-
రూ.50 కోట్లకు కుచ్చుటోపీ
దేశ విదేశాల్లో 32 వేల మందిని గొలుసుకట్టు పేరుతో మోసం చేసిన న్యూజిలాండ్ మహిళ కర్ణాటకలో 300 మంది, హైదరాబాద్లో 100 బాధితులు మహిళతో సహా నలుగురి అరెస్ట్ బెంగళూరు : గొలుసుకట్టు వ్యాపారం పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న విదేశీయురాలితో సహా నలుగురు వ్యక్తులను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విదేశీయురాలి చేతిలో దేశ విదేశాల్లో కలిపి దాదాపు 32 వేల మంది మోసపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు మీడియాకు గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. మూలతహా న్యూజిల్యాండ్కు చెందిన డేనిసే అనే మహిళ చట్టవ్యతిరేకంగా గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ సంస్థలో ప్రాథమిక సభ్యుడిగా చేరేవారు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థలో ఏజెంట్గా విధులు నిర్వర్తించేవారు రూ.25 వేలు చెల్లించాలి. ప్రాథమిక సభ్యత్వం పొందినవారు కాని ఏజెంట్గా చేరిన వారు కాని తర్వాత మరో ఇద్దరిని చేర్చాలి. ఇందుకు గాను ప్రాథమిక సభ్యత్వం పొందిన వ్యక్తికి ఒక్కొక్క సభ్యున్ని చేర్పించినందుకు గాను 25 నుంచి 50 శాతం సంస్థ కమీషన్గా చెల్లిస్తుంది. అదే విధంగా నూతనంగా చేరిన వారు మరో ఇద్దరిని చేర్చాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారికి కూడా కమిషన్ అందుతుంది. ఈ మేరకు పాకిస్తాన్, దుబైతోపాటు చాలా దేశాల్లో ఏజెంట్లను చేర్పించుకుని గొలుసుకట్టు వ్యాపారం చేసింది. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో బెంగళూరు నగరాన్ని చేరుకుని ఓ రాజ్భవన్కు దగ్గరగా ఉన్న పంచనక్షత్రాల హోటల్లో బసచేసింది. తర్వాత వివిధ ఇన్సురెన్స్ కంపెనీల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న మహ్మద్ కురుం, కిరణ్ మోది, హితేష్ మోదిని లోబరుచుకుని వారి ద్వారా రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా లావాదేవీలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి విదేశీయురాలు రాజ్భవన్కు దగ్గరలోని హోటల్లో ఉండటం, ఆమె నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కూపీలాగారు. ఖచ్చితమైన సమాచారంతో ఆమె బసచేస్తున్న హోటల్పై దాడిచేశారు. ప్రధాన నిందితురాలు డేనిస్తోపాటు మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్ట్యాప్, కొన్ని హార్డ్డిస్క్లు, ఫోన్లు స్వాధీనం చేసుకుని నిపుణుల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈమె చేతిలో దాదాపు 32,339 మంది రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్లు వెలుగుచూసింది. నిందితులను కబ్బన్పార్క్ పోలీస్స్టేషన్లో సీసీబీ పోలీసులు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. డేనిసే చేతిలో వివిధ దేశాల్లో మోసపోయిన వారు... అమెరిక - 2 వేల మంది, ఇండియా - 1,700, మలేషియా - 28 వేలు, న్యూజిలాండ్ - 500, దుబాయ్ - 200, పాకిస్తాన్ - 100 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో... కర్ణాటక-300, మహారాష్ట్ర-800, ఢిల్లీ-100, పంజాబ్ -100, మధ్యప్రదేశ్ -300, హైదరాబాద్ -100 మంది -
‘సిరిగోల్డ్’ సూత్రధారి జిల్లావాసే
- ఉలవపాడుకు చెందిన వెంకయ్య మరికొందరితో కలిసి సంస్థ ఏర్పాటు - ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాల్లో డిపాజిట్ల రూపంలో రూ.150 కోట్లు వసూలు - ఐదు రోజుల కిందట నెల్లూరులో సంస్థ ఎండీ అరెస్ట్ - బోర్డు తిప్పేయడంతో బాధిత ప్రజలు లబోదిబో - న్యాయం చేయాలంటూ పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు ఒంగోలు క్రైం : గొలుసుకట్టు వ్యాపారం పేరుతో డిపాజిట్లు వసూలు చేసి వాటితో జల్సాలు చేసి చివరకు జనాన్ని నిలువునా ముంచిన సిరి గోల్డ్ సంస్థ బాగోతం వెలుగు చూసింది. ఈ సంస్థ సూత్రధారి ఉలవపాడు మండలం కరేడుకు చెందిన మర్రిబోయిన వెంకయ్య. నెల్లూరుకు చెందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యజమానితో మరో ఐదుగురిని డెరైక్టర్లను కలుపుకుని వెంకయ్య ఈ సంస్థను స్థాపించాడు. కర్ణాటకలోని మైసూరు, గుల్బర్గా పట్టణాలతోపాటు జిల్లాలోని ఒంగోలు, కందుకూరులలో కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. ప్రజల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. నెల్లూరులో ఇచ్చిన చెక్లు బౌన్స కావడం.. సంస్థ కార్యాలయం మూసివేయడంతో తొలుత అక్కడి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు స్పందించలేదు.లాభంలేదనుకుని బాధితులే ఏకమై ఐదు రోజుల కిందట నెల్లూరులో ఉన్న సంస్థ ఎండీ సుందరాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో విషయం రచ్చయింది. వసూలు చేసిన డబ్బుతో జల్సాలు వసూలు చేసిన డబ్బుతో సంస్థ నిర్వాహకులు కొంత మొత్తంతో జల్సాలు చేయగా, మరి కొంతతో బినామీ పేర్ల మీద స్థిరాస్తులు కొనుగోలు చే శారు. తూతూమంత్రంగా తక్కువ ధరకు పనికి రాని పొలాలను కొని సంస్థ పేరు మీద పెట్టారు. జిల్లాలోని కనిగిరి, సీఎస్పురం, పీసీపల్లి, దొనకొండ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాలోని ఈదుమూడి, బోగోలు బిట్రగుంట, వింజమూరు, ఆత్మకూరు, సంఘం ప్రాంతాల్లో ఈ సంస్థ పేరు మీద పొలాలున్నాయి. ఖరీదైన భవనాలు, స్థలాలు, నెల్లూరు, విశాఖపట్నం, బెంగళూరు లాంటి నగరాల్లో సంస్థ నిర్వాహకుల భార్యలు, కుటుంబ సభ్యులు, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళల పేర్ల మీద కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. ఒక్కో నెలలో రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు డ్రా సంస్థలో పని చేస్తున్న దాదాపు ఐదుగురు డెరైక్టర్లలో ఒక్కొక్కరు ఒక్కో నెలలో రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు బ్యాంకుల నుంచి సొంతానికి డ్రా చేశారు. ఆ డబ్బుతో విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేశారు. ఒంగోలులో బ్రాంచి మేనేజర్గా ఉన్న ఓ మహిళ రూ.4 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. ఓ డెరైక్టర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె అందినకాడికి నొక్కేసింది. డెరైక్టర్ వెంకయ్య ప్రస్థానం... ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సాధారణ వ్యక్తిగా ఉన్న మర్రిబోయిన వెంకయ్య తొలుత అగ్రిగోల్డ్ ఏజెంట్గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. సంస్థ కార్యకలాపాలు, లావాదేవీలను ఔపోసన పట్టిన ఆయన సింగరాయకొండకు చెందిన మరికొందరిని కలుపుకొని అక్షయ గోల్డ్ అనే సంస్థను స్థాపించి అనతికాలంలోనే ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సంస్థ డెరైక్టర్ల మధ్య విభేదాలు రావడంతో వెంకయ్య తన వాటాను తీసుకొని బయటకొచ్చాడు. అనంతరం మరికొందరితో కలిసి జీ-9 అనే సంస్థను స్థాపించి డిపాజిట్ల వసూలు కార్యక్రమం చేపట్టారు. అక్కడా విభేదాలు రావడంతో బయటకొచ్చాడు. అనంతరం నెల్లూరులో అతని సామాజిక వర్గానికే చెందిన ఇంజినీరింగ్ కళాశాలల యజమానితో కుమ్మక్కై సిరిగోల్డ్ సంస్థను స్థాపించాడు. సంస్థకు చెందిన వ్యాపార ప్రచార కార్యక్రమాలు గానీ, ప్రజలకు గ్యారంటీ ఇవ్వడంలో గానీ, ఆ ఇంజినీరింగ్ కళాశాలల యజమానినే ముందుంచి గొలుసుకట్టు వ్యాపారాన్ని ముందుకు నడిపించాడు. అయితే సంస్థ డెరైక్టర్లలో కళాశాలల యజమాని పేరు ఎక్కడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తమ్మీద జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కోట్లాది రూపాయలు దండుకుని శఠగోపం పెట్టాడు. ప్రస్తుతం నిందితుడు వెంకయ్య ఒంగోలు బ్రాంచి కార్యాలయంలో ఓ మహిళ ఉద్యోగిని వెంటేసుకొని హైదరాబాద్లో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. ఐదు రోజుల కిందట విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు మెతకవైఖరి అవలంబిస్తున్నారని బాధిత ప్రజలు విమర్శిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement