-
ఎన్నో చెబుతారు...కొన్నే చేస్తారు
► కేటాయింపులకూ...పనులకూ ► పొంతన లేని వైనం జీహెచ్ఎంసీలో వింత పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బడ్జెట్లో పొందుపరిచే పనులకు... వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. ఏడాదిలో ఎన్నో పనులు చేయనున్నట్లు బడ్జెట్లో చెబుతున్నా.. అవి అమలుకు నోచుకోవడం లేదు. ఆర్థిక సంవత్సరం మొద ట్లో ప్రతిపాదించిన పనులను అక్టోబర్లో రివైజ్డ్ బడ్జెట్ రూపొందించే నాటికే కుదిస్తున్నారు. నిధులు లేకపోవడం ఒక కారణమైతే.. తగినంత మంది అధికారులు లేకపోవడం మరో కారణం. రివైజ్డ్ బడ్జెట్లో తగ్గించిన మేరకైనా పనులు చేయగలరో లేదో రానున్న 40 రోజు ల్లో తేలనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో చేయాలనుకున్న పనులు.. ఇప్పటి వరకు చేసినవి పరిశీలిస్తే.. ♦ రూ.700 కోట్లతో రహదారుల పనులు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని అక్టోబర్ రివైజ్డ్ బడ్జెట్లో రూ.605 కోట్లకు కుదించారు. ఇవి ఎంతమేర పూర్తి చేయగలరన్నది నెల రోజులు గడిస్తే కానీ తెలియదు. ♦ పేద బస్తీల ప్రజలకు శుద్ధ జలం కోసం రూ.50 కోట్లు కేటాయించారు. రివైజ్డ్లో రూ.25 కోట్లకు తగ్గించా రు. రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు. ♦ స్లాటర్హౌస్ల ఆధునీకరణకు రూ.40 కోట్లు కేటాయించినా.. వాస్తవ పరస్థితుల్ని అంచనా వేసి రూ.15 కోట్లకు తగ్గించారు. ♦ స్లమ్ఫ్రీ కోసం రూ.450 కోట్లు కేటాయించి.. అనంతరం రూ.250 కోట్లకు తగ్గించారు. ♦ మల్టీపర్పస్ హాళ్లకు రూ.106 కోట్లు కేటాయించినా.. పనులు జరగలేదు. ♦ ఆధునిక మార్కెట్లదీ అదే దారి. తొలుత రూ. 70 కోట్లు కేటాయించి.. అనంతరం రూ.50 కోట్లకు త గ్గించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు రూ. 20 కోట్లు కేటాయించి.. రూ. 9 కోట్లకు తగ్గించారు. ఇంతవరకు ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవు. ♦ మహిళల టాయ్లెట్లకు బడ్జెట్లో రూ.10 కోట్లు చూపారు. ఎక్కడా ఏర్పాటు కాలేదు. రివైజ్డ్లో రూ.7.31 కోట్లకు తగ్గించారు. ♦ సెల్ఫ్హెల్ప్ గ్రూపుల బలోపేతానికి బడ్జెట్లో రూ.12 కోట్లు కేటాయించి...రూ. 3.24 కోట్లకు కుదించారు. ♦ సీనియర్ సిటిజన్ల ఆసరా కార్యక్రమాలకు తొలుత రూ.10 కోట్లు కేటాయించి, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా తిరిగి రూ. 2.04 కోట్లకు తగ్గించారు. ♦ ఇలా అంచనాల్లో మాత్రం భారీ సంఖ్యలు ఉన్నప్పటికీ, వాస్తవంలో కనిపించడం లేదు. అక్టోబర్లో నిధులు తగ్గించి రివైజ్ చేసినప్పటికీ... అనంతరం వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్, ఇతరత్రా కారణాలతో పనులు కదల్లేదు. -
వెలిగొండ వెలిగేదెప్పుడు...!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కనీసం రూ.2,500 కోట్లు కేటాయిస్తేగాని వెలిగుండ ప్రాజెక్టు పూర్తి కాదు. ఈ ఏడాది రూ. 505 కోట్లు కేటాయించాలంటూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. 2014-15 బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన కేటాయించిన మొత్తం కేవలం రూ.76.58 కోట్లు మాత్రమే. ప్రకాశం, నెల్లూరు, కడపలోని 30 మండలాల్లో కరువును శాశ్వతంగా నివారించేందుకు డిజైన్ చేసిన ప్రధానమైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఇప్పటికి సగం పని మాత్రమే పూర్తయింది. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పకుండా ఏ సంవత్సరానికా సంవత్సరం గడువు పెంచుకుంటూ పోతున్నారు. ప్రాజెక్టు వ్యయం 4,672 కోట్ల రూపాయలు కాగా రివైజ్డ్ బడ్జెట్లో దీని అంచనాలు రూ.5,998 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే సుమారు 3,437 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేశారు. గత ఏడాది రూ.402 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని పూర్తిగా తగ్గించివేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం, ఆవశ్యకతపై గత పాతికేళ్లుగా ఈ ప్రాంత ప్రజల పోరాటం కొనసాగుతూనే ఉంది. కృష్ణానది మిగులు జలాలు ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని 45 రోజులపాటు వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయిస్తే 43.50 టీఎంసీల నీటితో నిండుతుంది. టన్నెల్స్ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపుల్లో నీటిని నింపనున్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాల్లో సుమారు 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది ఫ్లోరైడ్ పీడిత ప్రజలకుతాగునీరు లభిస్తుంది. నత్తనడకన టన్నెల్ పనులు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2009 జూన్ 25న అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య టన్నెల్ పనులను ప్రారంభించారు. టన్నెల్ 1ను 18 కిలోమీటర్లు, టన్నెల్ 2ను 18.8 కి.మీ పొడవున నిర్మిస్తున్నారు. టన్నెల్ 1 నిర్మాణానికి రూ.624 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు సుమారు రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. టన్నెల్ 2 నిర్మాణానికి రూ. 735 కోట్లు కేటాయించగా, సుమారు రూ. 400 కోట్లు ఇప్పటికే ఖర్చయ్యాయి. పూర్తయితే... ప్రాజెక్టు పూర్తయితే అర్ధవీడులో 3 వేలు, కంభంలో 17,300, బేస్తవారిపేటలో 11,200, మార్కాపురంలో 27,700ఎకరాలు, కొనకనమిట్లలో 30 వేలు, తర్లుపాడులో 20 వేలు, హెచ్ఎంపాడులో 39,400, కనిగిరిలో 9,900, పొదిలిలో 5,200, కురిచేడులో 6 వేలు, దొనకొండలో 17 వేలు, పుల్లలచెరువులో 11,500, మర్రిపూడిలో 4,400, పెద్దారవీడులో 21,900, యర్రగొండపాలెంలో 19,800, దోర్నాలలో 6,100, త్రిపురాంతకంలో 32,300, గిద్దలూరులో 10,600, రాచర్లలో 11,500, కొమరోలులో 5,500, పామూరులో 2,300, సీఎస్ పురంలో 24,500, వెలిగండ్లలో 17,600ఎకరాల్లో వెలిగొండ జలాలు పారనున్నాయి. కడప జిల్లాలో పోరుమామిళ్లలో 9,600, కలసపాడులో 15,400 ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 15,250, వరికుంటపాడులో 20,250, దుత్తలూరులో 20 వేలు, శీతారామపురంలో 7,500, మర్రిపూడిలో 21 వేల ఎకరాలకు వెలిగొండ జలాలు అందనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, వెస్ట్రన్ బ్రాంచి కెనాల్ ద్వారా 58,500 ఎకరాలు, రాయవరం కాలువ ద్వారా 48 వేల ఎకరాలు, ఉదయగిరి బ్రాంచి కెనాల్ ద్వారా 52 వేల ఎకరాలు, తీగలేరు కాలువ ద్వారా 62 వేల ఎకరాలు, కాకర్ల కాలువ ద్వారా 9,500 ఎకరాలు, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500, కంభం, గండిపాలెం కింద స్థిరీకరణ ద్వారా 26 వేలు, ఉప రిజర్వాయర్ల ద్వారా 12 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రకటనలకే పరిమితం చేయకుండా నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును జాతీయహోదా కల్పిస్తేనే త్వరితగతిన పూర్తి చేయడానికి వీలు ఉంటుందని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
మహారాష్ట్ర: కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
జీవితకాల గరిష్ఠాలకు స్టాక్మార్కెట్లు.. 22,950 మార్కు చేరిన నిఫ్టీ
బెంగుళూరులోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపు
లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది
తప్పక చదవండి
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
Advertisement