-
జగన్ వస్తేనే.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
తిరుపతి మంగళం: ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసి, కార్మికుల కష్టాలను తీర్చలిగే సత్తా వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని అని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఏర్పాటై ఐదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం తిరుపతి కోటకొమ్మలవీధిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్రెడ్డి, యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరో పిం చారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి చేస్తున్న సహాయ సహకారాలు, నిధుల మంజూరు, పోస్టుల భర్తీ వంటి సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీఎస్ ఆర్టీసీకి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులను ఏపీకే కేటా యించాలని, డీజల్పై ట్యాక్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా సైనికుల్లా పనిచేసి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, చెలికం కుసుమ, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర, జిల్లా కార్యదర్శి టి.రవిశంకర్, జిల్లా కోశాధికారి మారెప్ప, రాష్ట్ర నాయకులు పీసీ బాబు, టీఎస్ఎస్.ప్రసాద్, సీబీ ఎస్.రెడ్డి, పీసీ.బాబు, రాజేంద్ర, టి.రవికుమార్ పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా ప్రచారం
ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అశోక్రెడ్డి, పాలపర్తి డేవిడ్రాజు, పోతుల రామారావు, నియోజకవర్గ ఇన్చార్జ్లు ఉన్నారు. ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేసిన మేలు గురించి వివరించడం ద్వారా ఎక్కువ మంది కార్మికులను పార్టీలోకి వచ్చేలా కృషి చేసే దిశగా ఆయన పర్యటన కొనసాగనుంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement