-
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ రుణమాఫీ..!
కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అన్నదాతల ఆశలు ఫలించాయి. లక్షలోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా సదరు ప్రక్రియ నాలుగేళ్ల అనంతరం తుదిదశకు చేరుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానమైంది సాగురంగమే. ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడే ఉమ్మడి కరీంనగర్ది ప్రత్యేక ముద్ర. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు పంటలకు ప్రసిద్ధి కాగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో బ్యాంకు రుణంతోనే ఏటా రెండు పంటలను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా దిగుబడులు ఒక్కోసారి దిగదుడుపే. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ ప్రకటనే రైతులకు ధైర్యాన్నిస్తుండగా మాఫీ అమలు ఆగుతూ సాగింది. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారికి రుణమాఫీ ప్రకటించగా ఉమ్మడి జిల్లాలో 3,49,474 మంది లబ్ధి చేకూరనుంది. రూ.1200 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది. ఆగుతూ సాగిన ప్రక్రియ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా నాలు గు విడతలుగా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది. రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు ఒకసారి, రూ.50 వేలలోపు మరోసారి, రూ.75 వేలు, రూ.లక్ష చివరిసారి ఇలా నాలుగు విడతలుగా మాఫీ ఇలా 2019లోనే సదరు ప్రక్రియ పూర్తికావాలి. కానీ.. కేవలం రూ.25 వేల లోపు రుణం తీసుకున్నవారికి మాత్రమే మొదటి విడత మాఫీ చేశారు. ఆ త ర్వాత మిగతా ప్రక్రియ ఆగిపోయింది. ఓసారి సమాచారం సేకరించడం మళ్లీ అటకెక్కించడం చేశారు. మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో 15,200 మంది లబ్ధిపొందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,663, పెద్దపల్లి జిల్లాలో 14,636, జగిత్యాల జిల్లాలో 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. వడ్డీ డబ్బులు తిరిగొచ్చేనా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కర్శకులు రుణమాఫీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుందని ప్రకటించడంతో చాలామంది రుణాలు తిరిగి చెల్లించలేదు. వడ్డీ డబ్బులు కడుతూ వచ్చారు. మొత్తంగా రూ.400ల కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు సమాచారం. ధాన్యం డబ్బులు ఖాతాలో జమైతే చాలు బ్యాంకర్లు వాటిని రుణానికి మిత్తికింద జమచేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికి పైగా రైతులది ఇదే పరిస్థితి. 2019లోనే పూర్తిగా రుణమాఫీ జరగాల్సి ఉండగా నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాఫీ చేసినా పెద్దగా రైతులకు ఒరిగిందేమి లేదని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 76,791 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉండగా రాజన్న సిరిసిల్ల 57,210, పెద్దపల్లి 78,064, జగిత్యాల జిల్లాలో 76 వేల మంది రైతులు ఇప్పటికీ రెన్యువల్ కింద వడ్డీ చెల్లిస్తూ రుణాలు తీసుకుంటున్నారు. రైతుబాంధవుడు సీఎం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా, రైతాంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్ఆర్బీఎం పరిమితులు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం కృషి చేస్తున్నారు. నేడు రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, కాళేశ్వరం జలాలతో రాష్ట్రాన్ని ధాన్యగారంగా తీర్చిదిద్దారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
టీడీపీ హయాంలో దగాపడ్డ రైతన్న
సాక్షి, చిత్తూరు రూరల్: తెలుగుదేశం రుణమాఫీ హామీ మాయలో రైతులు ఓడిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో పరపతి కోల్పోయారు. 2014 ఎన్నికల ముందు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న బాబు .. ఆ తర్వాత మాట మార్చి సవాలక్ష నిబంధనలతో నాలుగున్నరేళ్లు దాటినా అరకొర రుణమాఫీతో చుక్కలు చూపించారు. 2019 ఎన్నికలు సమీపిం చడంతో రైతుల ఓట్లను దండుకోవడానికి రూట్ మార్చారు. అన్నదాత సుఖీభవ అంటూ నారా మంత్రంతో మళ్లీ రైతులను నట్టేట ముంచడానికి సిద్ధమయ్యారు. అయితే మట్టిని నమ్ముకున్న రైతన్నలు నిన్ను నమ్మం బాబూ.. ఈ సారీ రైతు బిడ్డ, ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డికే మా మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 2013 డిసెంబర్ నాటికి అన్ని రకాల వ్యవసాయ రుణాలు 5,800 మంది ఖాతాల్లో రూ. 78.2 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇవన్నీ బేషరతుగా మాఫీ చేయాలి. కానీ అలా చేయలేదు. కమిటీలు, నిబం ధనలు, షరతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేసి మాఫీ సొమ్ముపై కొర్రీలు వేశారు. ఆంక్షల కారణంగా 4,296 మంది రైతులు మాత్ర మే రుణమాఫీకి అర్హులయ్యారు. 1,504 మంది అనర్హులని వేటు వేశారు. దీంతో వారందరూ చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతులెత్తేశారు... అంతంతమాత్రంగా చేసిన మాఫీ రుణాన్ని విడతల వారీగా అంటూ మాఫీ పత్రాలతో మాయ చేశారు. ఇవన్నీ చూసి రైతులు కంగుతున్నారు. మాఫీ కోసం బ్యాంకులు వ్యవసాయశాఖ, కలెక్టరేట్, కార్యాలయాలు తిరిగి అలసిపోయారు. ఇందుకోసం రోజుల తరబడి పనులు మానేసి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా చాలా మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు అరకొర మాఫీకి నోచుకున్నారు. నాలుగు, ఐదు విడతలకు గాను రూ. 345 లక్షలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తున్నా అతీగతీ లేకపోయింది. ఎన్నికల మాయ.. రుణమాఫీని గాలికొదిలేసిన చంద్రబాబు తర్వాత ఎన్నికల కొత్తమాయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ రైతులను మోసం చేయడానికి అన్నదాత సుఖీభవ పేరుతో ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. రైతుల ఖాతాలోకి రూ. 1000 చొప్పున జమ చేసి రైతుల కంట్లో కారం చల్లుతున్నారు. ఇదీ కూడా అరకొరగానే జమ కావడంతో రైతాంగం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రైతులకు నేనున్నా.. ‘రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుం డా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం రూ.12, 500 ఇస్తాం. రైతులందరకీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గిట్టుబాటు ధర కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం’ అంటూ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. న్యాయం లేదు.. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోవిందరెడ్డి. చిత్తూరు మండలంలోని తాళంబేడు గ్రామం. ఇతనికి 2.33 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2012లో ఈ పొలంపై బ్యాంకులో రూ. 60 వేలు రుణం తీసుకున్నా రు. ఇందుకు గాను అతనికి వడ్డీతో కలిపి ఇప్పటి వరకు రూ. 97.50 వేలకు అప్పు చేరింది. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇతనికి రుణం పూర్తిగా మాఫీ అవుతుందని సంబరపడ్డారు. తీరా ఒక్కపైసా కూడా మాఫీ కాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన న్యాయం జరగడం లేదని గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి రుణం తీర్చుకున్నా.. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరుమొగిలిరెడ్డి. ఇతనిది మండలంలో టీ.వేపనపల్లి గ్రామం. ఎకరా పొలంకు రూ. 47 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నారు. చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ నుంచి ఇతనికి ఒక్క పైసా రాలేదు. బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. చేసేదీ లేక వారి సమక్షంలో వడ్డీకి అప్పు చేసి బ్యాంకు రుణం తీర్చుకున్నారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు. ఆశలు అడియాసలు చేశారు టీ. వేపనపల్లె గ్రామానికి ఈయన పేరు మునిరత్నం రెడ్డి ఇతనికున్న 2 ఎకరాలకు గాను రూ. 65 వేలు బ్యాంకులో అప్పు చేశారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణమాఫీ అవుతుందని భావించారు. బ్యాంకుకు వడ్డీ, అసలు కట్టడం మానేశారు. చివరకు వారి నిరాశే మిగిలింది. రుణమాఫీకి వీరు అర్హులు కారని ప్రభుత్వం పక్కనబెట్టింది. బ్యాంకు నుంచి ఒత్తిడి రావడంతో తీసుకున్న రుణాన్ని ఏడాది క్రితమే వడ్డీతో కలిపి చెల్లించారు. -
చేతకాకపోతే తప్పుకోండి
సాక్షి, విజయవాడ: రైతులకు న్యాయం చేయలేకపోతే గద్దె దిగండి.. మీకంటే చక్కగా పాలించే వారు చాలామంది ఉన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతును రాష్ట్రానికి రాజుగా చేద్దామని నినాదాలు చేస్తున్నారు.. నిజానికి రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారన్నారు. రూ.5వేల కోట్ల తో ధరల స్థిరీకరణ అన్నారు.. రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అన్నారు.. కనీసం అవికూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు రైతులను రుణగ్రస్తులను చేశారని, సహకార సొసైటీలను తెలుగు తమ్ముళ్లు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. రైతుల పేరుతో మిల్లులకు ధాన్యం అమ్మినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోట్ల రూపాయల మేర మిల్లర్లతో కలిసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే లెవీగా ఇస్తున్నారన్నారు. ఈ అక్రమార్కులకు మంత్రులే అండగా నిలుస్తున్నారని, కృష్ణాజిల్లా ముస్తాబాద్ సొసైటీలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని పార్థసారథి అన్నారు. -
రైతులు చస్తుంటే షోకులా?
సచివాలయంపై జీవన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ లేక, ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మూఢవిశ్వాసాల కోసం సచివాలయాన్ని కూల్చేసి, కొత్త భవనాలతో షోకులు చేసుకుంటారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాల పేరిట దారిమళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఆయా పథకాలకు, లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు జీవన్రెడ్డి లేఖ రాశారు. కరువు మండలాల్లోని రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ నిధులను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన బకారుులను వెంటనే చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి, ఫీజు రీరుుంబర్స్మెంటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదన్నారు. రూ.720 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి 8 నెలలు దాటుతున్నా రైతులకు అందించలేదని విమర్శించారు. 4 నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపుల్లేవని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులను ఇవ్వడం లేదని చెప్పారు. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యాయా, లేదా చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement