-
లాలూ ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్.. టెన్షన్లో తేజస్వీ యాదవ్!
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం సడెన్గా మళ్లీ లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించినట్టు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్కు తెలిపారు. తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. లాలూ జీ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉందని.. అనంతరం ఢిల్లీలో పరీక్షించినప్పడు అది 5.1కు పెరిగిందని తెలిపారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. దాణా కుంభకోణం, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ఇటీవలే ప్రత్యేక సీబీఐ కోర్టు.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. దీంతో ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్కు తరలించారు. Lalu Prasad Yadav Ji is undergoing treatment in AIIMS, Delhi. His creatinine level was 4.5 when he was in Ranchi. It increased to 5.1 when it was tested in Delhi. It reached 5.9 when tested again. So the infection is increasing: Tejashwi Yadav, RJD leader and son of Lalu Yadav pic.twitter.com/f1iMxN1vdX — ANI (@ANI) March 23, 2022 -
లాలూకు రాజకీయ రుగ్మత..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ రాజకీయ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన శారీరక ఆరోగ్యం బాగానే ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సీపీ ఠాకూర్ అన్నారు. రాజకీయ అస్వస్థతతో బాధపడుతున్న లాలూ వ్యాధికి ఎయిమ్స్లో ఎలాంటి చికిత్సా లేదన్నారు. లాలూను ఎయిమ్స్ నుంచి రాంచీ ఆస్పత్రికి తరలించడంపై ఆర్జేడీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎయిమ్స్లో లాలూకు హృదయ, మూత్రపిండాల సంబంధిత అస్వస్థతకు చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఎయిమ్స్ నుంచి రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. ‘లాలూకు ఎలాంటి శారీరక రుగ్మతలు లేవు..ఆయన కేవలం రాజకీయ వ్యాధితోనే బాధపడుతున్నారు..దీనికి ఎయిమ్స్ సహా ఎక్కడా చికిత్స లేద’ని స్వయంగా వైద్యుడైన ఠాకూర్ వ్యాఖ్యానించారు.లాలూను రాంచీకి తరలించడం వెనుక కుట్ర జరిగిందని, రాజకీయ ఒత్తిళ్లున్నాయనడం నిరాధార ఆరోపణలని ఠాకూర్ తోసిపుచ్చారు. కాగా మంగళవారం రాంచీ చేరుకున్న లాలూను అంబులెన్స్లో రిమ్స్లోని కార్డియాలజీ విభాగానికి తరలించారు. -
లాలు కొడుకుతో పెళ్లి వార్తలు అబద్ధం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుటుంబంతో పెళ్లిసంబంధం విషయం మాట్లాడినట్టు వచ్చిన వార్తలను ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ తోసిపుచ్చారు. లాలు పెద్ద కొడుకు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్కు తన మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయనున్నట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని రాందేవ్ చెప్పారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఈ కట్టుకథల్ని ప్రచారం చేసిందని విమర్శించారు. గురువారం రాత్రి పట్నా వచ్చిన రాందేవ్.. లాలుతో సమావేశమయ్యారు. దీనిపై రాందేవ్ మాట్లాడుతూ.. లాలుకు అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లానని చెప్పారు. అంతేకాని పెళ్లి సంబంధం లేదా పెద్ద నోట్ల రద్దుపై రాజకీయాల గురించి తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. లాలు దేశ సంపదని, ఆయన ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని రాందేవ్ అన్నారు. -
మాజీ సీఎం అనూహ్య నిర్ణయం
పాట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. బిహారీలు ఘనంగా నిర్వహించే 'ఛాత్' పండుగను ఈ ఏడాది జరుపుకోబోనని సోమవారం మీడియాకు చెప్పారు. పెళ్లైన నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఛాత్ పూజలో పాల్గొంటోన్న రబ్రీదేవీ.. ఒక రకంగా ఆ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. లాలూ ఇంట జరిగే వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని కీలక రాజకీయపక్షాల నాయకులు సైతం హాజరై సందడిచేస్తారు. అయితే ఈ వారాంతంలో జరుగనున్న పండుగకు మాత్రం దూరంగా ఉంటానని రబ్రీ చెప్పారు. ఇంతకీ ఆమె నిర్ణయం వెనుక కారణం ఏమంటే.. ఇద్దరు కొడుకుల పెళ్లి. అవును. లాలూ-రబ్రీ దంపతుల కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల పెళ్లిళ్లు జరిగిన తర్వాతే తాను తిరిగి 'ఛాత్' పూజలో పాల్గొంటానని రబ్రీ దేవి అన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రికాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి పెళ్లి విషయమై గడిచిన కొద్దిరోజులుగా లాలూ కుటుంబం తీవ్ర కసరత్తు చేస్తోంది. మొన్నటికిమొన్న రాష్ట్రంలో సమస్యలు తెలపాలంటూ వాట్సాప్ నెంబర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఏకంగా 44వేల పెళ్లి ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనాసరే వచ్చే ఎండలనాటికి ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేసి, కోడళ్లతో సహా వచ్చే ఏడాది ఛాత్ పండుగ జరుపుకోవాలన్న మాజీ సీఎం కల ఏమేరకు నెరవేరుతుందో చూడాలి! దీపావళి తర్వాతి వారాంతంలో ప్రారంభమయ్యే ఛాత్ పండుగను బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా నేపాల్ లోనూ నాలుగురోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. -
తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య
పాట్నా: దేశ ద్రోహం ఆరోపణల కేసులో అరెస్టయి అనంతరం విడుదలయిన జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తన సొంత గ్రామానికి వెళ్లనున్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో అడుగుపెట్టిన అతడు బెగుసరాయ్లోని తన స్వగ్రామం బిహాత్కు వెళ్లి తన తల్లిదండ్రులను కలవనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం పాట్నా విమానాశ్రయంలో కన్హయ్య కుమార్ కు భారీ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా అతడు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత శద్రఘ్న సిన్హాతో భేటీ అవనున్నాడు. మే 1న పలుచోట్ల బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమంగ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement