-
'మాయా చెంబు' ముఠా ఆటకట్టు
ధర్మవరం అర్బన్: మాయా చెంబు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. 18 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వివరాలు వెల్లడించారు. నిందితులు తమ వద్ద ఉన్న రాగి చెంబుకు రసాయనాలు పూసి ఆ చెంబు వద్ద టార్చ్లైట్ వేస్తే లైట్ ఆఫ్ అవుతుంది. దీంతో ఈ చెంబుకు అద్వితీయ శక్తులు ఉన్నాయని ఇది ఎవరి ఇంట్లో ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని వారు అనుకొన్న కార్యాలు నెరవేరుతాయని అమాయక ప్రజలను నమ్మించి వారికి రాగి చెంబును అమ్మి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవాలన్న పథకంతో గత మూడురోజులుగా గోరంట్ల పరిసర ప్రాంతాల్లో 18 మంది సభ్యుల ముఠా తిరుగుతోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గోరంట్ల సీఐ జయనాయక్, సీసీఎస్ సిబ్బంది గోరంట్ల సమీపంలోని యర్రబల్లి రోడ్డు బూదిలి క్రాస్ వద్ద గురువారం ఉదయం 9.30 గంటలకు 18 మంది ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడుకార్లు, ఒక స్కార్పియో, రెండు రాగి చెంబులు, ఒక టార్చిలైట్, రూ.30వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 18 మందిపైనా కేసులు నమోదు చేశారు. ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన గోరంట్ల సీఐ, సీసీఎస్ సిబ్బందిని డీఎస్పీలు అభినందించారు. అరెస్టైన వారు వీరే... అనంతపురానికి చెందిన శ్యామలబోయన శ్రీనివాసులు, బెళుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామానికి చెందిన నారా సుదర్శన్, కదిరి టౌన్ మౌనిక టాకీస్ వద్దనున్న పాలగిరి ముఖద్దర్ బాషా, పామిడి మండలం సరస్వతి విద్యామందిరం దగ్గరున్న షేక్ షాషావలి, గాండ్లపెంట మండలం కటకంవారిపల్లికి చెందిన ఆలుకుంట్ల శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా గల్పేటకు చెందిన కె.పి.గోపినాథ్, బెంగళూరులోని రాజీవ్గాంధీ రోడ్డుకు చెందిన వై.శ్రీనాథ్, స్కార్పియో డ్రైవర్, మంగళూరుకు చెందిన ప్రవీణ్రాజ్, యలహంకకు చెందిన ఎం.రోహిత్, ఎ.రవికుమార్, బెంగళూరులోని శ్రీకంఠేశ్వరనగర్కు చెందిన ఆర్.రాము, వశికేరహళ్లికి చెందిన ఎం.శ్రీనాథ్, శివమొగ్గ జిల్లా వినోబానగర్కు చెందిన ఎస్.అశోక్, బెంగళూరు రూరల్ పరిధిలోని చిన్న మంగళకు చెందిన చంద్రప్ప నాగరాజు, తుమకూరు జిల్లా హెగ్గెరెహళ్లికి చెందిన జగన్నాథ్ మంజునాథ్, హిందూపురం మండలం సంతేబిదనూరుకు చెందిన హెచ్.సంజీవప్ప, నల్లమాడ మండలానికి చెందిన జె నాగరాజు, అమడగూరు మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.మురళి. -
మళ్లీ పేట్రేగుతున్న ఆర్పీ ముఠాలు
రకరకాల ప్రచారాలతో భారీగా మోసాలు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న అమాయకులు పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్ ముఠాలు మళ్లీ పేట్రేగుతు న్నా యి. ఈ ముఠాల కారణంగా ఎందరో అమాయకులు మోసపోతున్నారు. రైస్ పుల్లింగ్ అనే మత్తులో పడి ఇంకొందరు ఇప్పటికే తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆర్పీ ముఠా మాటలు నమ్మి కోట్లు సంపాదించాలనే ఆశతో ఈ ప్రాంతంలో వందలాది మంది ఇదే వృత్తిగా పలువురు ఏజెంట్లను తయారు చేసి అన్వేషణ సాగిస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఇలాంటి పలు ముఠాలను పలమనేరు, గంగవరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలమనేరు పోలీసులు తమిళనాడుకు చెందిన ఆర్పీ ముఠాను ఆదివారం అరెస్టు చేసింది. వీరి డీల్ రూ.ఐదుకోట్లకు సాగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్షయపాత్ర, బంగారు నాణేల పేరిట మోసాలు పురాతన కాలం నాటి అక్షయపాత్ర, రాగిపాత్రలకు బియ్యాన్ని ఆకర్షించే శక్తి ఉండడాన్నే రైస్ పుల్లింగ్ అంటారు. ఇలాంటి బియ్యాన్ని ఆకర్షించే రాగి పాత్రలకు బయటి దేశాల్లో కోట్లాది రూపాయల గిరాకీ ఉంటుందని ఈ ముఠా నమ్మబలుకుతోంది. ముఖ్యంగా పాతకాలం నాటి రాగి పాత్రలను కొన్నేళ్లు భూమిలో పాతిపెడితే ఇవి ఎంతో విలువైన యురేనియంను సంగ్రహించి అత్యంత శక్తివంతంగా తయారవుతాయని కూడా నమ్మిస్తారు. ఇందులో ఆర్పీ అంటే రైస్ పుల్లింగ్ అని సీఆర్పీ అంటే కాపర్ రైస్ పుల్లర్, సీఐపీ అంటే కాపర్ ఇరిడియమ్ రైస్ పుల్లర్ పేరిట ఈ తంతు ఇక్కడ సాగుతోంది. దీంతోపాటు నకిలీ బంగారు నాణేలను చూపి వీటిని తక్కువ ధరకే ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మోసాలు ఇలా అద్భుత శక్తి కలిగిన రాగి చెంబు, పాత్ర, వజ్రాలు తమ వద్ద ఉన్నాయంటూ పలు ముఠాలు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. ఈ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలన్నీ భారీగా మోసాలకు పాల్పడేవని తేలింది. వీరు ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని వ్యవహారమంతా రహస్య ప్రదేశాల్లోనే నిర్వహిస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి రాత్రి సమయాల్లో ఓ ప్రదేశానికి డబ్బుతో రమ్మని వీరి మనుష్యులే పోలీసుల వేషాల్లో వచ్చి దాడులు చేసినట్టు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మత్తులో పడి పలువురు లక్షల్లో మోసపోయారు. వీరి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ రైస్ పుల్లింగ్ మోసాలు పెరుగుతుండడం గమనార్హం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement