-
బంద్ విజయవంతం
పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వంతాడపల్లి వద్ద వాహనాల అడ్డగింపు చలో ఢిల్లీ ప్రచార పోస్టర్ విడుదల సాక్షి, విశాఖపట్నం: టి బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపుమేరకు జిల్లాలో బంద్ విజయవంతమైంది. పట్టణాలు,గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం నుంచి రాత్రివరకు దుకాణాలు మూత పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను మూయించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నియోజకవర్గాల్లో పార్టీనేతలతోపాటు ప్రజలు భారీ ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. నక్కపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు ,కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జాతీయరహదారిపై ఆర్టీసీ కాంప్లెక్స్కు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. పాయకరావుపేటలో దుకాణాలు,థియేటర్లు, బ్యాంకులు, విద్యా సంస్థలు మూసివేశారు. మాడుగులలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు ,యువకులు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. మాడుగుల సమన్వయకర్తలు బూడిముత్యాలనాయుడు, పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు. పాడేరులో బంద్ విజయవంతమైంది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే రోడ్డులో వంతాడపల్లి వద్ద బైఠాయించి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాడేరులో వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పేరిట ముద్రించిన ఛలో ఢిల్లీ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. అరకులోయలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. చోడవరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. యలమంచిలి పట్టణంలో పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
‘చింత’లేని మోహన్!
*మొన్న వ్యతిరేకించి.. నిన్న సమర్థించి.. నేడు మౌన ముద్ర *రాష్ట్ర విభజనపై పెదవి విప్పని తిరుపతి ఎంపీ *రానున్న రోజుల్లో పదవి కోసమే తీరు మార్చుకున్న వైనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా దీనిపై తిరుపతి ఎంపీ చింతామోహన్కు ఏ మాత్రం చింత ఉన్నట్టు లేదు. కాంగ్రెస్ అధినేత్రిని నమ్ముకుంటే చాలు, తనకు మేలు జరుగుతుందనుకున్నారేమో.. గురువారం తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో పలువురు సీమాంధ్ర ఎంపీలు గళం విప్పినా, చింతామోహన్ మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు. మొదటి నుంచీ విభజనను సమర్థిస్తూ వచ్చారని ఆయన తీరును బట్టి చెప్పవచ్చు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగిన రోజుల్లో కూడా ఇల్లు వదిలి బయటకు రాలేదు. పైగా సమైక్యవాదులపై ఆయన కొరడా ఝుళిపించారు. సమైక్య నినాదాలతో ఆయనను అడ్డుకున్న వారిపై కేసులు బనాయించారు. ఇదంతా రానున్న కాలంలో పదవి కోసమేననేది అందరికీ అర్థమైంది. అనూహ్యంగా నాలుగు రోజుల క్రితం తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వారు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు. అయితే ఓటర్లను నమ్ముకోవడం కంటే సోనియమ్మనే నమ్ముకోవడం మంచిదని చింతా భావించారు. ఆయన సన్నిహితులతో మాట్లాడుతూ ‘‘సోనియమ్మతో మంచిగా ఉంటే ఎప్పుడైనా ఏదో ఒక పదవి రాబట్టుకోవచ్చు. అంతేకాని ఈ జనాన్ని నమ్ముకుంటే నాకు ఒరిగేదేమీ లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం పార్లమెంటు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. తిరుపతి నగరం నుంచి ప్రాతిథ్యం వహిస్తున్న చింతా మోహన్ ఉన్నాడో లేడోననే సందేహం వచ్చే విధంగా ఆయన వ్యవహరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి తిరుపతి రానున్నారు. ఎంపీ తీరుపై సమైక్యవాదులు ఏవిధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. -
కిరణ్, బాబు ‘సమైక్య’డ్రామా
పుంగనూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర ముసుగులో ము ఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పుంగనూరు మండలంలోని చెలిమిగడ్డలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహిం చారు. అక్కడ విలేకరులతో మాట్లాడు తూ కిరణ్ సమైక్యం పేరుతో నటిస్తూ సోనియాగాంధీకి కోవర్టుగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లు పెడితే రాజీనామా చేస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నేడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కోవర్టు కిరణ్కు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విభజన కోసం తొలుత లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్య నాటకం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సమైక్య నినాదం పేరుతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో సమైక్యాంధ్ర ధర్నాలు చేయిస్తూ ఎవరికి వారు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరగకుండా వైఎ స్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు జగన్మోహన్రెడ్డి నాయకత్వాని బల పరచి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, రెడెప్ప, వెంకటరెడియాదవ్, అక్కిసాని భాస్కర్రెడ్డి, నాగరాజరెడ్డి గంగిరెడ్డి, షరీఫ్, నయాజ్, కిజర్ఖాన్, తులసమ్మ, సుబ్బమ్మ, హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సమైక్య బంద్
విశాఖపట్నం ,న్యూస్లైన్: తెలంగాణ బిల్లును కేబినేట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ బంద్ కు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు జిల్లాలో బంద్కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీనిని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమం చేస్తున్న తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా జిల్లా ప్రజలు నిలవాలని కోరారు. జేఏసీ, సమైక్యాంధ్ర వాదులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొని తమ వ్యతిరేకతను డిల్లీకి తెలియజేయాలన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ ఆందోళనకు ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు, ఆర్టీసీ కార్మికులు, పెద్ద, చిన్న వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులు ఇబ్బందులు పడైనా మనం, మన ముందు తరాలు బాగుండడానికి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు. -
ఏ ఎండకు ఆ సమైక్యం
ఉద్యమకారులను తిట్టిన నోటితోనే సమైక్యాంధ్ర నినాదం చింతామోహన్ వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తల విస్మయం సాక్షి, తిరుపతి: విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయపార్టీల మొదలు జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఏడు నెలలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. సమైక్య ఉద్యమంతో గతంలో జిల్లా యావత్తు కొన్ని నెలలపాటు స్తంభించిపోయింది. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగింది. ఇంత జరిగినా అప్పట్లో స్పందించని ఒకే ఒక్క వ్యక్తి తిరుపతి ఎంపీ చింతా మోహన్. ఉద్యమకారులు పలుమార్లు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలంటూ ఎంపీ ఇంటిముందు ధర్నాకు దిగారు. ఓ సందర్భంలో ఆయనను అడ్డుకున్నందుకు సమైక్యవాదులపై ఎంపీ పోలీసు కేసులు సైతం నమోదు చేయించారు. అయితే ఆయన హఠాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు. ఇప్పుడు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ మొసలిక న్నీరు కారుస్తున్నారు. రెండు రోజుల కిందట ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వందమందితో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం నివ్వెరపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని కోరిన రోజుల్లో పత్తా లేకుండా పోయిన ఎంపీ, ఇప్పుడు ఉన్నట్టుండి జనంలోకి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో తనకంటూ లాబీయింగ్ కలిగిన చింతా మోహన్ హఠాత్తుగా సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టడం వెనుక మతలబు ఏమిటని గుసగుసలుపోతున్నారు. ఏపని అయినా సొంత ప్రయోజనం లేకుండా చేయరని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించే సమైక్యాంధ్ర అంటూ నినదించారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ రకంగా తీసుకున్నా సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎదుర్కోక తప్పదు. ప్రజల్లో పార్టీపై ఉన్న చెడు అభిప్రాయం తనపై పడకుండా చూసుకునేందుకు వేసిన ఎత్తుగడ అని ఆ పార్టీ కార్యకర్తలు కొందరు విశ్లేషిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement