-
ఆ జాదూ..మాములోడు కాదు!
శ్రీశైలం: ఆదాయానికి మించి ఆస్తులు కల్గివుండి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయిన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు గుప్త నిధుల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానానికి ఈఓగా 2013 మార్చిలో బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణదేవి ఆలయం ముందు 30 అడుగులకు పైగా వృత్తాకారంలో గొయ్యి తవ్వించారు. ఆలయ ప్రాకార ఈశాన్యంలో ఒక ధాతువు(ఎముకలాంటిది) కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. అది లభించకపోవడంతో తిరిగి ఆ గోతిని పూడ్చి.. అక్కడ వృత్తాకారంలోనే గోశాల నిర్మించారు. ఇల్యూషన్స్ అనే గ్రంథాన్ని సేకరించి.. దాని ఆధారంగా శ్రీశైలాలయ ప్రాంగణంలోని గుప్త నిధులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ప్రచారంలో ఉంది. చివరకు స్వామివార్ల అంతరాలయం ముందున్న బండను తొలగించే ప్రయత్నం చేసినా.. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆలయ ప్రాంగణంలో కొన్ని పూడ్చివేసిన నీటి గుండాలను తిరిగి తవ్వకాలు జరిపి అందుబాటులోకి తీసుకొచ్చారు. శత్రు వినాశనం, అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగడానికి క్షుద్ర దేవతగా ప్రసిద్ధికెక్కిన బగళాముఖి యాగాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అత్యధిక ప్రాధాన్యతిచ్చి.. పూజాద్రవ్యాలు, నైవేద్యం కోసం భారీగా ఖర్చు చేసి ‘స్వాహా’ అనిపించారు. శ్రీశైల దేవస్థానం చరిత్రలోనే లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. 50 ఏళ్లకు పైగా స్వామివార్ల ఆలయంలో త్రికాలార్చన మాత్రమే కొనసాగుతూ వచ్చింది. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి షట్కాలార్చన పూజలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అభిషేకం అందనంత ఎత్తులో ఉంచేశారు. అభిషేక టిక్కెట్ల ధరలను కూడా విపరీతంగా పెంచేశారు. బగళాముఖి హోమం చేస్తే... బగళాముఖి హోమం చేస్తే శత్రు స్తంభన జరుగుతుందని, అనుకున్న అన్ని పనులు నెరవేరుతాయని నమ్మకం. అందుకే చంద్రశేఖర్ ఆజాద్ దీన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఆయనపై అప్పటికే ఎన్నో వ్యాజ్యాలు కోర్టులో నడుస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ యాగాన్ని ప్రవేశపెట్టారన్న అభిప్రాయం ఆలయ వర్గాల్లో ఉంది. ఇక ఈ హోమం నిర్వహణకు ప్రత్యేక దిట్టాన్ని తయారు చేశారు. హోమంలో వేసే సమిధలు మొదలుకొని.. పూజాధి ద్రవ్యాలతో పాటు నైవేద్యం కోసం భారీగానే దిట్టం సిద్ధం చేశారు. అరకేజీ కేసరి ప్రసాదానికి రూ. 220, అరకిలో పులిహోర ప్రసాదానికి రూ.125లుగా వ్యయాన్ని చూపించారు. వాస్తవానికి అర కిలో కేసరి తయారీకి రూ. 150కి మించదు. దేవస్థానం వారు భక్తులకు ప్రసాదాల విక్రయ కేంద్రం ద్వారా 150 గ్రాముల పులిహోర రూ.5లకే అందజేస్తున్నారు. అలాంటిది బగళాముఖి హోమంలో అర కిలో పులిహోర ప్రసాదానికి రూ.125 వసూలు చేశారు. ఇక యాగ నిర్వహణ కోసం ఆజాద్ నియమించిన రుత్వికుడి నెలసరి వేతనం రూ.25వేలు. ఆయన నివసించడానికి వీలుగా ఉచితంగా వసతిగృహాన్ని కేటాయించారు. కుర్తాళం పీఠాధిపతి శిష్యుడిగా ఉన్న ఈ రుత్వికుడిని అతికష్టం మీద ఒప్పించి తీసుకువచ్చినట్లుగా ఆజాద్ అప్పట్లో చెప్పారు. అయితే.. ఈయన దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఒక దేవస్థానంలో విధులు నిర్వహించి పదవీవిరమణ పొందారనే ఆరోపణలున్నాయి. 30 అడుగులకు పైగా గుంత తీసి.. ఆపై పూడ్చి గోశాలను నిర్మించిన దృశ్యం ఆజాద్ చుట్టూ‘ కోటరీ’ ఆజాద్ ప్రవేశ పెట్టిన ప్రతి పనికి ఎటువంటి వ్యతిరేకత కలగ కుండా చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. అందులోంచి పుట్టిందే వైదిక కమిటీ. దీని సూచన మేరకే ఆయా కార్యక్రమాలు, సంప్రదాయాలకు శ్రీకారం చుట్టినట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. దీనికితోడు మఠాధిపతులు, పీఠాధిపతులను సైతం తన మాయాజాలంతో ముగ్గులోకి దింపారనే విమర్శలున్నాయి. శ్రీ మల్లికార్జునస్వామివార్ల మహాలింగం అరిగిపోతుందని, లింగం చుట్టూ గాడి ఏర్పడిందని, దాన్ని అష్టదిగ్బంధన ప్రక్రియ ద్వారా పూడ్చివేయాలని ఆజాద్ భావించారు. ఈ ఒక్క విషయానికి మాత్రం అటు వైదిక కమిటీ గానీ, ఇటు ఆలయ అధికార సిబ్బంది, ఉభయదేవాలయాల అర్చకులు, వేదపండితులు గానీ సమ్మతించలేదు. కాగా.. అప్పట్లో శ్రీశైలాన్ని సందర్శించిన దేవాదాయ కమిషనర్ వైవీ అనురాధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రతువులు, నూతన సంప్రదాయాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో బగళాముఖి యాగంతో పాటు షట్కాల పూజలను బ్రేక్ పడింది. -
మహానందికి ఆర్జేసీ హోదా
– గత ఐదేళ్లలో ఏడాది ఆదాయం రూ. 8 నుంచి రూ. 15కోట్లు – అన్నదాన పథకానికి రూ. 1.70కోట్ల డిపాజిట్లు మహానంది: రాష్ట్రంలో డిప్యూటీ కమిషనర్(డీసీ)స్థాయి కలిగిన ఐదు దేవాలయాల స్థాయిని పెంచేందుకు దేవాదాయశాఖ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో నందన మహారాజులు, చాళుక్యరాజులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి రాజులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. క్షేత్ర అభివృద్ధికి ధర్మకర్తగా పనిచేసిన భైరవజోష్యుల మహానందయ్య ఎంతగానో కృషి చేశారు. మహానంది దేవస్థానానికి 6–02–1950న కార్యనిర్వహణాధికారి హోదా వచ్చింది. దేవాదాయశాఖ అసిస్టెంటు కమిషనర్(సహాయ కమిషనర్) హోదా 14–07–1989న వచ్చింది. అనంతరం అనతికాలంలోనే 5–07–2002 నుంచి అసిస్టెంటు కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయిని చేరుకుంది. ఏటా పెరుగుతున్న ఆదాయం మహానంది క్షేత్రానికి ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లల్లో రూ. 8 నుంచి రూ. 15కోట్ల స్థాయికి చేరింది. ఈ ఐదేళ్లలో ఒక ఏడాది మాత్రం రూ. 6.28 కోట్లు వచ్చినా ఐదేళ్ల వ్యవధిలో రూ. 7 కోట్లు ఏడాది ఆదాయం పెరగడం విశేషం. అధికారులు, సిబ్బంది ఇంకా కృషి చేస్తే ఏడాదికి రూ. 20కోట్లు వస్తుందని స్థానికులు, భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రూ. 15కోట్ల ఆదాయం వస్తున్న క్షేత్రం జిల్లాలో రెండోది మహానంది మాత్రమే అని తెలుస్తుంది. బంగారు, వెండి ఆభరణాలు పరిశీలిస్తే మహానంది క్షేత్రానికి 821 గ్రాముల 893 మిగ్రా బంగారం, 102 కిలోల 815 గ్రాముల 550 మిల్లీగ్రాముల వెండి ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఇప్పటి వరకు సుమారు రూ. 1.70 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. స్థాయి పెరిగితే మరింత అభివృద్ధి.. రీజనల్ జాయింట్ కమిషనర్( ప్రాంతీయ సంయుక్త కార్యనిర్వహణాధికారి) హోదా పెరిగితే భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వహణాధికారి స్థాయిలో కేవలం రూ.2 లక్షల వరకు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆర్జేసీ హోదా వస్తే ఆర్జేసీ స్థాయిలో రూ. 10 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసి పనులు చేపట్టవచ్చు. అలాగే సిబ్బంది కొరత ఉంటే తన పరిధిలోనే ఏజేన్సీ, లేదా ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవచ్చు. ప్రతి చిన్నచిన్న పనులకు కమిషనర్ వరకు వెళ్లకుండా తనే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. పాలకమండలి సభ్యులు పెరుగుతారు. ఆలయ ప్రచారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement