-
భక్త విజయం: రుద్రాక్షధారణ ఫలితం
చంద్రసేనుడు కశ్మీర రాజు. అతడి కొడుకు సుధర్ముడు. చంద్రసేనుడి మంత్రి గుణనిధి. రాజు కొడుకు సుధర్ముడికి మంత్రి కొడుకు తారకుడికి బాల్యం నుంచి స్నేహం ఏర్పడింది. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. రాజు కొడుకు, మంత్రి కొడుకు ఇద్దరూ ఐశ్వర్యంలో పుట్టిపెరిగిన వారే! ఇద్దరూ అందగాళ్లే! అయినా వారికి రత్నాభరణాలను ధరించడం మీద ఏమాత్రం మోజు ఉండేది కాదు. వారిద్దరూ శివపూజా తత్పరులు. శరీరంపై భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించేవారు. ఎందరు ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా, వారు రత్నాభరణాలను ధరించేవారు కాదు. ఆ బాలురిద్దరి ప్రవృత్తి మిగిలిన బాలురి కంటే కొంత విచిత్రంగా ఉండేది. ఒకనాడు పరాశర మహర్షి చంద్రసేనుడి వద్దకు వచ్చాడు. చంద్రసేనుడు ఎదురేగి పరాశరునికి స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. ఆయనకు ఈ విచిత్ర బాలురిద్దరినీ పరిచయం చేశాడు. ‘స్వామీ! ఇతడు నా కుమారుడు సుధర్ముడు. అతడి పక్కనున్నవాడు నా మంత్రి కుమారుడు తారకుడు. వీరిద్దరి ప్రవర్తన కొంత వింతగా ఉంటోంది. మిగిలిన బాలల మాదిరిగా అలంకరణలపై ఆసక్తి చూపరు. శరీరంపై నిత్యం భస్మత్రిపుండ్రాలు ధరించి, రుద్రాక్షమాలలు వేసుకుని తిరుగుతుంటారు. మేమంతా ఎంతగా నచ్చచెప్పినా రాజోచితమైన రత్నాభరణాలను ధరించడం లేదు. వీరికి బాల్యంలోనే ఇంతటి వైరాగ్య ప్రవృత్తి ఎందుకు కలిగిందో మాకెవరికీ అర్థం కావడంలేదు. మీరే వీరి సంగతి చెప్పాలి’ అన్నాడు చంద్రసేనుడు. పరాశరుడు దివ్యదృష్టితో ఆ బాలురిద్దరి వృత్తాంతాన్నీ గ్రహించాడు. ‘రాజా! దిగులు చెందకు. వీరి ప్రస్తుత ప్రవృత్తికి కారణం వీరి పూర్వజన్మలోనే ఉంది’ అంటూ ఆ బాలురి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. ‘పూర్వం నందిగ్రామంలో మహానంద అనే గణిక ఉండేది. ఆమె మహా ఐశ్వర్యవంతురాలు. ఆమె సౌధంలో రత్నరాశులు విరివిగా ఉండేవి. పాడిపంటలతో ఆమె సమృద్ధిగా తులతూగేది. సర్వాలంకారభూషితగా ఉండేది. కులవృత్తిరీత్యా ఆమె స్వేచ్ఛాసంచారిణిగా ఉండేది. అయినా, ఆమె శివదీక్షా తత్పరురాలు. తన ఇంట నిత్యం శివపూజ చేసేది. శివాలయాలకు విరివిగా దానాలు చేసేది. శివభక్తులైన బ్రాహ్మణులను ఆదరించి, వారు కోరిన దానాలు ఇచ్చేది. వినోదం కోసం ఆమె ఒక కోతిని, ఒక కోడిని పెంచుకునేది. వాటికి భస్మత్రిపుండ్రాలతోను, రుద్రాక్షలతోను అలంకరించేది. వాటిని నాట్యమండపానికి తీసుకొచ్చి, వాటితో ఆటలాడించేది. రుద్రాక్షలు ధరించిన కోతి బాలకునిలా ఆ గణిక ముందు నృత్యం చేసేది. కోతి నృత్యాన్ని చూసి కోడి కూడా నాట్యమాడేది. వాటి ప్రదర్శన చూపరులకు ఆనందం కలిగించేది. ఇలా చాలాకాలం గడిచింది. ఒకనాడు శివదీక్షాపరుడైన ఒక వర్తకశ్రేష్ఠుడు ఆ గణిక ఇంటికి వచ్చాడు. భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షమాలలు, రత్నకంకణ కేయూరాది ఆభరణాలను ధరించి, చూడటానికి అపర కుబేరుడిలా ఉన్నాడు. మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడిని సాదరంగా ఆహ్వానించి, పూజించింది. అతడికి సపర్యలు చేసింది. అతడితో కబుర్లాడుతూ, ‘మహాత్మా! మీరు ధరించిన రత్నకంకణం స్త్రీలు ధరిస్తే శోభిస్తుంది. మీ కంకణం ధరించాలని నాకు మక్కువగా ఉంది’ అని అంది. ‘అంత కోరికగా ఉంటే నా కంకణాన్ని నీకిస్తాను. మరి దీనికి మూల్యంగా ఏమిస్తావు?’ అన్నాడు ఆ వర్తకుడు. ‘అయ్యా! నేను గణికను. మీ కంకణాన్ని నాకు అనుగ్రహిస్తే, అందుకు బదులుగా మూడు రోజులు మీకు భార్యగా నడుచుకోగలను’ అని బదులిచ్చింది. అందుకు సంతోషంగా సమ్మతించిన వర్తకశ్రేష్ఠుడు ఆమెకు తన కరకంకణాన్ని ఇచ్చాడు. దానితోపాటు రత్నఖచితమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు. ‘ఈ శివలింగం నాకు ప్రాణప్రదమైనది. దీనిని జాగ్రత్తగా భద్రపరచు. దీనికి భంగం కలిగితే, నాకు ప్రాణభంగమే’ అని చెప్పాడు. మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడు ఇచ్చిన కంకణాన్ని అలంకరించుకుని, అతడిచ్చిన శివలింగాన్ని తన పూజామందిరంలో భద్రపరచింది. నాటి రాత్రి ఆ వర్తకుడితో గడిపి నిద్రించింది. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఆ గణిక ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల వేడికి మేలుకున్న గణిక ఇంట్లో కట్టేసి ఉన్న కోతికి, కోడికి కట్లు విప్పి వాటిని బయటకు విడిచిపెట్టింది. ఇంటిని మంటలు కమ్మేస్తుండటంతో ఆమె, ఆమె వెనుకనే వర్తకుడు బయటకు వచ్చేశారు. వాళ్లు చూస్తుండగానే ఇల్లు భస్మీపటలమైంది. పూజామందిరంలో భద్రపరచిన శివలింగం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ప్రాణప్రదమైన శివలింగం దగ్ధమవడంతో ఆ వర్తకుడు ప్రాణత్యాగం చేశాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం అతడితో మూడురోజులు గడపాల్సి ఉండగా, అతడు ఒక రోజు గడిచేసరికే ప్రాణత్యాగం చేయడంతో ఆ గణిక చాలా దుఃఖించింది. ఆమె కూడా అతడితో పాటే ప్రాణత్యాగం చేసింది. ఆమె విడిచిపెట్టిన కోతి, కోడి కొన్నాళ్లకు కాలధర్మం చెందాయి. గణిక వద్ద పెరిగినప్పుడు భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించిన కోతి, కోడి ఇప్పుడు నీకు, నీ మంత్రికి కొడుకులుగా పుట్టారు. పూర్వజన్మ స్నేహమే వారి మధ్య నేటికీ కొనసాగుతోంది. ధార్మికులైన వీరిద్దరూ మీ తర్వాత జనరంజకంగా ప్రజలను పరిపాలించి, చివరకు శివసాయుజ్యాన్ని చేరుకుంటారు’ అని చెప్పాడు పరాశరుడు. –సాంఖ్యాయన ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..! -
మెడలో రుద్రాక్ష ఉంటే పాటించాల్సిన నియమాలు ఏంటీ ?
-
ఆధ్యాత్మిక శోభ
రుద్రాక్ష పేరు తలిస్తేనే మనసులో ఆధ్యాత్మిక సౌరభం నిండిపోతుంది. అందుకే, రుద్రాక్ష ఆభరణాలకూ శోభను చేకూర్చుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో ధరించడానికి అనువుగా కొందరు బంగారు, వెండి మాలలుగా తయారు చేయించుకుంటారు. ఫ్యాషన్ ఆభరణాలలోనూ రుద్రాక్ష తనదైన వైవిధ్యాన్ని చూపుతుంది. నేడు వీటిని యువత కూడా తమదైన స్టైల్లో ధరించడానికి ఉత్సాహపడుతున్నారు. -
లాజిక్ లేకుండా మాట్లాడొద్దు.. హిజాబ్ వాదనలపై సుప్రీం అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలల్లో హిజాద్ నిషేధంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదికి కోర్టుకు మధ్య వాదోపవాదనలు వాడివేడిగా సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం కూడా ఓ హక్కు అని న్యాయవాది దేవ్దత్ కమాత్ కోర్టుకు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా.. అహేతుకంగా మాట్లాడవద్దని న్యాయవాది దేవ్దత్కు సూచించారు. ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? అని ప్రశ్నించారు. దీనికి దేవ్దత్ స్పందిస్తూ స్కూళ్లలో ఎవరూ దుస్తులు తీసేయరని పేర్కొన్నారు. అసలు సమస్య ఏంటంటే.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించాలని ఓ వర్గం వారు మాత్రమే కోరుకుంటున్నారు, మిగతా విద్యార్థులంతా డ్రస్ కోడ్ను పాటిస్తున్నారని జస్టిస్ హేమంత్ గుప్తా అన్నారు. మిగతా వర్గాల వారు మేం అది ధరిస్తాం, ఇది ధరిస్తామని చెప్పడం లేదని పేర్కొన్నారు. న్యాయవాది దేవ్ దత్ మాట్లాడుతూ.. స్కూళ్లలో కొంతమంది విద్యార్థులు మతపరమైన రుద్రాక్షను కూడా ధరిస్తున్నారని కోర్టుకు చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. రుద్రాక్షను షర్టు లోపలే ధరిస్తారని, రుద్రాక్ష ఉందా? లేదా ? అని ఎవరూ చెక్ చేయరని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లలో హిజాబ్ను నిషేధించడాన్ని హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుగుతోంది. చదవండి: భారత్ జోడో యాత్ర.. లేఖ విడుదల చేసిన సోనియా -
ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ
జూబ్లీహిల్స్: ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్రూమ్లోని అల్మారాలో నుంచి ఖరీదైన ఆభరణాలు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్ షేక్పేట నాలా సమీపంలో ఉన్న ఆదిత్య హిల్టాప్ అపార్ట్మెంట్స్లో పురుషోత్తంరెడ్డి అనే వ్యాపారి నివసిస్తున్నాడు. పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. వచ్చి చూసేసరికి అల్మారాలో ఉన్న ఖరీదైన రుద్రాక్ష గొలుసుతో పాటు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్తో ఘటనపై విచారణ చేపట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement