-
అలాంటి వాటితోనే మరింత భయం: టాలీవుడ్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తాజాగా ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రకటించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ తీసుకున్నవారు మరింత భయపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై టాలీవుడ్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను స్పందించారు. వ్యాక్సిన్పై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కోవిషీల్డ్ గురించి వస్తున్న వార్తలపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ భయం కంటే.. ఇలాంటి సగం సగం నాలెడ్జ్ కథనాలతో కలిగే ఒత్తిడి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ప్రశాంతంగా, సరదాగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్ ప్రభావం గురించి ఓ క్లిప్ను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ ఏడాది శైలేశ్ కొలను తెరకెక్కించిన సైంధవ్ సంక్రాంతి రిలీజైన సంగతి తెలిసిందే. For people who have been terrified after the news about Covishield broke out. The stress from all the memes and half baked articles will damage you more than anything else. Stay calm and have fun. pic.twitter.com/DGgxn4mGXG— Sailesh Kolanu (@KolanuSailesh) April 30, 2024 -
అఫీషియల్: మూడు వారాల్లోనే ఓటీటీకి సైంధవ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు సందడి చేశాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మిగిలిన మూడు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీ వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. (ఇది చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?) శైలేశ్ కొలను డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. -
ఆ చిత్రంపై సైంధవ్ డైరెక్టర్ ప్రశంసలు!
సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తోన్న చిత్రం రామ్ (RAM). ఈ చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన సైంధవ్ డైరెక్టర్ శైలేశ్ కొలను ప్రశంసలు కురిపించారు. రామ్ ప్రీమియర్ షో చూసిన డైరెక్టర్ శైలేష్ కొలను ప్రత్యేకంగా చిత్రయూనిట్ను అభినందించారు. ఈ సినిమా కథాంశం, అందులోని సోషల్ మెసేజ్ గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాను అద్భుతంగా తీశారని ప్రశంసించారు. ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం బాగుందని కొనియాడారు. చిత్రయూనిట్కు మంచి విజయం చేకూరుతుందని శైలేష్ అన్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ షోలతో రామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తోంది. -
భారీ ధరకు సైంధవ్ ఓటీటీ రైట్స్.. పోటీపడి మరీ దక్కించుకున్న ఆ సంస్థ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీలైన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ఇప్పటికే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వెంకటేశ్ సైతం సైంధవ్ సినిమాతో పోటీలో నిలిచారు. అయితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా ఓటీటీ ఫ్లాట్ఫామ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. వెంకీమామ చిత్రం ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైంధవ్ ఓటీటీ డీల్ వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పోటీపడి సొంతం చేసుకున్నట్లు నెట్టింట వార్త తెగ వైరలవుతోంది. అయితే సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల స్క్రీన్స్పై సైంధవ్ అలరిస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై ట్విటర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకునికి అర్థమైపోయింది. ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. తాజాగా రిలీజ్ కాగా.. నెటిజన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ సీన్స్లో ముఖ్యంగా వెంకీమామ ఇరగదీశాడని ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. సెంటిమెంట్స్ సీన్స్ కూడా హార్ట్కు టచ్ చేస్తాయని చెబుతున్నారు. ప్రతి సీన్ గూస్బంప్స్ తెప్పిస్తోందని.. ఇంటర్వెల్ ట్విస్ట్ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ⭐⭐⭐/5 Venky mawa before movies tho compare chesthey better story Mainly fights , sankranti Paisa vasool#saindhavreview #Saindhav #venkatesh #Venky75 pic.twitter.com/BSJU3YLBXB — #Gunturkaaram (@renutv9) January 12, 2024 #Saindhav saidhev day... postive talk premieres shows🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aUDtYnrGEo — venkyarjunnaidu (@DukkaNaidu65634) January 13, 2024 Positive reviews Venky mama done & dusted 💥❤️🩹#SaindhavOnJan13th #Saindhav #Venkatesh pic.twitter.com/o4y5Xd7v6f — Bharath (@Bharath_9180) January 13, 2024 #SaindhavReview - ⭐⭐⭐⭐⭐ It's a best movie of #Venkatesh , Lot's of Action, lot of Twist and Turn and Interval is literally mind-blowing. Goosebump 🔥🔥🔥#Saindhav #Venky75 pic.twitter.com/yDMPAMu7no — AMIR ANSARI (@amirans934) January 12, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement