-
ఆసక్తి రేపుతున్న ‘సైనా’ ట్రైలర్
ముంబై: బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ‘దారిలో వెళ్లటం ఒకటైతే దారి చూపటం అనేది మరొకటి.. నువ్వు ఆ రెండో దానిపై దృష్టి సారించాలి’ అని సైనాకు తన తల్లి చెప్పే డైలాగ్తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. సైనా పాత్రలో నటించడానికి పరిణీతి చాలా సాధన చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చిన్నతనంలో సైనా బ్యాడ్మింటన్ అకాడమీలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఒలింపిక్స్ మెడల్ గెలిచి వరల్డ్ నంబర్ వన్గా నిలిచే వరకు ఆమె కెరీర్లోని పలు అంశాలను కళ్లకు కట్టినట్లు ట్రైలర్లో చూపించే ప్రయత్నం చేశారు. చైనా వాల్ను బద్ధలు కొడతా.. అంటూ సైనా చెప్పే మరో డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. SAINA🏸🙏🏻 This women's day I am proud to bring to you - SAINA🏸🙏🏻 In cinemas 26th March. Watch the trailer now - https://t.co/Egh5NSWJyI@NSaina #AmoleGupte #ManavKaul @eshannaqvi #BhushanKumar @deepabhatia11 @Sujay_Jairaj @raseshtweets #KrishanKumar @AmaalMallik — Parineeti Chopra (@ParineetiChopra) March 8, 2021 ‘ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ముందుకు ‘సైనా’ మూవీ టైలర్ను తీసుకురావటం పట్ల చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడే ట్రైలర్ చూడండి’ అని హీరోయిన్ పరిణీతీ చోప్రా ట్వీటర్లో పేర్కొంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన ‘సైనా’ మూవీ మార్చి 26 ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. -
త్రివర్ణ శోభితం...
తొలి రోజే విరజిమ్మిన పసిడి వెలుగులను భారత క్రీడాకారులు చివరి రోజు వరకూ కొనసాగించారు. ఫలితంగా గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ను భారత్ అంచనాలకు మించిన ప్రదర్శనతో దిగ్విజయంగా ముగించింది. పోటీల ఆఖరి రోజు త్రివర్ణాలైన స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత క్రీడాకారుల ఖాతాలో చేరడం విశేషం.బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ స్వర్ణం సాధించగా... పీవీ సింధు రజతం దక్కించుకుంది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ రజతం సొంతం చేసుకోగా... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం రజతం సాధించింది. మహిళల స్క్వాష్ డబుల్స్ విభాగంలో దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప జంట రజతం గెల్చుకోగా... టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్లో మనిక బాత్రా – సత్యన్ జ్ఞానశేఖరన్... పురుషుల సింగిల్స్లో ఆచంట శరత్ కమల్ కాంస్య పతకాలు నెగ్గారు. ఆఖరి రోజు ఏడు పతకాలు సాధించిన భారత్ ఓవరాల్గా 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్ (15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి 64 పతకాలు)తో పోలిస్తే స్వర్ణ పతకాల విషయంలో పురోగతి సాధించింది. ‘గోల్డ్ కోస్ట్’లో భారత్ మూడో స్థానంలో నిలిచి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2010 ఢిల్లీ గేమ్స్లో భారత్ అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సాధించింది. 2002, 2006 గేమ్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్, 1990 గేమ్స్లో ఐదో స్థానాన్ని పొందింది. గోల్డ్కోస్ట్: మొదటి నుంచి మొదలైన పతకాల వేటను చివరి రోజు వరకు కొనసాగిస్తూ భారత క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్కు ఘనమైన ముగింపు ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఏడు పతకాలను దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ఇద్దరు భారత స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య జరిగిన ఫైనల్లో సైనా పైచేయి సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా 21–18, 23–21తో సింధును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ గేమ్స్ చరిత్రలో సైనాకిది రెండో వ్యక్తిగత స్వర్ణం. 2010 గేమ్స్లోనూ ఆమె ఈ ఘనత సాధించింది. చీలమండ గాయం కారణంగా టీమ్ విభాగంలో బరిలోకి దిగని సింధుపై తుది పోరులో సైనా ఆధిపత్యం చలాయించింది. సింధు సంధించిన స్మాష్లకు కొన్నిసార్లు సైనా వద్ద సమాధానం లేకపోగా... సైనా కొట్టిన డ్రాప్ షాట్లకు సింధు చేతులెత్తేసింది. తొలి గేమ్ ఆరంభంలోనే 9–4తో ముందంజ వేసిన సైనా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ గేమ్లోనూ కీలకదశలో సైనా పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘నేను పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగాను. నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేశాను. అయితే ఈ రోజు నాది కాదంతే’ అని ఓటమి తర్వాత సింధు వ్యాఖ్యానించింది. శ్రీకాంత్కు నిరాశ... పురుషుల సింగిల్స్లో స్వర్ణం నెగ్గాలని ఆశించిన భారత స్టార్, ప్రపంచ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు. మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీతో జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–14తో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్ సందర్భంగా లీ చోంగ్ వీని ఓడించిన శ్రీకాంత్ అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయలేకపోయాడు. ఈ క్రీడల్లో లీ చోంగ్ వీకిది మూడో వ్యక్తిగత స్వర్ణం. అతను 2006 మెల్బోర్న్, 2010 ఢిల్లీ గేమ్స్లోనూ స్వర్ణాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జంట తడబాటు... ఈ క్రీడల్లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం స్వర్ణ పతక పోరులో నిరాశపరిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 13–21, 16– 21తో మార్కస్ ఎలిస్–క్రిస్ లాన్గ్రిడ్జ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా ఈ గేమ్స్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ జంట గుర్తింపు పొందింది. మనిక ఖాతాలో నాలుగో పతకం... టేబుల్ టెన్నిస్ (టీటీ)లో చివరి రోజు భారత్కు రెండు కాంస్యాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక పోరులో మనిక బాత్రా–సత్యన్ జంట 11–6, 11–2, 11–4తో భారత్కే చెందిన ఆచంట శరత్ కమల్–మౌమా దాస్ జోడీపై గెలిచింది. ఈ గేమ్స్లో మనికకు ఇది నాలుగో పతకం కావడం విశేషం. ఆమె మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం, సింగిల్స్ విభాగంలో స్వర్ణం, డబుల్స్ విభాగంలో రజతం గెల్చుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో శరత్ కమల్ 11–7, 11–9, 9–11, 11–6, 12–10తో సామ్యూల్ వాకర్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. ఫైనల్లో ఓడిన దీపిక–జోష్నా జోడీ గ్లాస్గో గేమ్స్లో మహిళల డబుల్స్ స్క్వాష్ విభాగంలో స్వర్ణం నెగ్గిన దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప (భారత్) జంట ఈసారి మాత్రం రజతంతో సంతృప్తి పడింది. ఫైనల్లో దీపిక–జోష్నా ద్వయం 9–11, 8–11తో జోలీ కింగ్– అమందా (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరిన్ని పతకాలు సాధించేవాళ్లం... కామన్వెల్త్ క్రీడల్లో మొత్తంగా మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. టీమ్ ఈవెంట్లో మలేసియాను ఓడించి మనం స్వర్ణం నెగ్గడమే అన్నింటికంటే అద్భుతం. నా దృష్టిలో ఈ టోర్నీ అశ్విని సొంతం. సాత్విక్–అశ్విని జంట టీమ్ ఈవెంట్లో విజయం సాధించి భారత్ను 1–0తో ముందంజలో నిలపడమే ఆ తర్వాత లీ చోంగ్ వీపై శ్రీకాంత్ చెలరేగి ఆడేందుకు కావాల్సిన స్ఫూర్తినిచ్చింది. మిక్స్డ్ డబుల్స్లో కూడా సాత్విక్–అశ్విని జోడి పతకం నెగ్గాల్సింది. ఓవరాల్గా చూస్తే కఠిన పరిస్థితుల్లో మన షట్లర్లు ఒకే రోజు రెండేసి మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ల షెడ్యూలింగ్లో కాస్త అదృష్టం కలిసొస్తే మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరేవి. సైనా ఆటతీరు ఎంతో మెరుగైంది. ముందుగా టీమ్ మ్యాచ్లు బాగా ఆడి ఆ తర్వాత వ్యక్తిగత ఈవెంట్లలో కూడా సైనా రాణించడం చెప్పుకోదగ్గ అంశం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఒలింపిక్ పతకంతో సమానం... కామన్వెల్త్ విజయం నా తల్లిదండ్రులకు ఇస్తున్న కానుక. గాయం కారణంగా రియో ఒలింపిక్స్లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఈ పతకం గెలుచుకోవడం ఉద్వేగంగా ఉంది. నా దృష్టిలో ఒలింపిక్ పతకం, నంబర్ వన్ ర్యాంక్లతో ఈ విజయం సమానం. గత 10–12 రోజులుగా నిర్విరామంగా ఆడుతుండటం వల్ల కూడా నేను మరింత ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. సింధుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. దీనిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. మాపై ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న అమ్మాయిని ఓడించగలగడం సంతోషంగా ఉంది. మా నాన్న కోసం పోరాడటాన్ని నేను తప్పుగా భావించడం లేదు. అందరూ దానిని అదోలా చేశారు. కానీ ఆయన లేకపోతే నేను దేశం కోసం పతకాలు గెలవకపోయేదాన్ని. ఏదీ చేయకుండా అంతా చేసేసినట్లు అందరూ వ్యవహరించారు. ముందే తెలిస్తే నేను ఆయన కోసం హోటల్ గదిని తీసుకునేదాన్ని. వ్యక్తిగత కోచ్ అక్రిడిటేషన్ ఇచ్చి చివరకు అలా చేశారు. ఈ విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనై నేను రెండు రోజుల పాటు సరిగ్గా నిద్రపోలేదు. సింధు టీమ్ ఈవెంట్లు ఆడటం లేదు. కానీ నేను మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నేను మా నాన్న కోసం పోరాడటమే అందరికీ సమస్యగా అనిపించింది. నేను సింధు చేతిలో ఓడితే భారత్లో చాలా మంది సైనా వయసైపోయింది, రిటైర్ కావాలి అంటూ వంద వ్యాఖ్యలు చేస్తారు. అదే సింధును ఇంకా ఎదుగుతున్న క్రీడాకారిణిగానే చూస్తారు. ఆమెనైతే ఎవరూ ఏమీ అనరు. – సైనా -
కామన్వెల్త్ గేమ్స్: ఫైనల్లో సైనా Vs సింధు
గోల్డ్కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్లో ఆసక్తికర పోరు జరుగనుంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒకే కోర్టులో తలపడనున్నారు. సెమీ ఫైనల్లో తమ ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఈ స్టార్స్ ఫైనల్కు దూసుకెళ్లారు. దీంతో బ్యాడ్మింటన్లో భారత్ ఖాతాలో స్వర్ణం, రజతం పతకాలు ఖాయమయ్యాయి. అయితే ఫైనల్లో ఎవరికి ఏ పతకం వరించనుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. హోరా హోరిగా సాగిన సెమీస్లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా స్కాంట్లాండ్ ఫ్లేయర్ క్రిస్టీ గిల్మోర్ పై 21-14,18-21, 21-17 తో నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్లో ఒలిపింక్ పతక విజేత సింధు 21-18, 21-8 తేడాతో కెనడా క్రీడాకారిణి మైఖేల్ లీపై విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు ప్రపంచ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఫైనల్ కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-10, 21-17 తో ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజివ్ ఔసెఫ్పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించాడు. మరో పురుషుల సెమీస్లో హోరాహోరీగా జరిగిన పోరులో భారత్కే చెందిన ప్రణయ్ 16-21, 21-9, 14-21 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్, మలేషియా ఆటగాటు చాంగ్ వీ లీ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఫైనల్స్లో శ్రీకాంత్, చాంగ్ వీలీతో తలపడనున్నాడు. కాగా ఉమెన్స్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డిలకు ఈ సారి నిరాశ ఎదురైంది. మలేసియా జోడీ మేయి కౌన్ చౌ, వివియాన్ హూలపై 21-17, 15-21, 4-21 తేడాతో పరాజయం పొందిన ఈ భారత జోడీ... ఇవాళ సాయంత్రం కాంస్య పతకం కోసం తలపడనున్నారు. -
కామన్వెల్త్ గేమ్స్ : బ్యాడ్మింటన్లో భారత్ జోరు
గోల్డ్కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్లు తమ తమ వ్యక్తిగత మ్యాచ్ల్లో గెలిచి సెమీస్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ పోరులో సైనా నెహ్వాల్ 21-8, 21-13 తేడాతో రచెల్ హండ్రిచ్(కెనడా)పై వరుస గేమ్ల్లో గెలిచి సెమీస్కు చేరగా, ఆపై పీవీ సింధు 21-14, 21-7 తేడాతో మరో కెనడా క్రీడాకారిణి బిట్నీ టామ్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్లో వరల్డ్ నంబర్ వన్ శ్రీకాంత్ 21-15 21-12 తో ర్యాన్ ఎంగ్ జిన్ రేయ్(సింగపూర్)పై గెలిచి సెమీస్కు అర్హత సాధించాడు. మరొకవైపు హెచ్ఎస్ ప్రణయ్ సైతం సెమీస్లోకి ప్రవేశించాడు. శ్రీలంక ఆటగాడు దినుకా కరుణరత్నాను వరుస గేమ్ల్లో ఓడించి సెమీస్కు చేరాడు. మిక్స్డ్ డబుల్స్ సాత్విక్- పొన్నప్ప ద్వయం సెమీస్కు చేరింది. సాత్విక్- పొన్నప్ప జోడి 2-0తో గో సూన్ హాట్- షెవాన్ జెమీపై గెలిచి సెమీస్కు చేరగా, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జోడి క్వార్టర్ అడ్డంకిని అధిగమించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జంట 2-0తో హాసిని-దిల్రుక్షి( శ్రీలంక) జంటపై గెలిచి సెమీస్కు చేరారు. -
సైనా శుభారంభం
జకర్తా:ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభ చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో సైనా నెహ్వాల్ 17-21, 21-18, 21-12 తేడాతో ఇంతనోన్ రాచనోక్ (థాయ్లాండ్)పై విజయం సాధించి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ ను కోల్పోయిన సైనా.. రెండు, మూడు గేమ్లను పోరాడి గెలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. తొలి గేమ్ లో సైనా 10-4 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో రాచనోక్ వరుస పాయింట్ల సాధిస్తూ దూసుకొచ్చింది. అదే క్రమంలో స్కోరును 14-14 సమం చేయడమే కాకుండా ఆ గేమ్ ను సొంతం చేసుకుంది. ఆపై రెండో గేమ్ లో సైనా తన అనుభవాన్ని ఉపయోగించింది. రెండో గేమ్ లో 12-7 తేడాతో సైనా ఆధిక్యం సాధించనప్పటికీ, 16-16 వద్ద రాచనోక్ స్కోరును సమం అయ్యింది. ఆ సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయని సైనా మరో రెండు పాయింట్లు మాత్రమే కోల్పోయి గేమ్ ను దక్కించుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. ఆ గేమ్ లో రాచనోక్ ను సునాయాసంగా ఓడించిన సైనా రెండో రౌండ్ లోకి అర్హత సాధించింది. మరొకవైపు మిక్స్ డ్ డబుల్స్ లో సుమిత్ రెడ్డి-అశ్విన్ పొన్నప్ప లు 12-21,9-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇర్ఫాన్ ఫదిల్లాహ్-వెనీ అన్ గ్రైనీపై చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement