-
300 బస్తాల రేషన్ బియ్యం
పీసీపల్లి, న్యూస్లైన్ : ఓ గోడౌన్లో ఉన్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని తలకొండపాడులో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఓ అజ్ఞాత వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ మౌలా సాహేబ్, ఎఫ్ఐ జయశ్రీలు ఆ గోడౌన్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో అక్రమంగా పలు రేషన్ దుకాణాల వద్ద సేకరించిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. డీలర్ పరారీలో ఉండటంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. ఈ డీలర్ అక్రమాలపై నాలుగు రోజుల క్రితం సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది. అప్రమత్తమై 300 బస్తాల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండగా అధికారులు పట్టుకున్నారు. ప్రజాప్రతినిధులతో హెచ్చరికలు జారీ చేయించడంతో గోడౌన్ సీజ్ చేసేందుకు అధికారులు ఒకదశలో వెనకడుగు వేశారు. స్థానికులు వాగ్వాదానికి దిగడంతో సీజ్ చేయక తప్పలేదు. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత మార్కాపురం టౌన్, న్యూస్లైన్ : పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని నంద్యాలకు తరలిస్తుండగా రైల్వేస్టేషన్లో రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఏఎస్ఓ ఆర్.కోటయ్య కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన సుమారు పదిమంది మార్కాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 15 క్వింటాళ్ల బియ్యాన్ని రైల్వేస్టేషన్ లో ఉంచి నంద్యాలకు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. అధికారులు రైల్వేస్టేషన్కు చేరుకుని బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితుల్లో కొందరు పరారీకాగా నంద్యాలకు చెందిన కాళంగి సరస్వతి, సరోజలను అదుపులోకి తీసున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు కోటయ్య తెలిపారు. దాడుల్లో మార్కాపురం, వైపాలెం ఎన్ఫోర్స్మెంట్ డీటీలు ఎ.వేణుగోపాలరావు, జి.హరనాథ్బాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
విజిలెన్స్ దాడులు
కొండపి, న్యూస్లైన్: రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఐ. భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు ముందుగా కొండపిలోని 28వ నంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. మిడ్డే మీల్స్కు సంబంధించిన ఇన్వార్డ్సు, అవుట్వార్డ్సు రిజిస్టర్లు లేవు. స్టాక్ కంటే 742 కేజీల బియ్యం ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1వ నంబర్ దుకాణంలో మిడ్డేమీల్స్కు చెందిన 146 కేజీల బియ్యాన్ని రికార్డులో చూపించలేదు. 6ఏ కేసు నమోదు చేశారు. నివేదికను జాయింట్ కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణాలను మండలస్థాయి అధికారులు నిత్యం తనిఖీ చేయాలని చెప్పారు. డీలర్లు సమయపాలన పాటించి.. మెరుగైన సేవలు అందించాలన్నారు. బిల్లులు లేకుండా మధ్యాహ్న భోజన బియ్యాన్ని డీలర్లకు తరలిస్తున్న గోడౌన్ డీటీపై జేసీకి లిఖిత పూర్వక ఫిర్యాదు అందించనున్నట్లు తెలిపారు. దాడుల్లో దర్శి ఈడీటీ, సింగరాయకొండ ఈడీటీ బ్రహ్మయ్య, యేసుదాసు ఆర్ఐ డేవిడ్రాజ్ పాల్గొన్నారు. కాగా అధికారుల దాడులతో డీలర్లు చెమటలు పోస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు గాను వినియోగదారులకు సరిగా రేషన్ అందించలేదు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని గాభరా పడుతున్నారు. అధికారులు నేరుగా కార్డుదారుల వద్దకు వచ్చి రేషన్ అందుతున్నాయా లేదా.. అని సమాచారం అడుగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ బాధలు తొలగాలని ఆకాంక్షిస్తున్నారు. కనిగిరిలో.. కనిగిరి,న్యూస్లైన్: మార్కాపురానికి చెందిన విజిలెన్స్ అధికారులు రెండు రేషన్ దుకాణాలు, రెండు బియ్యం దుకాణాలను తనిఖీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టినట్లు సహాయ సరఫరా అధికారి ఆర్. కోటయ్య తెలిపారు. కనిగిరి, పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో 10 రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీరి వెంట ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఎ. వేణుగోపాల్, ఎఫ్ఐ ఎస్. చంద్రశేఖర్ ఉన్నారు. అధికారుల రాక ముందుగానే పసిగట్టిన చాలామంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేశారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
48 గంటల ముందు ప్రచారం నిలిపివేత
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
●తీరనున్న తాగునీటి సమస్య
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి
ప్రచారం.. పరిసమాప్తం!
తప్పక చదవండి
- ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
- మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement