-
చిన్న పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కరోనా తర్వాత భారీ సంఖ్యలో చిన్న పట్టణాలకు తిరిగి వలసపోవడమే కారణమని హౌసింగ్ డాట్ కామ్ నివేదిక తెలియజేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇళ్ల కొనుగోలు, అద్దె ఇళ్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ‘‘హౌసింగ్ డాట్కామ్ ప్లాట్ఫామ్పై గడిచిన కొన్ని నెలల కాలంలో నివాసిత గృహాలకు ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అమృత్సర్, చండీగఢ్, నాగ్పూర్, విజయవాడ, కోయంబత్తూర్ తదితర పట్టణాల విషయంలో ఈ పరిస్థితి కనిపించింది’’ అంటూ ఎలారా టెక్నాలజీస్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. హౌసింగ్ డాట్ కామ్, మకాన్, ప్రాప్టైగర్ పోర్టళ్ల మాతృ సంస్థయే ఎలారా టెక్నాలజీస్. ‘‘కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం.. ఉద్యోగపరమైన అనిశ్చితులు ప్రజలను తిరిగి తమ ప్రాంతాలకు తరలిపోయేందుకు దారితీసింది. అసంఘటిత రంగంలోని వారితోపాటు.. సంఘటిత రంగంలోనూ ఉద్యోగాలు పోవడం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎక్కువ మంది తిరిగి సొంత పట్టణాలు, చిన్న పట్టణాలకు వలసబాట పట్టారు’’ అని నివేదిక వివరించింది. దీనివల్ల చిన్న పట్టణాల్లో ఇళ్ల కొనుగోలుకు, అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడమే కాకుండా, ఈ కామర్స్ సంస్థల వృద్ధికి కూడా తోడ్పడినట్టు తెలిపింది. పెద్ద పట్టణాల్లో పడిపోయిన అమ్మకాలు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ దేశంలోని ఏడు ప్రథమ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 29,520 యూనిట్లు అమ్ముడుపోయాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలు 55,080 యూనిట్లతో పోలిస్తే 46 శాతం తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణేలో కరోనా కారణంగా డిమాండ్ స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 57% క్షీణించి 87,460 యూనిట్లు (ఒక యూనిట్:ఒక ఇల్లు/ఫ్లాట్)గా ఉన్నాయి. కానీ, 2019 ఇదే కాలంలో 2,02,200 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 12,730 యూనిట్లకు పడిపోగా, తర్వాతి త్రైమాసికం జూలై–సెప్టెంబర్లో విక్రయాలు రెట్టింపునకు చేరినట్టు అన్రాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. కరోనా ముందస్తునాటితో పోలిస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో విక్రయాలు 65 శాతం సాధారణ స్థితికి చేరినట్టు చెప్పారు. -
గ్రామీణ డిమాండ్పై వర్షాభావ ప్రభావం: జైట్లీ
దుబాయ్: దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం గ్రామీణ ప్రాంత డిమాండ్పై పడిందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సోమవారం పేర్కొన్నారు. పెట్టుబడిదారులతో ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో వృద్ధి రేటు 7.3 శాతం పైనే నమోదవుతుందని అన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు మరింత మెరుగుపడుతుందని కూడా తెలిపారు. భారత్కు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా జైట్లీ యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్లో రెండు రోజుల పర్యటన జరుపుతున్నారు. దేశంలో వ్యాపార అవకాశాలను ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇన్వెస్టర్లకు వివరిస్తున్నారు. భారీ వృద్ధి రేటు సాధన లక్ష్యంగా కేంద్రం ఆర్థిక సంస్కరణల బాటలో ముందుకు వెళుతుందని తెలిపారు. పెట్టుబడిదారులకు సానుకూల రీతిలో పన్నుల వ్యవస్థను సరళీకరిస్తామని ఈ సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement