-
కెరీర్ ముగిసిండేది.. జో రూట్పై ఆర్పీ సింగ్ సంచలన కామెంట్స్
రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన రూట్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రివర్స్ ర్యాంప్ షాట్ ఔటయ్యాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో రూట్ను ఉద్దేశించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే షాట్ వేరే ఆటగాడు రంజీల్లో గానీ, క్లబ్ స్థాయి క్రికెట్లోనైనా ఆడి వుంటే అతడు కెరీర్ ముగిసిపోయి ఉండేదని ఆర్పీ సింగ్ అన్నాడు. ముందు బ్యాటింగ్ టెక్నిక్ను సరిచేసుకుని ఆ తరహా షాట్స్ ఆడాలని ఆర్పీ సింగ్ సూచించాడు. కాగా ఈ సిరీస్లో రూట్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్ను కూడా అందుకోలేకపోయాడు. ఇక మూడో టెస్టు విషయానికి వస్తే.. టీమిండియా పట్టుబిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు శుబ్మన్ గిల్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా ప్రస్తుతం ఆధిక్యం 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: IND vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. జైశ్వాల్కు గాయం! ఆట మధ్యలోనే? -
WC 2023: అదొక్కటే ఉంటే సరిపోదు.. కాస్త ఆటపై దృష్టి పెట్టు ఉమ్రాన్! అప్పుడే..
Ex-India Pacer Reminder For Umran Malik: ‘‘అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలంటే వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎవరికైనా గేమ్ ప్లాన్ ముఖ్యం. ఈ విషయంలో అతడు ఇంకా వెనుబడే ఉన్నాడు. అంతేకాదు తన బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా, ప్రపంచకప్ రేసులో తన పేరు వినిపించడానికి కారణం అతడి బౌలింగ్లో ఉన్న వైవిధ్యమైన పేస్ ఒక్కటే. కాబట్టి అతడికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలి. అంతేగానీ ఒక మ్యాచ్ ఆడించి మరో మ్యాచ్లో పక్కన పెట్టడం చేయకూడదు. ఒకవేళ ఉమ్రాన్ నుంచి గనుక సుదీర్ఘకాలం పాటు కీలక పేసర్గా సేవలు అందించాలని కోరుకుంటే.. తప్పకుండా అందుకు అనుగుణంగా అతడు తన నైపుణ్యాలకు పదునుపెట్టేలా శిక్షణ ఇవ్వాలి. అదే బలం.. కానీ నిజానికి వరల్డ్కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఎక్కువే మ్యాచ్లే ఆడబోతోంది. కాబట్టి ఆసియా వన్డే కప్-2023లో 5-6, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగంగా ఉమ్రాన్ను మరికొన్ని మ్యాచ్లు ఆడించే అవకాశం ఉంటుంది. అతడికి ఉన్న బలం పేస్. కానీ బౌలింగ్లో అంతగా పసలేదు. కాబట్టి ఉమ్రాన్ తన స్కిల్స్ మెరుగుపరచుకునే అంశంపై దృష్టి సారించాలి. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలంటే అదొక్కటే మార్గం’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. నెట్బౌలర్గా వచ్చి.. ఏకంగా భారత యువ ఫాస్ట్బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్లో నెట్బౌలర్గా ప్రవేశించిన ఈ కశ్మీర్ ఎక్స్ప్రెస్.. అనతికాలంలోనే జట్టు కీలక బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అసాధారణ వేగంతో మాజీ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా తరఫున.. ఇక గతేడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న అతడు జూన్, 2022లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు తీశాడు. విండీస్ పర్యటనలో.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న ఉమ్రాన్ మాలిక్.. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 3 ఓవర్ల బౌలింగ్లో 17 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్రాన్ అవకాశాల గురించి ఆర్పీ సింగ్ కామెంట్ చేశాడు. రేసులో ఉండాలంటే ఈ యువ పేసర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించాడు. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన ధోని భార్య సాక్షి! సంతోషంలో ఫ్యాన్స్.. ఇక.. -
'ధోని, రోహిత్, కోహ్లి కాదు.. అతడే ఐపీఎల్ సూపర్ కెప్టెన్'
ఐపీఎల్-2023 సీజన్ మరో నాలుగు రోజుల్లో షూరూ కానుంది. మార్చి 31 నుంచి ఈ ధానాధాన్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ ఎంతో మంది క్రికెటర్లు కెప్టెన్లగా తమ సత్తా చాటుకున్నారు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎంస్ ధోని, రోహిత్ శర్మ, కోహ్లి, పాంటింగ్, వార్నర్ వంటి వారు సారథిలగా తమ జట్లకు ఎన్నోచిరస్మరణీయ విజయాలను అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్ను అందించగా.. ధోని సారథ్యంలో సీఎస్కే నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇక కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ టైటిల్ సాధించకపోయనప్పటికీ.. ఒక్క సారి ఫైనల్, రెండు సార్లు ఫైనల్కు చేరింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ ఫేవరేట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్న భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. అతడు చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా తన ఫేవరేట్ కెప్టెన్గా సన్రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ను ఎంచుకున్నాడు. జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీసింగ్ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో నాకు ఇష్టమైన కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు ఆస్ట్రేలియాతో పాటు డెక్కన్ ఛార్జర్స్కు మూడేళ్లపాటు నాయకుడిగా ఉన్నాడు. అతడు సారథిగా మేము తొలి సీజన్లోనే ఛాంపియన్స్గా నిలిచాం. అందుకే గిల్క్రిస్ట్ నా ఫేవరేట్ కెప్టెన్. అనంతరం 2010 సీజన్లో కూడా మేము అద్భుతంగా రాణించాము. దురదృష్టవశాత్తూ ఫైనల్కు చేరడంలో విఫలమయ్యాం" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2009లో గిల్క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్(సన్రైర్స్ హైదరాబాద్) తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అనంతరం 2010 సీజన్లో కూడా డెక్కన్ ఛార్జర్స్ అదరగొట్టింది. ఫైనల్కు చేరడంలో విఫలమైనప్పటికీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్-2023లో సన్రైజర్స్ సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్ వ్యవహరించనున్నాడు. చదవండి: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు' -
ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురి బర్త్డే కూడా ఈరోజే.. ఈ విశేషాలు తెలుసా?
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్డే డిసెంబరు 6నే! భారత ఆల్రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు. ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు 1.జస్ప్రీత్ బుమ్రా- గుజరాత్ ►అహ్మదాబాద్లో జననం ►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్. ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం. ►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్లు ►పడగొట్టిన వికెట్లు: 319. 2. రవీంద్ర జడేజా- గుజరాత్ ►నవగామ్లో జననం ►స్పిన్ ఆల్రౌండర్ ►టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ప్రఖ్యాతి ►ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లలో పరుగులు: 5427 ►పడగొట్టిన వికెట్లు: 482 ►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర ►ముంబైలో జననం ►ఐపీఎల్లో ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా ఉన్నాడు. ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49. ►పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ బ్యాటర్గా గుర్తింపు ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్ ►1985లో రాయ్ బరేలీలో జననం ►లెఫ్టార్మ్ మీడియం పేసర్ ►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్ ►అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. ►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన కరుణ్ నాయర్ ►1991లో జననం ►దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్ ►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ►లంకషైర్లో 1977లో జననం ►1998లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం ►ఇంగ్లండ్ కెప్టెన్గా పనిచేసిన ఆల్రౌండర్ ►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్గా సేవలు ►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్గా ఉన్న ఫ్లింటాఫ్. చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
భారత్ను కాదని ఇంగ్లండ్కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ (సీనియర్) కుమారుడు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్-19 సిరీస్కు హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్తన బ్యాటింగ్తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్-19లో రాణిస్తే.. సీనియర్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్ లంకాషైర్ జూనియర్ టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అండర్-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎక్స్ప్రెక్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్లో దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు. కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్ రుద్రప్రతాప్ సింగ్ సీనియర్ ఇక లక్నోకు చెందిన సీనియర్ రుద్రప్రతాప్ సింగ్(ఆర్పీ సింగ్) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కేవలం రెండు వన్డే మ్యాచ్ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్దేవ్ కెప్టెన్సీలోనే ఆర్పీ సింగ్ ఈ రెండు మ్యాచ్లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్కు ఆడిన ఆర్పీ సింగ్ 59 ఫస్ట్క్లాస్, 21 లిస్ట్ -ఏ మ్యాచ్లు ఆడాడు. ఇక ఆర్పీ సింగ్ బ్రిటన్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్పీ సింగ్ కూతురు కూడా మెడిసిన్ చదవడానికి ముందు లంకాషైర్ తరపున అండర్-19 క్రికెట్కు ప్రాతినిధ్యం వహించింది. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్ ఆర్పీ సింగ్ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్పీ సింగ్(రుద్రప్రతాప్ సింగ్) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్ప్రదేశ్ కావడంతో.. సీనియర్ ఆర్పీ సింగ్కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్ ఆర్పీ సింగ్తో.. జూనియర్ ఆర్పీ సింగ్కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్ ఆర్పీ సింగ్ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్లో ఆర్పీ సింగ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్కప్ జట్టులో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్పీ సింగ్ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! Asia Cup 2022: ఆసియా కప్లో భారత్, పాక్లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement