-
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నల్లగొండ లీగల్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి డా.షమీమ్ అక్తర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన సందర్భంగా శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం వివిధ కోర్టు తీర్పులను అధ్యయనం చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. తాను నల్లగొండలో న్యాయవ్యాదిగా పనిచేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎం.ఆర్. సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏకాగ్రతతో చదువుకోవాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్ అన్నారు. పట్టణంలోని డ్వాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలన్నారు. తాను కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అంధులమని బాధపడకుండా కష్టపడి చదవాలని సూచించారు. డ్యాబ్ సంస్థ కోసం తన వంతు సహకారం అందస్తానని తెలిపారు. అంతకు ముందు స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత, ప్రభాకర్రావు, పిన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, యాదయ్య, ఎంఏ. అజీజ్, డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లను వినియోగించుకోండి
నిజామాబాద్ లీగల్, న్యూస్లైన్ : లోక్ అదాలత్ల ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని జిల్లా జడ్జి, న్యాయ సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. అలాగే సత్వరం న్యాయం పొందవచ్చన్నారు. కాబట్టి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్లను వినియోగించుకోవాలని కోరారు. న్యాయసేవా సదన్లో శనివారం మెగా లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సత్వర న్యాయం అందించే లోక్ అదాలత్లతో ఇరు పక్షాల వారు గెలుపొందుతారన్నారు. రాజీమార్గంలో కేసులను పరిష్కరిస్తామన్నారు. బ్యాంకుల ఫ్రీ లిటిగేషన్ కేసులతోపాటు వివిధ కోర్టుల్లో దాఖలు చేసిన కేసులను కూడా ఈ అదాలత్లో పరిష్కరిస్తామన్నారు. అనంతరం కేసులో అప్పటికే చెల్లించిన కోర్టు ఫీజులను వాపసు చేస్తామన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి మహ్మద్ బందె అలి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్జిలు బీఎస్. జగ్జీవన్కుమార్, కె. రవీంద్రబాబు, ఎం.రాధాకృష్ణ చౌహాన్, ఎన్ఎల్ శాస్త్రి, లోక్ అదాలత్ సభ్యులు రాజ్కుమార్ సుబేదార్, హెచ్. అంకిత, ఎం. కుసుమ కుమారి, న్యాయవాదులు పాల్గొన్నారు. అవార్డు అంద చేసిన జిల్లా జడ్జి.. మెగాలోక్ అదాలత్ ప్రారంభంలో జిల్లా జడ్జి డాక్టర్ షమీమ్ అక్తర్ బ్యాంకు కేసులను పరిష్కరించారు. మొత్తం 1,400ల బ్యాంకు కేసులను పరిష్కరించారు. పట్టు విడుపులతో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులను ఆయన అభినందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement