-
షీనా బోరా మర్డర్ కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు..
సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేదిగా ఉండడం వల్లే షీనా బోరా హత్య కేసు.. దేశంలో అంతగా సంచలనం సృష్టించించింది. మూడేళ్ల తర్వాత హత్యోదంతం వెలుగులోకి వస్తే.. కేసులో ప్రధాన నిందితురాలిగా జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. మీడియా ఎగ్జిక్యూటివ్గా సొసైటీలో మంచి పేరున్న ఇంద్రాణీ.. సొంత కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. రెండో భర్త సంజీవ్ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్ఖన్నా సూచించారు. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్కు సూచించింది. అయితే సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి... కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్ఖన్నాకు ఫోన్చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్టాప్ హోటల్లో సంజీవ్ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్ఖన్నాకు ఫోన్చేసి రూమ్లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్టాప్ హోటల్ నుంచి సంజీవ్ఖన్నాను హిల్టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్ నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్కు తెలియదు. దీంతో తాను టాయిలెట్కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్లు నిర్ణయించుకున్నారు. రాయ్గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్ఖన్నా తన హిల్టాప్ హోటల్కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యామ్రాయ్కు ఫోన్చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్తో కలిసి హిల్టాప్ హోటల్కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్గఢ్లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్ఖన్న, శ్యాంరాయ్లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. చదవండి: పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్తో షీనా సన్నిహితంగా ఉండడం వల్లే.. -
చిన్నారుల మృత్యువాతపై సుప్రీం దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బిహార్లోని ముజఫర్పూర్లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బిహార్లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం వంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వాదనల సందర్భంగా.. గతంలోనూ ఇలాంటి మరణాలే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్నాయని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది మనోహర్ తెలపగా.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మరణాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇలాంటి మరణాలు ప్రతి ఏటా సంభవిస్తున్నా.. పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. బిహార్లో మరణించిన చిన్నారులకు రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని కోరారు. చిన్నారులు మరణించిన ముజఫర్పూర్ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానల్ను కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు 100 మొబైల్ ఐసీయూ యూనిట్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారంలోగా సమాధానమివ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది. -
‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎమ్.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసేందుకు 2019, జనవరి 24న సమావేశం కానున్న అత్యున్నత ఎంపిక కమిటీలో తానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ఈ పిటిషన్ను విచారించేందుకు మరో బెంచ్ను నియమిస్తామని వెల్లడించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాలుచేస్తూ కామన్కాజ్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. సీబీఐ డైరెక్టర్ నియామకంలో పారదర్శకత కోసం విధివిధానాలను రూపొందించాలని కామన్కాజ్ సంస్థ కోర్టును కోరింది. నాగేశ్వరరావును సెలెక్ట్ కమిటీ సిఫార్సు ఆధారంగా నియమించలేదని తెలిపింది. నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమిస్తూ కేంద్రం 2018, అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. కానీ కేంద్రం దుర్బుద్ధితో, ఏకపక్షంగా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం (డీపీఎస్ఏ) నిబంధనల్ని తుంగలో తొక్కుతూ నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమించిందని పిటిషన్లో పేర్కొంది. డీపీఎస్ చట్టం ప్రకారం వెంటనే నూతన సీబీఐ డైరెక్టర్ను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. అలాగే సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను, ఎంపిక ప్రక్రియలో పాటించిన విధివిధానాలు, సమావేశాల మినిట్స్ను సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కింద ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరింది. దీనివల్ల తుది జాబితాలోని అభ్యర్థులకు సంబంధించి ప్రతికూల అంశాలు ఉంటే ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు వీలవుతుందని సూచించింది. -
సుప్రీం జడ్జీలుగా దినేశ్, ఖన్నా ప్రమాణం
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ సమక్షంలో వారు సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ వన్లో బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం ఉన్న జడ్జీల సంఖ్య 28కి చేరింది. గతంలో జస్టిస్ మహేశ్వరి కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన జడ్జీలుగా ఉన్నారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి రాజస్తాన్లో 1958లో జన్మించిన దినేశ్ మహేశ్వరి 1980లో జోథ్పూర్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1981లో లాయర్గాపేరు నమోదు చేయించుకున్నారు. 2004లో రాజస్తాన్ హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. 2014లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2016లో మేఘాలయ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టు సీజేగా ఉన్నారు. పౌర, రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులను ఆయన ఎక్కువగా విచారించారు. ప్రతీకారం తీర్చుకునేందుకు, అధికారుల ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దుర్వినియోగం చేయడం తగదని 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960లో ఢిల్లీలో జన్మిం చారు. ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ అందుకున్న ఆయన 1983లో బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జీగా, అనంతరం 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఖన్నా తదుపరి సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జస్టిస్ ఖన్నా లాయర్గా ఉన్న సమయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం–1986కు సంబంధించి వైద్యంలో నిర్లక్ష్యం, కంపెనీ చట్టాలపై పలు కేసులను వాదించారు. అదేవిధంగా, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా కూడా ఉన్నారు. అప్పటి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా ఎండగట్టిన ఈ ధర్మాసనానికి అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వం వహించడం విశేషం. -
సంచలన కేసులో నేడే వాదోపవాదాలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుకు సంబంధించి కోర్టులో విచారణ నేడు ప్రారంభంకానుంది. ముంబయి కోర్టులో ఈ విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు ఆమె భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్ ఖన్నా తరుపునుంచి వాదోపవాదాలు కోర్టు నేడు విననుంది. మరోపక్క, ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారి కీలక సాక్ష్యం ఇచ్చేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అతడి తరుపునుంచి కూడా న్యాయవాది వాదనలు కోర్టు రికార్డు చేసుకోనుంది. 2012లో తన కూతురు అయిన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా దారుణంగా హత్య చేయించింది. స్వయంగా తాను కూడా ఈ హత్యలో పాల్గొన్నది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటికే అందరిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు అందించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం కుటుంబ ఆస్తి తగాదాల కారణంగానే షీనాని హత్య చేశారు. ఇంద్రాణి ఆమె మాజీ భర్తకు కలిగిన సంతానమే షీనా. అయితే, మాజీ భర్త సంజీవ్ తో విడిపోయిన ఇంద్రాణి అనంతరం పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకొంది. పీటర్ కొడుకు రాహుల్ కు తన కూతురును సొంత చెల్లిగా పరిచయం చేసింది. దీంతో అతడు షీనాతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదంతా కూడా భవిష్యత్తులో ఆస్తి తగాదాలకు దారి తీస్తుందని, అసలుకే మోసం వస్తుందని గ్రహించిన ఇంద్రాణి పథకం ప్రకారం 2012 ఏప్రిల్ 24న హత్య చేసి ఆమె మృతదేహాన్ని రాయ్ గఢ్ లోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టించగా పోలీసులు ఈ కేసును ఛేదించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement