-
మచ్చా... మైండ్బ్లోయింగ్! ’ ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతడు
ఇంగ్లీష్లో తట్టుకుంటూ మాట్లాడటం వేరు, భయంగా మాట్లాడటం వేరు. ఫ్లుయెంట్గా, ధైర్యంగా మాట్లాడటం వేరు. దిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో తన రిక్షాలో కూర్చున్న విదేశీ దంపతులతో ఒక రిక్షావాలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం చూస్తుంటే ‘మైండ్బ్లోయింగ్ మచ్చా’ అనిపిస్తుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారిలో ధైర్యం నింపుతోంది. ఈ వీడియోలాగే ఇటీవల మరో వీడియో వైరల్ అయింది. గోవా బీచ్లో గాజులు అమ్మే మహిళ ఆ ప్రాంతం గురించి విదేశీ టూరిస్టులతో గడ గడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వీడియో నెట్లోకంలో చక్కర్లు కొట్టింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి గోవా బీచ్లో తల్లిదండ్రులతో కలిసి తిరిగిన ఆమెకు ఆ పరిసర ప్రాంతాల్లో వినిపించే మాటలే ఇంగ్లీష్ నేర్చుకునే పాఠాలు అయ్యాయి. -
రిక్షావాలా లక్ష్యం.. మూడువేల కిలోమీటర్లు!
కోల్ కతా: తన సుదీర్ఘ ప్రయాణం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు ఓ రిక్షావాలా. అంతే వచ్చిన ఆలోచనే తడువుగా తన ప్రయాణాన్ని రిక్షాలో ఆరంభించాడు. ఇంతకీ ఎన్నికిలోమీటర్లో చెప్పలేదు కదూ. అచ్చంగా మూడు వేలకిలోమీటర్లు. తాను నిర్దేశించుకున్నలక్ష్యం చేరేవరకూ ఈసారి మాత్రం అలసిపోనని అతను స్పష్టం చేస్తున్నాడు. కోల్ కతా కు చెందిన రిక్షావాలా సత్యేన్ దాస్(40) రిక్షాలో తన సామాగ్రిని తీసుకుని దేశంలోని మూడు వేల కిలోమీటర్లు చుట్టిరావడానికి గత నెలలో పయనమైయ్యాడు. కోల్ కతా నుంచి బయల్దేరిన అతను లడఖ్ వరకూ ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం స్థానికుల్ని నుంచి కొంత సొమ్మును పోగుచేసుకున్నాడు. ఇంతకీ ఆప్రయాణం చేయడానికి కారణం లేకపోలేదు. 'రిక్షా'ను బతికించాలనే ఉద్దేశంతోనే అతను ఈ జర్నీ చేపట్టాడట. 'ప్రస్తుతం ఈ గ్లోబలైజేషన్ లో రిక్షాను ఉపయోగించడమే గగనమైపోయింది. ఇందుకోసం ఒక విన్నూత్న పద్దతిని ఎంచుకున్నాను. రిక్షా అనేది అత్యంత చౌకబారు రవాణా వస్తువే కాకుండా , సురక్షితమైనదిగా తెలియచెప్పడమే దీని ఉద్దేశ్యం' అని దాస్ తెలుపుతున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ చేరుకున్న ఆ రిక్షావాలా శ్రీనగర్ మీదుగా కార్గిల్ కు వచ్చే నెలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం గమ్యాన్ని చేరుకోవడానికి ఐదునెలల సమయం పడుతుందని అంచనా. దీని ద్వారా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు' లో స్థానం సంపాదించడంపై కూడా రిక్షావాలా దృష్టి సారించాడు. 2008 లో ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టినా అందులో అతను సఫలం కాలేకపోయాడు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అల్లీపూర్లో మద్యం పట్టివేత
నేడే ఓట్ల పండగ..
మాక్ పోలింగ్ కీలకం
న్యాయవాదుల సంబరాలు
దైవ దర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
వడదెబ్బతో ముగ్గురు మహిళలు మృతి
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నేటి నుంచి నృసింహుని నవరాత్రోత్సవాలు
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement