-
అయ్యప్పలూ.. తస్మాత్ జాగ్రత్త!
ఒంగోలు క్రైం: జిల్లా నుంచి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములు, యాత్రికులు టూర్ ఆపరేటర్లు, కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులు, సైబర్ కేఫ్ ఆపరేటర్లతో మోసవపోవద్దని ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుదూర ప్రాంతాలకు యాత్రలకు వెళ్లే స్వాములను కొందరు మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది వివిధ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లిన యాత్రికులు అనేక రకాలుగా మోసపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే కేరళ డీజీపీ జిల్లా పోలీసు కార్యాలయానికి పంపిన లేఖకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. గతేడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వెబ్సైట్ను కొందరు వినియోగించుకుని యాత్రికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేశారని, యాత్రికులకు నకిలీ బుకింగ్ కూపన్లు ఇవ్వడంతో పాటు శబరిమలలో అదనపు సౌకర్యాలు కల్పిస్తామని మోసం చేసినట్లు ఎస్పీ చెప్పారు. శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కేరళ పోలీసులు వర్చువల్ క్యూ సిస్టం పేరిట వెబ్సైట్ను రూపొందించారన్నారు. ఆ వెబ్సైట్ నుంచి ముందుగా దర్శనం టిక్కెట్లను ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న బుకింగ్ కూపన్లను ప్రింట్ తీసుకుని యాత్రికులు విధిగా తమ వెంట తీసుకెళ్లాల్సి ఉందన్నారు. సన్నిదానం వద్ద పోలీసులు ఆ కూపన్లను పరిశీలించి అనంతరం అయ్యప్పస్వామి దర్శనం కోసం ఎంట్రీ కార్డు ఇస్తారన్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి జనవరి వరకు శబరిమల యాత్రకు వెళ్లేవారు ఈ ఉచిత వెబ్సైట్ సర్వీసును ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ముందు బుక్ చేసుకున్న వారికి ముందే దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తారని కేరళ డీజీపీ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే శబరిమల యాత్రీకులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తిరిగి ఇంటికి రావచ్చని ఎస్పీ వివరించారు. కేరళ పోలీసుల సూచనలు పాటించాలి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వాములు కేరళ పోలీసుల సూచనలను విధిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ఉచిత వెబ్సైట్ను ఉపయోగించుకొని యాత్ర సుఖంగా సాగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వెబ్సైట్ గురించి పూర్తిగా తెలియకుంటే బాగా పరిచయం ఉన్న వారి సేవలను వినియోగించుకున్న తర్వాతే శబరిమల వెళ్లాలని ఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు. -
విషాదం నింపిన శబరిమల యాత్ర
=తమిళనాడులో రోడ్డు ప్రమాదం =నలుగురు మృత్యువాత =కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు =బసినికొండ, బురకాయలకోటలో విషాదఛాయలు మదనపల్లెక్రైం, న్యూస్లైన్: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు మాలలు వేసుకున్నారు. 41 రోజులు నియమనిష్టలతో పూజలు చేశారు. శబరిమలై వెళ్లారు. స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తూ తమిళనాడులోని పళణి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. టెంపో ట్రావెలర్ డ్రైవర్ అజాగ్రత్త నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో శబరిమ లై యాత్ర విషాదంగా ముగిసింది. మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ పరిధిలోని రామాచార్లపల్లె, బసినికొండకు చెందిన 22 మంది అయ్యప్పమాల ధరించారు. ఆదివారం టెంపో ట్రావెలర్లో శబరిమలైకు బయల్దేరారు. అయ్యప్పను దర్శించుకుని సంతోషంగా తిరుగు పయనమయ్యా రు. మార్గమధ్యంలోని తమిళనాడు రాష్ట్రం పళణి సమీపంలోని దిండుగల్ రోడ్డులోని తేనె వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బసినికొండకు చెందిన రెడ్డిప్రసాద్(24), భవన నిర్మాణ కార్మికుడు బంట్రోతు చండ్రాయుడు(54), పెద్దరెడ్డెప్ప (40), ములకలచెరువుకు చెందిన టెంపో ట్రావెలర్ యజమాని ఇమాంసాహెబ్ (35) మృత్యువాతపడ్డారు. వాహనంలో ఉన్న మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో బాబు, యుగంధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. ఎమ్మెల్యే షాజహాన్బాషా బసినికొండ, రామాచార్లపల్లెకు చేరుకు ని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనా స్థలం కోయంబత్తూరు ఎంపీ పరిధిలోకి రావడంతో అక్కడి ఎంపీతో మాట్లాడి మృతదేహాలకు సకాలంలో పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడికి తరలించే చర్యలు తీసుకున్నారు. అన్యాయం చేసి వెళ్లిపోయావా.. గోవిందరాజులు, సుశీలమ్మకు రెడ్డిప్రసాద్ ఒక్కడే కుమారుడు. తండ్రి టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. తల్లి టిఫి న్ సెంటర్ నిర్వహిస్తోంది. వారు అష్టకష్టాలుపడి కుమారుడ్ని బీటెక్ చదివిం చారు. రెడ్డిప్రసాద్ మంచిమార్కులతో బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సమయంలో తోటి స్నేహితులు, బంధువులు మాలవేయడంతో వారితో పాటు మాలవేసి శబరిమలై వెళ్లాడు. పళణి వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ‘ఇంత అన్యాయం చేసి వె ళ్లిపోయావా అంటూ వారు విలపిస్తున్నారు. ఉద్యోగం చేసి ఆసరాగా ఉంటాడనుకుంటే దేవుడు మాకు కడుపుకోత మిగిల్చాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక మాకు దిక్కెవరు సామీ... రామాచార్లపల్లెకు చెందిన బంట్రోతు చండ్రాయుడు(54) భవన నిర్మాణ కా ర్మికుడు. ఇతనికి భార్య లక్ష్మిదేవి, కుమార్తెలు సునీత, మధులత, కుమారుడు కిరణ్కుమార్ ఉన్నారు. చండ్రాయుడు ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. కుమారుడ్ని బీటెక్ వరకు చదివించాడు. చాలా కాలంగా అయ్యప్పమాల ధరిస్తూ శబరిమలైకు వెళ్లి వస్తున్నాడు. ఈ సారి స్నేహితులు, బంధువులతో మాల వేయించి శబరిమలైకు వెళ్లాడు. తిగిరి వస్తూ మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో తమకు దిక్కెవరు సామీ అంటూ అతని భార్య, పిల్లలు బోరున విలపిస్తున్నారు. భవిష్యత్ ఎలా.. రామాచార్లపల్లెకు చెందిన పెద్దరెడ్డెప్ప ఆటో నడుపుతూ, కాంట్రాక్టు పనులు చేసేవాడు. ఇతని ఇద్దరు భార్యలు. సుబ్బలక్ష్మి, లత. కుమార్తె సునంద, కు మారుడు మౌనేష్. గ్రామంలో చురుగ్గా ఉంటూ అందరికీ సాయపడేవాడు. పళ ణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మధ్యాహ్నం వరకు మృత్యువుతో పోరాడాడు. రెడ్డెప్ప మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్యలు ఇద్దరూ కుప్పకూలి పోయారు. బిడ్డల భవిష్యత్ ఎలా అంటూ సుబ్బలక్ష్మి రోదించడం అందరినీ కలచివేసింది. నాన్న చనిపోయాడంటూ పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. బురకాయలకోటలో విషాదం.. బురకాయలకోటకు చెందిన ఇమాం సాహెబ్(35) ఉపసర్పంచ్గా పనిచేశాడు. టెంపో ట్రావెలర్కు యజమాని. డ్రైవర్ మహేష్కు సహాయకుడిగా శబరిమలైకు వెళ్లా డు. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇమాంసాహెబ్ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యా రు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement