-
నేటి నుంచి రొట్టెల పండగ
కోరికలు తీర్చే వరాల పండగ వచ్చేసింది. నమ్మకాలకు, మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే రొట్టెల పండగకు నెల్లూరు నగరం ముస్తాబైంది. బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు సర్వాంగ సుందరంగా మారాయి. నమ్మకంతో కోర్కెలు కోరుకుని రొట్టెలు పట్టుకోవడం.. అవి తీరడంతో ఏడాది తర్వాత రొట్టెలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. 1751 సంవత్సరం నుంచి ఏటా జరిగే రొట్టెల పండగ విశిష్టత సరిహద్దులు చేరిపేసింది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి విదేశాల నుంచి భక్తుల రాకకు వేదికగా మారింది. శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమై 25వ తేదీ వరకూ జరిగే కార్యక్రమాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు(వీఆర్సీసెంటర్): రొట్టెల పండగ సందర్భంగా రెండువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదురోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగే పండగకు పలు వివిధ దేశాలు, రాష్టాల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేథ్యంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. బుధవారమే గుంటూరు రూరల్, అర్బన్, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది నగరానికి చేరుకున్నారు. ముగ్గురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 41 మంది సీఐలు, 112 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, 90 మంది హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లు, 399 మంది హోంగార్డులు, 52 మంది మహిళా హోంగార్డులు, 100 మంది ఏఆర్ సిబ్బంది, కృష్ణపట్నం పోర్టుకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది, 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎఫ్ఎస్, సేవాదళ్ బృందాలు, అగ్నిమాక సిబ్బంది బందోబస్తులో ఉంటారు. కమాండ్ కంట్రోల్కు అనుసంధానం రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు, పరిసర ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని కమాండ్ కంట్రోల్రూంకు అనుసంధానం చేశారు. అంతేకాకుండా అత్యాధునిక డ్రోన్ కెమరాలను వినియోగించి నిత్యం బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ అధికారులకు.. విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వీఐపీ, పోలీసు వాహనాలను పొదలకూరురోడ్డులో ఉన్న సాల్వేషన్ ఆర్మీ చర్చి, నర్సింగ్ కళాశాల ప్రాంతం, పోలీసు వసతి గృహం, డీకేడబ్ల్యూ కళాశాలలో, పోలీసు కవాతు మైదాన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన శాఖల అధికారుల వాహనాలను పాత టీబీ ఆస్పత్రి ఆవరణ, నగరపాలకసంస్థ ఆవరణ, జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణాల్లో పార్కింగ్ చేయాలి. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను కొత్త పోలీసు కార్యాలయం, కస్తూరిదేవి స్కూల్ మైదానం, ఉర్దూ మదరాసా స్కూల్ ప్రాంతం, కస్తూరిదేవి స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం, సర్వోదయ కళాశాల మైదాన ప్రాంగణం, పాత సీవీ రామన్ స్కూల్, మాగుంటలేఅవుట్లోని రైల్వే స్థలం రోడ్డు, పిచ్చిరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా, శబరి రామక్షేత్రం రోడ్డు, ఎస్సీ హాస్టల్, ఏసీ సుబ్బారెడ్డి మైదానం, ప్రభుత్వాస్పత్రి ప్రాంగణాల్లో పార్కింగ్ చేయొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ పార్కింగ్ స్థలాల గురించి నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది సూచనలిస్తారు. అందుబాటులో గజ ఈతగాళ్లు రొట్టెలు పట్టుకునే స్వర్ణాల చెరువులో ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది 30 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీరు మూడు షిప్టుల్లో నిరంతరం చెరువు వద్ద పహారా కాస్తారు. పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు దర్గా వద్ద పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పండగ కోలాహలంలో ఎవరైనా తప్పిపోయినా, కనిపించకపోయినా కంట్రోల్ రూంకు వచ్చి ఆనవాళ్లతో సమాచారం అందజేయొచ్చు. మఫ్టీలో సీసీఎస్ సిబ్బందిచైన్ స్నాచింగ్, పిక్పాకెట్, దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున సీసీఎస్ సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ బందోబస్తు చేస్తారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న, అనుభవం ఉన్న వారిని ఏర్పాటు చేశారు. బస్సులు, భారీ వాహనాల మళ్లింపు పండగ నేపథ్యంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల మళ్లిస్తారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయటం జరిగింది. తిరుపతి వైపు నుంచి వచ్చే వాహనాలను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద, కావలి వైపు నుంచి వచ్చే వాహనాలను సర్వోదయ కళాశాల మైదానంలో, ఆత్మకూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ఇరుగాళమ్మ దేవస్థానం, బట్వాడిపాలెం వద్ద, గొలగమూడి, అనికేపల్లి వైపు వచ్చే వాహనాలను మాగుంటలేఅవుట్ వద్ద ఉన్న పిచ్చిరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవచ్చు. -
స్వర్ణాల మురిసింది
-
భక్తజన సందోహం
-
క్రాకర్స్ షో అదుర్స్
-
మదినిండుగ.. వరాల పండుగ
గంధం ముగిసిన రోజు భారీగా తరలివచ్చిన భక్తులు విద్యుత్ స్తంభం విరిగిపడి ఇద్దరికి స్వల్పగాయాలు సాక్షి ప్రతినిధి – నెల్లూరు: రొట్టెల పండుగకు శుక్రవారం భక్త జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంధం ముగిసిన మరుసటి రోజు విశిష్టమైనదిగా భావించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున దర్గాను దర్శించుకుని రొట్టెల పండుగలో పాల్గొన్నారు. 11 గంటల వరకు.. బారాషహీద్ దర్గాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన గంధం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు ఈ రద్దీ కొనసాగింది. ఎండ కారణంగా సాయంత్రం 5 గంటల వరకు భక్తుల సంఖ్య తగ్గింది. 5 గంటల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు తరలి వచ్చారు. పండుగ ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రానికి పొదలకూరు రోడ్డు వైపు నుంచి, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వైపు నుంచి నిండుగా జనం కనిపించారు. స్వచ్చంద సేవా సంస్థలు భక్తులకు మజ్జిగ, తాగునీరు, భోజనం ఉచితంగా అందించాయి. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, కలెక్టర్ ముత్యాలరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి నారాయణ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మేయర్ అజీజ్తో కలసి చెరువులో బోటు విహారం చేసి పర్యాటక శాఖ అందిస్తున్న సేవలను పరిశీలించారు. జనం పెద్దగా లేక పోవడంతో ఉదయం 11 గంటల నుంచి దర్గా ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఆర్చిల వరకు పాసులు లేక పోయినా పోలీసులు వాహనాలను అనుమతించారు. సాయంత్రం నుంచి రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాల రాక పోకలను నియంత్రించారు. దర్గా దర్శనానికి వచ్చిన వీఐపీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదిలా ఉంటే చెరువు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం మధ్యాహ్నం సమయంలో కింద పడి ఇద్దరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కృష్ణపట్నం పోర్టు, సీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి 25 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అప్పుడే ఊడిన ఘాట్ల టైల్స్ చెరువు ఒడ్డున శాశ్వతంగా ఉండే ఉద్దేశంతో నిర్మించి ఫ్లోరింగ్ టైల్స్ శుక్రవారం నాటికే అక్కడక్కడా ఊడిపోయి కనిపించాయి. పనులు వేగంగా చేయాల్సి వచ్చినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పనుల్లో నాణ్యత లేకపోవడం కారణమా? అనేది అధికారులు పరిశీలించాల్సి వుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement