-
టీచర్స్ జాక్టో చైర్మన్గా సదానందగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకుంది. సమితి చైర్మన్గా జి.సదానందగౌడ్, కార్యదర్శిగా ఎం.రాధాకృష్ణ, కోశాధికారిగా కె.కృష్ణ, ప్రచార కార్యదర్శిగా కల్వదర్శి చైతన్య, కో–చైర్మన్లుగా కొంగల వెంకట్, సిహెచ్.శ్రీనివాస్, జి.హేమచంద్రుడు, డీవీ రావ్, వైఎస్ శర్మ, అలీంబాబా ఎన్నికైనట్టు జాక్టో ఓ ప్రకటనలో తెలిపింది. ఉపాధ్యాయ సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలని ఈ సందర్భంగా జాక్టో తీర్మానించింది. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. -
రాష్ట్రంలో ‘రైల్వే’ అభివృద్ధి కోసం వినతి
మార్కాపురం, న్యూస్లైన్ : రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని గుంటూరు డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత, మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఆదివారం బెంగళూరులో రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ‘న్యూస్లైన్’తో ఫోన్లో మాట్లాడారు. గుంటూరు-గుంతకల్ మధ్య డబుల్ లైన్ పనులు వేగవంతం చేయాలని, మచిలీపట్నం-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ను రోజూ నడపాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. కర్నూలు-విజయవాడ వయా మార్కాపురం మీదుగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని, గుంటూరు-హైదరాబాద్ మధ్య ఫాస్ట్ పాసింజర్ రైలు తేవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విజయవాడ-ముంబయి వయా నంద్యాల మీదుగా సూపర్ఫాస్ట్ రైలు నడపాలని, మార్కాపురం రైల్వేస్టేషన్ను మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దాలని మంత్రికి విన్నవించినట్లు వివరించారు. మార్కాపురం-గుంతకల్ మధ్య విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. మార్కాపురం రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకారం అందిస్తానని సదానందగౌడ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మార్కాపురం-శ్రీశైలం మధ్య రైల్వేలైన్ ఏర్పాటు విషయాన్ని కూడా తాము మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నీటి సంఘం అధ్యక్షులు గుంటక వెలుగొండారెడ్డి, మొగుళ్లూరి మల్లికార్జునరావు, కొప్పరపు శ్రీనివాసరావు, గొట్టం నాగార్జునరెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement