-
రన్నరప్ భారత్
తౌరంగ (న్యూజిలాండ్): టైటిల్ పోరులో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. బెల్జియంతో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా 1–2 గోల్స్తో ఓడిపోయింది. దీంతో నాలుగు దేశాల ఇన్విటేషనల్ తొలి అంచె టోర్నీలో భారత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను మన్దీప్ సింగ్ 19వ నిమిషంలో సాధించగా... టామ్ బూన్ (4వ ని.),డాకియెర్ (36వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను గెలిపించారు. నాలుగో నిమిషంలోనే బెల్జియం సఫలమైంది. బూన్ చేసిన గోల్తో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత రెండో క్వార్టర్లో భారత్కు మన్దీప్ గోల్ సాధించిపెట్టాడు. దీంతో 1–1తో స్కోరు సమమైంది. అయితే మూడో క్వార్టర్ మొదలైన ఆరు నిమిషాలకే డాకియెర్ చేసిన గోల్తో మళ్లీ బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకుంది. రెండో అంచె టోర్నీ ఈనెల 24న మొదలవుతుంది. -
రన్నరప్ ఆంధ్రప్రదేశ్
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్లు రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాయి. మంగళూరులో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల, జూనియర్ బాలబాలికల విభాగాల ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్ జట్లు ఓటమి పాలయ్యాయి. ‘చద్దా కప్’ కోసం జరిగిన మహిళల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 0-2తో కేరళ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. తొలి సింగిల్స్లో ఆర్తీ సారా 21-18, 21-12తో వృశాలిపై... డబుల్స్లో ఆర్తీ సారా-శ్రుతి 21-12, 21-12తో పూజ-సోనికా సాయిలపై గెలిచారు. ‘నారంగ్ కప్’ కోసం జరిగిన బాలుర ఫైనల్స్లో కేరళ 2-0తో ఆంధ్రప్రదేశ్ను ఓడించింది. తొలి సింగిల్స్లో అరుణ్ జార్జి 21-6, 21-17తో బాలూ మహేంద్రపై; డబుల్స్లో అరుణ్ జార్జి-శ్యామ్ ప్రసాద్ 21-17, 21-15తో కేపీ చైతన్య-గంగాధర రావులపై నెగ్గారు. ‘షఫీ ఖురేషీ కప్’ కోసం జరిగిన బాలికల ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్ 1-2తో కర్ణాటక చేతిలో ఓడింది. తొలి సింగిల్స్లో వృశాలి 21-16, 21-14తో శిఖా గౌతమ్పై నెగ్గి ఆంధ్రప్రదేశ్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. అయితే డబుల్స్ మ్యాచ్లో పూజ-సోనికా సాయి జోడి 13-21, 18-21తో శిఖా గౌతమ్-మహిమా అగర్వాల్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1-1వద్ద సమమైంది. నిర్ణాయక రెండో సింగిల్స్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కె.శ్రీ కృష్ణప్రియ 21-15, 22-24, 16-21తో మహిమా అగర్వాల్ చేతిలో ఓడిపోవడంతో రాష్ట్ర జట్టు ఓటమి ఖాయమైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement