-
వేసవి మంచినీటి ప్రణాళిక ఖరారు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రూ.204.75 కోట్లతో ప్రణాళికను సిద్ధంచేసింది. జూన్ నెలాఖరు వరకు ఏయే ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు కార్యాచరణను రూపొందించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 13,065 గ్రామ పంచాయతీలను 48,363 నివాస ప్రాంతాలుగా వర్గీకరించారు. ఎండలు బాగా ఉండే రోజుల్లో గరిష్టంగా 8,407 నివాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని వారు అంచనా వేశారు. వీటిలో 2,055 ప్రాంతాలలో పశువులకూ తాగునీటి కొరత ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఆయాచోట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,103 ప్రాంతాలకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో 1,064, 980 చొప్పున నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.185.99 కోట్లు కాగా, ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.185.99 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుందని.. పంపు సెట్ల ద్వారా సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకులను నింపేందుకు రూ.5.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో ఉండే బావులను అద్దెకు తీసుకుని నీటిని తోడుకునేందుకు రూ.2.71 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. మరోవైపు.. బోర్ల లోతు పెంచడానికి, బావుల్లో పూడికతీత వంటి అవసరాలకు మరో రూ.10.25 కోట్లు దాకా ఖర్చవుతుందని తేల్చారు. -
ఆర్డబ్ల్యుఎస్ అధికారి బలవన్మరణం
అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డబ్ల్యుఎస్ విభాగం ఈఈ ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కనక సింహన్(55) ఎనిమిది నెలలుగా అనారోగ్య కారణంగా సెలవులో ఉన్నారు. అనంతపురం నాయక్నగర్లోని ఓ అపార్టుమెంట్లో కుటుంబంతో ఉంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో పొరుగింటి వారు చూడటంతో ఆయన ఆత్మహత్య విషయం బయటకు తెలిసింది. అయితే, కుటుంబ కలహాలు కూడా ఆయనను బలవన్మరణానికి పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement