-
శాంసంగ్ ప్లాంట్లో ప్రమాదం : గ్యాస్ లీక్...
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చిప్ ప్లాంట్లో ప్రమాదం సంభవించింది. కార్బన్ డయాక్సైడ్ లీక్ అయి ఒకరు మృతి చెందగా.. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సియోల్కు దక్షిణం పక్కనున్న సువోన్లోని సెమీ కండక్టర్ ప్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చిప్ ప్లాంట్లో ఒక్కసారిగా గ్యాస్ లీకై, కార్బన్ డయాక్సైడ్ అంతా ప్లాంట్వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఆ ప్లాంట్లో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారని దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ తెలిపింది. వీరిలో 24 ఏళ్ల ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు. 26, 54 ఏళ్ల వయసున్న మిగిలిన ఇద్దరు అపస్థారక స్థితిలో ఉన్నట్టు తెలిసింది. కార్బన్ డయాక్సైడ్ లీక్ కావడంతో, గాలి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయి, ఒకరు ప్రాణాలు విడిచినట్టు శాంసంగ్ తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టినట్టు కూడా పేర్కొంది. శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్, మెమరీ చిప్ల తయారీదారి. ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు చేసుకోవడం తరచు వార్తల్లో నిలుస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో సురక్షితమైన పద్ధతులను మెరుగుపరచడానికి కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ, ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో టాప్ స్టీల్ తయారీ కంపెనీ పోస్కోలో కూడా గ్యాస్ లీకై, నలుగురు వర్కర్లు చనిపోయారు. -
శాంసంగ్ కంపెనీలో భారీ దోపిడీ
శావో పౌలో: బ్రెజిల్లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా సినిమా పక్కీలో జరిగింది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శాంసంగ్ ఫ్యాక్టరీలోకి దాదాపు 20 మంది సాయుధ దొంగలు చొరబడి 215 కోట్ల రూపాయల విలువైన 40 వేల సెల్ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని మరీ పరారయ్యారు. నైట్షిప్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి కొంత దూరంలో దొంగలు హైజాక్ చేశారు. బస్సులోని ఎనిమిది మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్ఫోన్లు కూడా తీసుకున్నారు. ఏమీ జరగనట్లే ఉండాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీస్ లెఫ్టినెంట్ విటర్ చావస్స్ తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లారు. అంటే ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి గురైన సెల్ఫోన్లు, కంప్యూటర్ల మొత్తం విలువను ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement