-
రేపు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య రాక
కాకినాడ సిటీ : తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గౌతమీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక సరోవర్ పోర్టికోలో బస చేస్తారు. అనంతరం 11 గంటలకు కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఉండూరు సెంటర్లో జువెల్ సిటీ ఫేజ్–2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి గౌతమీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి హైదరాబాద్ వెళతారు. -
ముద్రగడ ఉద్యమంలో నిజాయితీ
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కితాబు కిర్లంపూడిలో స్నేహపూర్వక భేటీ జగ్గంపేట : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం సాగిస్తున్న ఉద్యమంలో నిజాయితీ ఉందని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నా రు. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఆదివారం సాయంత్రం కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. ఆయనకు ముద్రగడ సాదరంగా స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ ముద్రగడతో తనకు చిరకాల స్నేహబంధం ఉందన్నారు. తన ఆరోగ్యం బాగోకపోయినా ప్రాణస్నేహితుడైన ముద్రగడను కలిసేందుకే వచ్చానన్నారు. ఉద్యమనేతగా పేరొందిన ముద్రగడకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని దీవించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు ప్రభుత్వపరంగా అప్పట్లో జీవో తానే ఇచ్చానన్నారు. ముద్రగడ తన భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరి, పెద్దకుమారుడు బాలు, వియ్యంకుడు నరిసే సోమేశ్వరరావులను, కాపు ఉద్యమ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్, గోపు చంటిబాబు, గణేశుల రాంబాబు, తోట రాజీవ్, తోట బాబు, మలకల చంటిబాబు, గోకాడ సత్యనారాయణమూర్తి, సందీప్, గౌతు స్వామి, నరిసే సోమేశ్వరరావు, పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మ¯ŒS వర్దినీడి సుజాత, రాచమళ్ళ వెంకటేశ్వరరావు, అన్నెం శేషు తదితరులను రోశయ్యకు పరిచయం చేశారు. ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం తదితర నియోజకవర్గాలకు చెందిన అనుయాయులు ముద్రగడ ఇంటికి భారీగా తరలివచ్చారు. రోశయ్య వెంట ఏపీ ఐఐసీ మాజీ చైర్మ¯ŒS శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. -
కన్యకాపరమేశ్వరికి బంగారుచీర
పాతపోస్టాఫీసు: పాతనగరంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మూలవిరాట్ను బంగారు చీరతో అలంకరించనున్నారు. 138 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయంలోని మూల విరాట్ను సుమారు 4 కేజీల బంగారంతో తయారుచేయించిన బంగారు చీరను అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల సంఘం కార్యదర్శి యలమర్తి హరనాథ్, అధ్యక్షుడు నల్లూరి నూకరాజు మాట్లాడుతూ నగరంలోని ఆర్యవైశ్య భక్తుల విరాళాల ద్వారా సేకరించిన బంగారంతో వైభవ్ జ్యూయలరీ వారి ఆధ్వర్యంలో బంగారు చీరను తయారు చేయించామని తెలిపారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా ఈనెల 19న అమ్మవారికి చీరను అలంకరించనున్నామని అన్నారు. నగరంలోని భక్తులు యావన్మందీ ఈ వేడుకను కనులారా తిలకించాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement