-
అక్రమ అరెస్టులు సిగ్గుచేటు
సాక్షి, భూపాలపల్లి : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహిస్తుండంగా పోలీసు అక్రమంగా చేయడం సిగ్గుచేటని భూపాలపల్లి రాజకీయ జేఏసీ కన్వీనర్ కొరిమి రాజ్కుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారం 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు, రాజకీయ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తుండగా వారిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ రాజ్కుమార్, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులపై పోలీసులు అతిగా వ్యహరిస్తున్నారని మండిపాడ్డారు. కార్మికులు న్యాయబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తుంటే అసంబంధమైన సమ్మె అనడం సిగ్గు చేటుగా ఉందన్నారు. సీఎం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. ఆర్టీసీకి ఎండీని కూడా నియమించకుండా సీఎం కేసీఆర్ హిట్లర్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఆరెస్టుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం తప్ప మరొకటి లేదన్నారు. అక్రమ అరెస్టులో కార్మికులు నష్టపోయేది ఎంలేదన్నారు. గులాబీ పూలు ఇచ్చి నిరసన ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసిన అనంతరం ప్రైవేట్ డ్రైవర్లకు గులాబీపూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు తమ సమ్మెకు సహకరించాలని ఆర్టీసీ మహిళా కండక్టర్లు వారికి గులాబీ పూలు ఇచ్చి కోరారు. విధులకు హాజరుకాకుండా తమకు సహకరించాలని వేడుకున్నారు. ఆర్టీసీని స్తంభింపచేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని కోరారు. అనంతరం డిపో నుంచి జయశంకర్ విగ్రహం మీదగా అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, సీపీఎం, బీజేపీ, వైఎస్సార్ సీపీ, ఏఐబీఎఫ్, ఏఐటీయూసీ, బీఎంఎస్, ఎంఆర్పీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ నాయకులు తిరుపతి, సమ్మిరెడ్డి, బందు సాయిలు, రామకృష్ణ, రమేష్, శ్రీనివాస్, రాజేందర్, ప్రవీణ్, కర్ణాకర్, రమేష్, సాంబయ్య, తిరుపతి, ఓదెలు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
హైదరాబాద్: బస్సు డ్యామేజి నష్టాన్ని డ్రైవర్లపై వేయడాన్ని నిరసిస్తూ తాండూరు బస్సు డిపో ఎదుట శుక్రవారం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి సొంత ఇలాకా తాండురు బస్సు డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఆ విషయం తెలుసుకున్నమంత్రి మహేందర్రెడ్డి కార్మికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తాండూరు ఆర్టీసీ డీఎంను మంత్రి ఆదేశించారు. దాంతో తాండూరు ఆర్టీసీ డీఎం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
Advertisement