-
వెయ్యి కాదు....రూ.5వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోవటంతో రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు. -
షరతులు, పరిమితులను నిరసిస్తూ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఎన్నికల హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్దమైంది. ఈ నెల 4న ఏపీలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. వ్యవసాయ మాఫీపై షరతులు, పరిమితులు విధించడాన్నినిరసిస్తూ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేయాలని పద్మరాజు డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ పథకాలను కొనసాగించాలి: రుద్రరాజు
సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్కు, ఆయన మంత్రి వర్గానికి సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పేరొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు స్థానిక ఇందిరాభవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలనాదక్షత, అపార అనుభవమున్న కేసీఆర్ సీఎంగా మంచి పాలన అందిస్తారనే నమ్మకముందన్నారు. అయితే, కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ విజ్ఞతతో కొనసాగిస్తారన్న ఆశాభావం, విశ్వాసం కూడా తమకుందని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రె స్ ఓడిపోయినా ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. -
'బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవం'
హైదరాబాద్ : మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవమని సీమాంధ్ర పీసీసీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. బొత్స కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు పీసీసీ చీఫ్గా పనిచేసిన ఆయన కాంగ్రెస్ను వీడుతారనుకోవటం లేదన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి...చేసేదొకటి అని పద్మరాజు మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ఆయనకు తెలియదని ధ్వజమెత్తారు. రుణమాఫీ అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. అందుకే చంద్రబాబు ఆల్ఫ్రీ బాబు అని ప్రజలు వ్యంగ్యంగా చెప్పుకుంటున్నారని పద్మరాజు అన్నారు. సామాజిక న్యాయం అంటూ ఏళ్ల తరబడి బీసీలను టీడీపీ మోసం చేస్తోందని సీమాంధ్ర పీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్ ఆరోపించారు. బీసీలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీమాంధ్ర సీఎం పదవికి బీసీ పేరును ప్రతిపాదించాలని సవాల్ విసిరారు. -
'సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవు'
హైదరాబాద్ : సమైక్య రాష్ట్ర ఉద్యమ తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్రానికి రావాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై సీమాంధ్ర మంత్రుల్లో అభిప్రాయ భేధాలు లేవని ప్రభుత్వ విప్ పద్మరాజు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అంశంపై తాజా రాజకీయ పరిణామాలను చర్చించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు గురువారం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశం కానున్నట్లు తెలిపారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పద్మరాజు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement