-
పది వేల కోసం చంపేశాడు
► ఏపీ సీపీఎం కార్యదర్శి మధు మేనల్లుడి దారుణహత్య ► డబ్బు కోసం హష్మీని హత్య చేసిన స్నేహితుడు నరేశ్ ► చందానగర్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జి వద్ద ఘటన సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మేనల్లుడు వల్లిపల్లి హష్మీ దారుణహత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం స్నేహితుడే అతడిని పాశవికంగా హత్య చేశాడు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల్కు చెందిన గగరిన్, పద్మశ్రీల కుమారుడు హష్మీ(26) ఎంటెక్ పూర్తి చేశాడు. హెచ్సీఎల్లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు మకాం మార్చి బల్కంపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 19న నానక్రాంగూడ వేవ్రాక్లోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చేరాడు. అయితే హష్మీ అద్దెకుంటున్న ఇంటి పక్కనే 20 రోజుల క్రితం ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన పల్నాడు నరేశ్కుమార్రెడ్డి అద్దెకు దిగాడు. ఐటీఐ చేసి ఎలక్ట్రీషియన్గా కొంతకాలం పనిచేసిన నరేశ్ ఆ తర్వాత పని మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. అప్పులపాలైన నరేశ్ ఇంటి పక్కనే ఉన్న హష్మీతో పరిచయం పెంచుకున్నాడు. అసలేం జరిగింది.. సోమవారం సాయంత్రం సైబర్టవర్కు వచ్చిన నరేశ్, హష్మీకి ఫోన్ చేసి ఎక్కడున్నావనగా కూక ట్పల్లి దాటానని చెప్పడంతో వెనక్కి వస్తే ఇద్దరం కలసి వెళదామన్నాడు. దీంతో తిరిగి వచ్చిన హష్మీతో లింగంపల్లిలో స్నేహితుడిని కలసి వెళ్దామని చెప్పాడు. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జికి రాత్రి 8.15 గంటల సమయంలో చేరుకున్న వీళ్లు బైక్ పార్క్ చేసి అవతలివైపు వెళ్లారు. తన స్నేహితుడు రాలేదని నరేశ్ చెప్పడంతో బ్రిడ్జి వద్ద పార్క్ చేసిన బైక్ దగ్గరకు హష్మీ బయలుదేరాడు. అండర్ బ్రిడ్జి కింది నుంచి వెళితే తొందరగా వెళ్తామని నమ్మించి, లోపలికి వెళ్లగానే రూ.పది వేలు ఇవ్వాలని అడిగాడు. అంత డబ్బు లే దని, రూమ్కు వెళ్లి మాట్లాడదామన్నాడు. అయినా వినకుండా కిందకు తోసేసి బండరాయితో తలపై బలంగా మోదాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హష్మీ బ్యాగ్, పర్సు, ఏటీఎం కార్డులు, గోల్డ్ చైన్, రూ.600 నగదు, బైక్ తీసుకుని ప్రకాశ్నగర్లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. రక్తపు మరకలు చూసి ఇదేంటని స్నేహితులు అడగగా బైక్పై నుంచి పడ్డానని చెప్పాడు. డ్రెస్ను బీకే బార్ వీధిలోనూ.. పర్సు, బ్యాగ్ను మెట్రో వెనకాల పడేశాడు. హష్మీ కాల్డేటా ఆధారంగా నిందితుడు నరేశ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద మృతదేహాన్ని నిందితుడు చూపించడంతో ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం హష్మీ మృతదేహాన్ని గద్వాలకు తరలించి అంత్యక్రియల్ని పూర్తి చేశారు. అమ్మ అంటే ఇష్టం. ఏపీ సీపీఎం కార్యదర్శి మధు బావమరిది కొడుకైన హష్మీకి తల్లి పద్మశ్రీ అంటే ఎనలేని ప్రేమ. ప్రతిరోజు 3, 4 గంటలకోసారి తల్లికి ఫోన్ చేస్తుంటాడని బంధువులు తెలిపారు. 23న మధ్యాహ్నం తల్లితో మాట్లాడిన హష్మీ రాత్రి ఫోన్ చేయలేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. హష్మీ హత్యకు గురయ్యాడని బుధవారం ఉదయం తెలుసుకున్న అతని తల్లి షాక్కు గురైంది. మరోవైపు హష్మీ హత్యోదంతంతో గద్వాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. హష్మీ హత్య ఎంతో బాధ కలిగించిందని, ఐటీ కారిడార్లో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారని, వారికి భద్రత పెంచాలని పోలీసులకు సూచించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఘొల్లుమన్న గద్వాల
► సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మీ హత్యోదంతం ► అలుముకున్న విషాదఛాయలు శోకసంద్రంలో కుటుంబసభ్యులు ► పరామర్శించిన నాయకులు కంటతడి పెట్టిన స్నేహితులు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు.. అల్లారుముద్దుగా పెంచి.. ఉన్నత చదువులు చదివించారు. ఆ యువకుడు అమ్మానాన్న కలలు కన్నట్టుగానే ఉన్నతోద్యోగం సంపాదించాడు. హైదరాబాద్లో ఉంటున్నా.. ఇంటికి ఫోన్చేయకుండా ఏరోజూ ఉండలేదు. ఉన్నట్టుండి రెండు రోజులుగా ఫోన్ మూగబోయింది. ఇంతలో కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రుల్లో కలవరం. బంధువులు, అతడి స్నేహితుల వద్ద ఆరాతీసే క్రమంలో ఓ చేదునిజం.. తమ కుమారుడు ఇక లేడని.. హైదరాబాద్లో దారుణహత్యకు గురయ్యాడని తెలుసుకుని తల్లడిల్లిపోయారు. ఇదీ గద్వాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మీ విషాదాంతం.. గద్వాల : సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మీ (24) అదృశ్యం విషాదాంతంగా ముగి సింది. ఈ యువకుడు హత్యకు గురయ్యాడని తెలియగానే గద్వాల పట్ట ణం ఘొల్లుమంది. తోటి స్నేహితులు ఉద్వేగానికి లోనయ్యారు. స్థానిక లిం గంబాగ్కాలనీలో నివాసముంటున్న పద్మశ్రీ, గగారిన్ దంపతుల ఏకైక కుమారుడు హష్మీ హైదరాబాద్ నగరంలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇక తల్లిదండ్రులు గద్వాల పట్టణంలో షూమార్ట్ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నివాళులర్పించిన నాయకులు అనంతరం బాధిత కుటుంబ సభ్యులను వివిధ రాజకీయ నాయకులు పరామర్శించారు. మొదట హష్మీ మృతదేహంపై మేనమామ, సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధుపూలమాలలు వేసి నివాళులర్పిం చా రు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణమోహన్రెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభాకర్, వెంకటస్వామి, రామన్గౌడ్, స్వామిరెడ్డి పూలమాలలు వేశారు. రాత్రి కృష్ణానది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న స్థానికులు హష్మీ మరణ వార్త విన్న వెంటనే స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో లింగంబాగ్కాలనీకి చేరుకున్నారు. సౌమ్యుడిగా అందరితో కలగలుపుగా ఉండేవాడని, వారు తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం హష్మీ మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రు లతోపాటు కుటుంబ సభ్యులు గద్వాలకు చేరుకున్నారు. ‘ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడమ్మా.. అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారంరోజుల క్రితమే సీసీఎల్ కంపెనీ నుంచి మారి టీసీఎస్లో ఉద్యోగం చేరాడన్నారు. ఈ సంఘటన స్థానికులను కలచి వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement