-
జూన్కు సరళాసాగర్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : భారీగా వచ్చి చేరిన వరద కారణంగా గండి పడ్డ సరళాసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. జూన్ ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే నాటికి నీటి నిల్వకు అనుగుణంగా నీటిపారుదల శాఖ మరమ్మతులు చేయనున్నారు. అప్పటివరకు రింగ్బండ్ నిర్మాణం చేసి, దీనికింద ఉన్న ఆయకట్టుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించనున్నారు. మూడు రోజుల కిందట సరళాసాగర్కు స్పిల్వేకు ఎడమ వైపు కట్టకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా 80మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి దారితీసిన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. కట్టకు బొరియలు ఏర్పడటంలో నీరు అందులోకి చేరి ఉంటుందని, పూర్తిస్థాయి నీటి నిల్వలు చేరడంతో ఒత్తిడికి కట్ట తెగిపోయి ఉంటుందని అంచనా. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలించే నీటితో సరళాసాగర్ కుడి, ఎడమ కాల్వల కింద 4,500 ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఆయకట్టుకు నీటిని అందించేలా రింగ్బండ్, సమాంతర కాల్వను తవ్వాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రాజెక్టుపై ఉన్న ఒక స్లూయిస్ ద్వారా కాల్వలకు 60 క్యూసెక్కుల నీటిని తరలించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తరలించి, అనంతరం తెగిన 80 మీటర్ల కట్ట నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు.ప్రస్తుతం పూర్తి స్థాయి కట్ట నిర్మాణం చేయాలంటే, అంచనాలు రూపొందించి, ప్రభుత్వ అనుమతి తీసుకొని, మళ్లీ డ్రాయింగ్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ జరగడానికి మరో నెల, రెండు నెలల గడువు పట్టే అవకాశం ఉంది. తెగిన కట్ట నిర్మాణానికి కనీసంగా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు మేర ఖర్చవుతుందని అంచనా. -
మట్టి పోసి.. మ..మ అనిపించారు..
- షట్టర్ల కింది మట్టి తొలగింపులో నిర్లక్ష్యం - రింగ్బండ్తో పొంచి ఉన్న ముప్పు - ఆందోళనలో రామప్ప రైతులు వెంకటాపురం : రామప్ప సరస్సు లీకేజీ నీటిని అరికట్టేందుకు తాత్కాలికంగా మట్టితో ఆన కట్ట నిర్మించి ఐబీ అధికారులు చేతులు దులుపుకున్నారు. రామప్ప ప్రధాన తూము నుంచి మూడు రోజులుగా సరస్సు నీరు వృథాగా పోతుందని ‘సాక్షి’లో కథనాలు రావడంతో స్పందించిన అధికారులు ప్రొక్లెయినర్తో తూము ముందు చిన్న ఆన కట్ట నిర్మించి లీకేజీ నీటిని అదుపుచేశారు. కానీ షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాల్సిన పనిని మాత్రం మరిచారు. ఒక భారీ వర్షం కురిసిందంటే తూము ముందు పేరుకుపోయిన మట్టి, రాళ్లు తూములోకి వెళ్లి నిలిచిపోతారుు. అదే జరిగితే ప్రధాన తూము నుంచి ఆయకట్టు పొలాలకు రాబోయే రోజుల్లో చుక్కసాగునీరు కూడా అందే పరిస్థితులు కనిపించడం లేదు. రామప్ప సరస్సును నమ్ముకుని పంటలు సాగుచేసుకుంటున్న రైతాంగానికి ఇక గడ్డుకాలమే ఎదురుకానుంది. రింగ్బండ్ తొలగించకపోతే తమ పంటపొలాలు ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లీకేజీ నీటిని అదుపు చేసిన నీటిపారుదల శాఖ అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి రింగ్బండ్ను తొలగించి షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement