-
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్హాల్ను బుక్చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్ను బుక్చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్హాల్ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్పై బయట ఉన్నంతసేపు సందీప్పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్వార్ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
పెళ్లిమండపంలో ప్రియుడిని కిడ్నాప్ చేసి..
ఏకంగా పెళ్లి మండపం నుంచి ప్రియుడిని కిడ్నాప్ చేసి.. చివరకు అతన్నే పెళ్లి చేసుకున్న ఓ 'రివాల్వర్ రాణి' ప్రేమకథ ఇది. అనేక మలుపుల తర్వాత ఆమె ప్రేమకథ సుఖాంతమైంది. ఇంతకు ఈ రివాల్వర్ రాణి ఎవరు? ఆమె ప్రేమకథ ఏమిటంటే.. వర్ష సాహు అలియాస్ 'రివాల్వర్ రాణి'.. రెండు నెలల కిందట ఈమె పేరు మీడియాలో మార్మోగిపోయింది. అందుకు కారణం తన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. ఏకంగా తుపాకీతో బెదిరించి అతన్ని పెళ్లిమండపం నుంచే వర్ష సాహు కిడ్నాప్ చేసింది. మే 15న ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్లోని మౌదాహాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వర్ష సాహు-అశోక్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటంతో వర్ష ఈ సాహసానికి ఒడిగట్టింది. తుపాకీతో బెదిరించి మరీ పెళ్లి కొడుకును పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన అశోక్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఇంతలో తమ కూతురిని పెళ్లి పేరిట మోసం చేశాడంటూ అశోక్పై పెళ్లికూతురు కుటుంబసభ్యులు కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అశోక్ ఈ నెల 7న జైలు నుంచి విడులయ్యాడు. జైలు బయట అతనికి ఘనస్వాగతం పలికిన వర్ష అతన్నే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. హమిర్పూర్లోని మతా చౌరా ఆలయంలో వీరి పెళ్లి ఈ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి భోజనాలు సహా అన్ని ఏర్పాట్లను యూపీ శివసేన శాఖ దగ్గరుండి చేయించడం గమనార్హం. అంతేకాదు ప్రేమికులు మోసం చేసే యువతులను ఆదుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేయనున్నట్టు యూపీ శివసేన అధ్యక్షుడు రతన్ బ్రహ్మచారి ప్రకటించారు. -
‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’
బుందేల్ఖండ్: రివాల్వర్ రాణి(వర్షా సాహు)ని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియుడని చెప్పి అశోక్ యాదవ్ అనే ఓ పెళ్లి కొడుకు తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన ఆమెను బుందేల్ఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను అసలు తుపాకీ తీసుకురాలేదని, అశోక్ను తాను బలవంతంగా తీసుకెళ్లలేదని, తనే స్వయంగా ఇష్టంతో తనతో వచ్చాడని చెప్పింది. ఎందుకంటే అతడు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని కూడా వివరించింది. ‘నేను అక్కడికి తుపాకీతో వెళ్లలేదు.. అదంతా కూడా అబద్ధం’ అని కుర్తా సల్వార్ ధరించి పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. మంగళవారం రాత్రి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుండగా ఎస్యూవీ వాహనంలో వచ్చి వర్షా నేరుగా పెళ్లి కొడుకు తుపాకీ గురిపెట్టి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, తమకు రహస్యంగా వివాహం కూడా జరిగిందని, అశోక్ తల్లిదండ్రులు అతడికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి బలవంతంగా కూర్చొబెట్టారంటూ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నా వర్షా పెళ్లి కొడుకు తనంతట తనే వచ్చి కారులో కూర్చున్నాడని, ఇష్ట పూర్తిగా వచ్చాడని తెలిపింది. ‘ఆ పెళ్లిపట్ల అతడు సంతోషంగా లేడు. ఆ అమ్మాయిని చేసుకునేందుకు అతడు సిద్ధంగా లేడు. ఆ అమ్మాయి కుటుంబానికి కూడా అతడు మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలుసు. అయితే, అన్నీ సర్దుకుపోతాయని వారు భావించారు’ అని కూడా పోలీసులకు వివరించింది. ఇదిలా ఉండగా అశోక్ యాదవ్ ఇప్పటికీ కనిపించడం లేదంట. -
రివాల్వర్ రాణి: వరుడి తలకు తుపాకీ పెట్టి..
బుందేల్ఖండ్: తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడంటూ ఓ యువతి రివాల్వర్తో పెళ్లి మండపానికి వచ్చి వరుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి సుమోలో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చిన యువతి..' ఇతను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమై నన్ను మోసగిస్తున్నాడు. నేను ఈ పెళ్లిని ఎట్టి పరిస్ధితుల్లో జరగనివ్వను' అంటూ వరుడి తలకు వెంట తెచ్చుకున్న తుపాకి గురి పెట్టి అతన్ని కిడ్నాప్ చేసింది. కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనతో వివాహానికి హాజరైన బంధువులు షాక్కు గురయ్యారు. వెంటన్ దగ్గరలోని పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇలాంటి అమ్మాయిలు ఉంటేనే అబ్బాయిలకు బుద్ధి వస్తుందని ఓ పోలీస్ అధికారి కిడ్నాప్ చేసిన యువతిని 'రివాల్వర్ రాణి' వ్యాఖ్యానించారు. కాగా, పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోవడంపై స్పందించిన వధువు ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. వరుడు అశోక్ యాదవ్ కిడ్నాప్పై స్ధానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిడ్నాప్ చేసిన యువతి అశోక్కు ముందే తెలుసని చెప్పారు. మరికొందరు వారు సీక్రెట్గా గతంలోనే పెళ్లి చేసుకున్నారని.. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఈ పెళ్లికి అశోక్ ఒప్పుకున్నాడని తెలిపారు. పెళ్లిమండపంలో వివాహం ఆగిపోవడంపై స్పందించిన వరుడి తండ్రి.. తన కొడుకు ప్రవర్తన కొంతకాలంగా అనుమానాస్పదంగా ఉన్నట్లు చెప్పారు. పని చేసే నగరానికి కలవడానికి వెళ్తే ఇంటికి తీసుకెళ్లకుండా.. గుడికి రమ్మనేవాడని తెలిపారు. అక్కడే ఏదో ఒక రెస్టారెంట్లో భోజనం పెట్టించి తిరిగి బస్ ఎక్కించేసేవాడని చెప్పారు. -
పోలాండ్లో రివాల్వర్ రాణీ
టాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధదాస్ వరుస చిత్ర షూటింగులతో యమబిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం గుంటూరు టాకీస్. ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలాండ్లో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆమె రివాల్వర్ రాణీ పాత్ర పోషిస్తుంది. ఆ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా పోలాండ్ తరలి వెళ్లింది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అనంతపురం జిల్లా హిందూపురంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు టాకీస్ చిత్రం అటు హిందీ, ఇటు తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగు చిత్రంలో శ్రద్ధ సీఈవోగా నటిస్తుండగా... హిందీ చిత్రంలో జర్నలిస్ట్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలాండ్లోని క్రాకో నగరంలో దిగిన ఫోటోలను శ్రద్ధ తన మైక్రో బ్లాగ్లో ఉంచింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement