-
ఉప్పుతో ముప్పు లేదట..
లండన్ : ఉప్పుతో ఆరోగ్యానికి పెనుముప్పేనని వైద్యులు హెచ్చరిస్తుండగా తాజా అధ్యయనం ఉప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదని వెల్లడించింది. రోజుకు ఒక టీస్పూన్కు మించి ఉప్పు తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తప్పదని పలు దేశాల్లో వైద్య ఆరోగ్య మార్గదర్శకాలు స్పష్టం చేస్తుండగా తాజా అధ్యయనం ఇందుకు భిన్నంగా వెల్లడైంది. రోజుకు రెండున్నర టీస్పూన్లు లేదా ఐదు గ్రాముల వరకూ ఉప్పు ఆహారంలో భాగంగా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదని ఒంటారియోకు చెందిన మెక్మాస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఉప్పును పరిమితి మించి తీసుకునే వారు సైతం అధికంగా పండ్లు, కూరగాయలు, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా సమతుల్యతను పాటించవచ్చని పేర్కొంది. ఉప్పుతో కూడిన ఆహారం అధికంగా తీసుకునే చైనా వంటి దేశాల్లో సోడియం తగ్గించాలనే ప్రచారం అవసరమని, ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఈ తరహా ప్రచారం అవసరం లేదని అధ్యయన రచయితలు చెప్పుకొచ్చారు. తగినంత మోతాదులో ఉప్పు తినే వారిలో గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును నివారించేందుకు సోడియంను తగ్గించాలని సూచించేందుకు నిర్ధిష్ట ఆధారాలేమీ లభించలేదని అధ్యయన రచయిత, అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మార్టిన్ ఓడోనెల్ పేర్కొన్నారు. రోజుకు ఐదు గ్రాముల కన్నా ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారిలోనే గుండె జబ్బులు, స్ర్టోక్స్ ముప్పు ఉన్నట్టు తమ అధ్యయనంలో గుర్తించామని చెప్పారు. రోజుకు ఏడు గ్రాముల కంటే అధికంగా సోడియం తీసుకునే వారిలోనే గుండె జబ్బుల ఉదంతాలు, హైబీపీతో మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడైందన్నారు. సోడియంను తగిన మోతాదులోనే తీసుకుంటే గుండెకు పదిలమని చెప్పారు. మరోవైపు రోజుకు ఒక టీస్పూన్ లేదా రెండు గ్రాములకు మించి ఉప్పు తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. -
ఉప్పు.. తగ్గినా ముప్పే!
‘అతి సర్వత్ర వర్జయేత్’ అని సంస్కృతంలో నానుడి. ఏ విషయంలోనైనా అవసరానికి మించి వ్యవహరించకూడదంటారు. అయితే బీపీ వస్తుందని భయపడి చాలామంది ఉప్పు వాడకాన్ని తగ్గిస్తుంటారు. ఉప్పు వాడకం మరీ తగ్గినా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 49 దేశాల్లోని దాదాపు 1.30 లక్షల మందిపై కెనడాకు చెందిన పాపులేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. రోజువారీ అవసరానికి మించి ఉప్పు తింటున్న వారు, అధిక రక్తపోటు ఉన్నవారే ఉప్పు వాడకం తగ్గించుకోవాలని యాండ్రూ మెంటే అనే శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. ఉప్పు వాడకం తగ్గితే కొంతమేర రక్తపోటు తగ్గినా.. వేరే హార్మోన్ల మోతాదు పెరిగేందుకు కారణమై లాభం కన్నా నష్టమే ఎక్కువవుతుందని వివరించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement