-
ఏలూరులో బైక్ ర్యాలీ తో పాటు మానవహారం
-
నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు
-
సమత కేసు: ఆధారాలు లేవు
సాక్షి, ఆదిలాబాద్: సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసు విచారణ ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో శరవేగంగా సాగుతోంది. నాలుగు రోజు గురువారం ఈ కేసులోని ముగ్గురు నిందితుల వాంగ్మూలాన్ని కోర్టు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఫాస్ట్ట్రాక్ కోర్టు విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు గురువారం మరోసారి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక, ఈ కేసులో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు ఆయన అంగీకరించిన సంగతి తెలిసిందే. రహీం గురువారం నుంచి నిందితుల తరఫున కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని, మెడికల్ ఎవిడెన్స్ కూడా లేనందున తమపై కేసును డిశ్చార్జ్ చేయవలసిందిగా నిందితుల తరఫున పిటిషన్ వేయనున్నట్లు లాయర్ రహీం తెలిపారు. ఇక, నేటినుంచే కేసు కోర్టులో ట్రయల్కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి తెలిపారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘సమత’ కేసు నిందితుల తరఫు న్యాయవాది రహీం -
‘సమత’కేసు నిందితుల తరఫు న్యాయవాది రహీం
ఆదిలాబాద్టౌన్: సంచలనం రేపిన సమత కేసు విషయంలో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు అయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో నిందితుల కేసు పత్రాలను స్వీకరించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దూమ్లను బుధవారం మరోసారి కోర్టు ఎదుట హాజరు పర్చనున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు 44 మంది సాక్షులను విచారించారు. ఈ నెల 19 నుంచి కేసు కోర్టులో ట్రయల్కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, నిందితుల తరపు న్యాయవాది రహీం తెలిపారు. -
జస్టిస్ ఫర్ సమత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement