మనకు మనంగా కల్పించుకున్న వెతలు మాత్రమే. వాటికి పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మనలోకి మనం తరచి చూసుకుంటే సరిపోతుంది. నా రచనల్లో అదే చెప్పాను’ అన్నారామె. చిన్న జీవితం మనది, ఆ చిన్న జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా జీవించాలి. ఇదీ ఆమె ఫిలాసఫీ. ‘మగాడు’ కథ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం అమ్మాయి... గోదావరిలో ఈతకొడుతూ పెరిగిన అమ్మాయి, చెట్టునే మగ్గిన మామిడి పండును కొరికి తిని టెంకను చెట్టుకే వదిలేసిన అందమైన అల్లరి బాల్యం, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోని అక్షరాల్లో ప్రపంచాన్ని చూసింది. ఆ అక్షరాలతోనే స్నేహం చేసింది. ముగ్గురు అక్కలు, అన్న పెంపకంలో ఒకింత పెద్ద లోకాన్ని అర్థం చేసుకుంది. వాళ్ల ఊరి నుంచి పొరుగూళ్ల థియేటర్లలో కూడా మారిన సినిమాలన్నీ చూసేసింది. ఆడపిల్ల చదువుకోవడానికి పొరుగూరికి వెళ్తుంటే ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి చూసే అతి చిన్న ప్రపంచంలో ఆమె సైకిల్ మీద కాలేజ్కి వెళ్లి ఓ ట్రెండ్ను సెట్ చేసింది. డిగ్రీ చదివిన తొలి అమ్మాయిగా ఊరికి ఒక రికార్డునిచ్చింది. గోదావరి నదిని ఈదినంత సునాయాసంగా సాహిత్యసాగరంలో ఈదుతున్నప్పుడు కూడా ఆమెలో రాయాలనే ఆలోచన కలగలేదు. మనసును చివుక్కుమనిపించిన ఓ రచన ఆ పని చేసింది. ఆ కథ పేరు ‘ఆడది’. ‘‘మల్లిక్ గారు రాసిన ‘ఆడది’ కథలో భారతీయ సమాజంలో సగటు గృహిణి పాత్రను వర్ణిస్తూ కథ చివరిలో ‘పాపం ఆడది’ అని ముగించారు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. ‘మగాడు’ అని హెడ్డింగ్ పెట్టి ‘పాపం ఎంతైనా మగాడు’ అని చివరి వాక్యం రాశాను. కానీ ఎలా మొదలుపెట్టాలో, కథనం ఎలా సాగాలో తెలియదు. పూర్తి చేయడానికి నెలలు పట్టింది. ‘విజయ’ మాస పత్రికకు పంపిచాను. వాళ్ల నుంచి రిప్లయ్ లేదు. నా కథ చూసి నవ్వుకుని ఉంటారని తలచు కుని తలచుకుని సిగ్గుపడిపోయాను. ఆరు నెలలకు పోస్టులో ‘విజయ’ మంత్లీ మా ఇంటికి వచ్చింది. అందులో నా కథ. అలా మగాడు కథతో రైటర్నయ్యాను’’ అన్నారు గౌరీ లక్ష్మి నవ్వుతూ. చేయి చాచవద్దు! ‘‘ఆడవాళ్లు సమానత్వ సాధన కోసం శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రపంచంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక మనిషి గుర్తింపుకు సంపాదనే కొలమానం అవుతోంది. కాబట్టి ఆర్థిక స్వావలంబనతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందంటారు గౌరీలక్ష్మి. సంపాదనలో పురుషుడికి దీటుగా నిలిచినప్పుడు ‘మమ్మల్ని గౌరవించండి, సమానమైన అవకాశాలివ్వండి’ అని ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదంటారామె. ‘‘సమానత్వం కోసం చేయి చాచి యాచించవద్దు... అంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినప్పుడు ఇక సమానత్వ సాధన కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరమూ ఉండదు. వరకట్నం అనే దురాచారం కనుమరుగయ్యే మంచి తరుణం కూడా అప్పుడే వస్తుంది. కన్యాశుల్కంతో పోరాడి బయటపడేటప్పటికి వరకట్నం రూపంలో మరో దురాచారం కోరల్లో చిక్కుకుంది భారతీయ స్త్రీ. చదువుకుంటే అన్నీ చక్కబడతాయనుకుంటే... మహిళ ఎంత సాధించినా పని చేసే చోట వివక్ష, లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇంకా ఉంది. అదే పిటీ. అలాగని మహిళలు సెల్ఫ్ పిటీలోకి వెళ్లకుండా ధైర్యంగా నిలబడాల్సింది ఇక్కడే. నేను 36 ఏళ్లు ఉద్యోగం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మహిళ తన ఉనికిని నిలుపుకోవడానికి అవసరమైతే ఎన్ని ఉలి దెబ్బలను తట్టుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి’’ అన్నారామె. ఆమె రచనల్లో స్త్రీ ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, వైవాహిక జీవితంలో అపసవ్యతలు ఎదురైన మహిళగా సమాజంలో ఎదొర్కొనే రకరకాల సమస్యలను ప్రస్తావించారు. సరైన నిర్ణయమే! గౌరీ లక్ష్మి తన ముఖంలో ప్రసన్నతకు కారణం జీవితం పట్ల ఎటువంటి ఎక్ట్పెక్టేషన్లు లేకపోవడమేనంటారు. ‘‘ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని రచనల కోసమే కేటాయించమని యండమూరి సూచించినప్పుడు... ‘నాకు చదవడం, రాయడం ఇష్టం. అక్షరాలంటే ప్రేమ. అక్షరాలను కమర్షియల్గా మార్చుకోవడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసుకుంటూ, రాయాలనిపించినప్పుడు రాస్తుంటాను’... అని చెప్పాను. అది సరైన నిర్ణయమే. నా రచనకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి, రివ్యూలు ఎలా వచ్చాయి, ఎంత పారితోషికం వస్తోంది... వంటి లెక్కలేవీ ఉండవు నాకు. కీర్తికాంక్ష కోసం వెంపర్లాట కూడా లేదు. నా స్పందనకు అక్షరరూపమిస్తున్నాను. ఆ స్పందనకు ఏ కమర్షియల్ కొలమానాలూ అక్కరలేదు. అందుకే హాయిగా ఉన్నాను’’ అన్నారామె. గౌరీలక్ష్మితో మాట్లాడినప్పుడు వృత్తి ప్రవృత్తి మధ్య సమతూకం తెలిసినప్పుడు జీవితంలో అన్నీ తూకంగానే ఉంటాయనిపించింది. తామరాకు మీద నీటి బిందువులా జీవించడానికి సద్గురువుల బోధనలు అక్కరలేదు, అనవసరపు అంచనాల, ఆకాంక్షల పరిభ్రమణానికి దూరంగా ఉండగలిగితే చాలు... అని తెలిసింది. అక్షరాల మడి హైదరాబాద్లోని హయత్నగర్లో ఉండేవాళ్లం. సిటీలోకి వచ్చి వెళ్లడానికి రోజూ నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఉద్యోగం చేశాను. వారాంతాల్లో కథా సదస్సుల్లో పాల్గొంటూ నా అభిరుచిని చిగురింపచేసుకున్నాను. ఇవన్నీ భర్త, ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కబెట్టుకుంటూనే. వీటి మధ్యలోనే పొలిటికల్ సైన్స్లో పీజీ చేశాను. సాహిత్యపరంగా నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు, రెండు కవితా సంపుటాలు, రాజకీయ వ్యంగ్య కథనాలు కూడా రాశాను. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కాలమ్స్ రాస్తున్నాను. నన్ను నిత్యనూతనంగా ఉంచుతున్నది సాహిత్యమే. మనిషి వ్యక్తిత్వాన్ని చక్కటి శిల్పంలా తీర్చిదిద్దగలిగిన గొప్ప సాధనం సాహిత్యం. అందుకే సాహిత్యంతో స్నేహం చేయడం అందరికీ మంచిదని చెబుతాను. నాకంటూ నేను పెంచుకున్న సాహిత్యవనంలో విహరిస్తూ విశ్రాంత జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను. – అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి, జనరల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్రెడ్డి -
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి 3 నెలల జైలుశిక్ష
అప్పు ఎగవేత, చెక్కుబౌన్స్ కేసులో కోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: అవసరం నిమిత్తం రూ.30 లక్షలు అప్పు తీసుకుని ఎగవేసిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి న్యాయస్థానం 3 నెలల జైలుశిక్ష విధిం చింది. దానిని అప్పిలేట్ కోర్టు కూడా సమర్థిస్తూ.. అప్పు వడ్డీతో సహా చెల్లిం చాలని ఆ విశ్రాంత ఉద్యోగికి స్పష్టం చేసింది. లేనిపక్షంలో అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. కూకట్పల్లిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన ఎల్.సుబ్బరామిరెడ్డి వద్ద కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జి.వి.రమణారెడ్డి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2006లో రూ.30 లక్షలు తీసుకున్నారు.నెలకు 3శాతం వడ్డీ చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్న సుబ్బరామిరెడ్డి రూ.10 లక్షల చొప్పున 3 చెక్కులను రమణారెడ్డికి ఇచ్చారు. అప్పులో కొంత భాగాన్ని చెల్లించేందు కు రమణారెడ్డి 2009లో సుబ్బరామిరెడ్డికి కొన్ని చెక్కులు ఇచ్చారు. కానీ అవి బౌన్స్ అయ్యాయి. దీంతో సుబ్బరామిరెడ్డి కూకట్పల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో రమణారెడ్డిపై కేసు పెట్టారు. తాను సుబ్బరామిరెడ్డి నుంచి అప్పు తీసుకోలేదని, ప్లాట్ల కొనుగోలు లావాదేవీలకు సంబంధించి సర్దుబాటు నిమిత్తం తనకు చెక్కులు ఇచ్చారని రమణారెడ్డి కోర్టుకు చెప్పారు. కానీ ఆ సొమ్మును అప్పుగానే తీసుకున్నట్లు కోర్టు తేల్చింది. ‘నెగోషియబుల్ ఇన్స్ట్రుమెం ట్స్ యాక్ట్’ కింద రమణారెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ.. జైలు శిక్ష విధిం చింది. అసలు రూ.30లక్షలతో వడ్డీ, జరిమానా కింద మరో రూ.16 లక్షలు కలిపి మొత్తం రూ.46లక్షలను సుబ్బరామిరెడ్డికి చెల్లించాలంది. ఈ తీర్పుపై రమణారెడ్డి అప్పిలేట్ కోర్టుకు వెళ్లగా.. శిక్ష విధింపును సమర్థించింది. అయితే జరిమానాను మాత్రం కొంత తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి..
అతనో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. అవసానదశలో ఆసరా కావాలని ఓ మహిళను వివాహమాడాడు.. ఒకరికొకరం తోడుగా ఉందామని నమ్మబలికాడు.. ఆపై తనను సరిగా చూసుకోవడం లేదంటూ వేధించాడు. ఇక కాపురం చేయలేను.. తన దారిన తాను వెళ్లిపోతానంటే.. చిత్రహింసలకు గురిచేసి కాటికి సాగనంపాడు.. కిరాతక భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నాగార్జునసాగర్లో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎస్కె.షబ్బీర్మియా నాగార్జునసాగర్ నీటిపంపిణీ విభాగంలో ఫిట్టర్గా పనిచేస్తూ,స్థానిక హిల్ కాలనీలోని చర్చీ పక్కనగల ఏ-520 ప్రభుత్వ క్వార్టర్లో నివాసముంటున్నాడు. ఇతడికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు. పిల్లలకు వివాహాల య్యాయి. ఇతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక మొదటి భార్యతో పాటు ఆమె పిల్లలు ఐదేళ్ల క్రితం విడిపోయారు. నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి.. వృద్ధాప్యంలో ఆసరా కావాలని ఎస్కె.షబ్బీర్మియా నాలుగేళ్ల క్రితం షేక్ బీపాషా(45)ను వివాహం చేసుకున్నాడు. 2013వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందాడు. షేక్ బీపాషాకు ఇద్దరు కుమార్తెలు రజ్వీనా,జానులతో పాటు కుమారుడు యాకూబ్భాషా ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు వాళ్ల అ క్కల వద్దనే ఉంటున్నాడు. వీరిద్దరే సాగర్లో ఉంటున్నారు.కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. ఆరునెలలుగా.. తనను సరిగా చూసుకోవడం లేదంటూ షబ్బీర్మియా భార్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభిం చాడు. ఆరుమాసాల క్రితం భార్య వేళ్లు విరగ్గొట్టాడు. దీంతో చిత్రహింసలు భరించలేక బీపాషా కూతుళ్ల వద్దకు వెళ్లిపోయింది. కొద్ది రోజులు తరువాత వెళ్లి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. సోమవారం రాత్రి కూడా భార్యభర్త గొడవపడ్డారు. విషయం కాలనీ కులపెద్ద వరకు వెళ్లింది. బీపాషా ఇక ఇతడితో కాపురం చేయలేనని చెప్పడంతో ఆ కులపెద్ద పంపించమని షబ్బీర్మియాను మందలించి పంపించాడు. మరుసటి రోజు మళ్లీ గొడవపడి.. షబ్బీర్మియా మరుసటి రోజు మంగళథవారం రాత్రి భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. ఆపై కత్తితో దాడిచేసి, తలను గోడకు బలంగా మోది దారుణంగా హత్య చేశాడు. రాత్రంతా భార్య శవం పక్కనే జాగారం చేసిన షబ్బీర్మియా ఉదయాన్నే ఇంటికి తలుపులు పెట్టి వెళ్లిపోయాడు. వెలుగులోకి వచ్చింది ఇలా.. షబ్బీర్ మియా ఇంటి నుంచి బయలుదేరి మిర్యాలగూడకు వెళ్లాడు. అక్కడ తనకు తెలిసి న్యాయవాదిని ఫోనులో సంప్రదించి భార్యను హత్య చేసినట్టు వివరించాడు. ఆ తరువాత బీపాషా కూతుళ్లు, కుమారుడికి కూడా ఫోన్ చేసి తల్లిని చంపినట్టు తెలిపాడు. న్యాయవాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాలియా సీఐ పార్థసారథి, సాగర్ ఎస్ఐ రజనీకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ తల్లిని కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కూతుళ్లు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కాగా,నిందితుడిని మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!
Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్
ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్
అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..
ఎక్కువరోజులు బతకలేడు అని డాక్టర్లు చేతులెత్తేశారు: నటుడు
వైట్ శారీలో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ హోయలు.. ఫోటోలు
తప్పక చదవండి
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- మోసాల బాబు మరో అబద్ధం..
Advertisement