-
తొలకరి పులకించె.. భూతల్లి మురిసె
సాక్షి, భీమవరం: తొలకరి పలకరింపుతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకూ వేడిగాలులు, ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు జల్లులతో సేదతీరారు. సోమవారం వేకువజాము నుంచి ఉమ్మ డి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఖరీఫ్కు ఊరట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దాళ్వాలో ఆశాజనకమైన పంట చేతికి రావడం.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు సార్వా సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పొలాల్లో పశువుల ఎరువు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఉపాధి హామీ పథకంలో పంట కాలువలు, బోదెల్లో పూడికతీత పనులు జరుగుతుండటంతో సార్వా నారుమడులు వేయడానికి రైతులు కసరత్తు ప్రారంభించారు. 4.50 లక్షల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా నూతన పశ్చిమగోదావరి జిల్లాలో 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. సార్వా సీజన్కు ఎంటీయూ 1061, 1064, 7029, 1121 వంగడాలు అనువుగా ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం సార్వా వరి విత్తనాల్లో దాదాపు 90 శాతానికిపైగా పైగా రైతులు సమకూర్చుకోనుండగా మిగిలిన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశ్చి మగోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 351 కింట్వాళ్ల విత్తనాలను విక్రయానికి సిద్ధం చేశా రు. సార్వా పంటకు సుమారు 68 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిని రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రైతులు ఉత్సాహంగా మందస్తు సాగుకు సిద్ధమవుతున్నారు. త్వరితగతిన నారుమడులు వర్షాలు ప్రారంభమైనందున రైతులు సార్వా నారుమడులు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే కాలువలకు కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేశారు. వెంటనే సాగు ప్రారంభిస్తే మూడో పంటగా అపరాల సాగుకు వీలుంటుంది. శివారు భూములకు నీరు అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకోవాలి. – పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం -
ఆత్మహత్యలు చేసుకుంటేనే నీరిస్తారా?
బంటుమిల్లి రూరల్, న్యూస్లైన్ : సార్వా సాగుకు ఆది నుంచి సాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్న రైతులు నీటి పారుదల శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లేశ్వరం ఇరిగేషన్ బంగ్లాలో సోమవారం పలు గ్రామాల రైతులతో కవుతరం నీటిపారుదల శాఖ డీఈ అప్పలరాజు, జేఈ ఎంకె బేగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బంటుమిల్లి కాలువకు విడుదలవుతున్న నీటి పరిమాణంపై వివరించేందుకు అధికారులు సిద్ధపడగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంటుమిల్లి కాలువకు ఎందుకు పూర్తిగా నీరు ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రం పాలవుతున్న నీటిని రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. కాలువకు నీరు విడుదల చేసి నెల రోజులవుతుండగా ఏ అధికారీ కాలువ మొహం చూడలేదని డీఈని నిలదీశారు. నష్టాల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప నీరివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టా ఆధునికీకరణ అని దాళ్వా లేకుండా చేశారని మండిపడ్డారు. సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్న రైతులు అధికారులను నోటికొచ్చినట్టు మాట్లాడుతుండడంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీఈ అప్పలరాజు ఈఈ నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తిరుమాని శ్రీనివాసరావు, బంటుమిల్లి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు ఎస్.జనార్దనరావు, తూర్పు కృష్ణా డెల్టా మాజీ వైస్ చైర్మన్ గౌరిశెట్టి వెంకటేశ్వరరావు, సిహెచ్.రాధాకృష్ణ రైతుల పరిస్థితులను ఈఈకి ఫోన్లో వివరించారు. దీనిపై స్పందించిన ఆయన బ్రాంచి కాలువల రీడింగ్ కొంత తగ్గించి కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకువద్ద నీరు రీడింగ్ నిలిపిన తర్వాత పూర్తి స్థాయిలో బ్రాంచి కాలువలకు నీరు విడుదల చేస్తామని చెప్పారు. అయితే బ్రాంచి కాలువలకు నీటి విడుదల తగ్గించే విషయంలో రెతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మంగళవారం సాయంత్రానికి 900 క్యుసెక్కుల నీరు విడుదల చేస్తామని డీఈ అప్పలరాజు తెలిపారు. చిటికినేని అబ్బులు, పట్టపు రామచంద్రరావు, ప్రత్తి గాంధీ, నారిబాబు, ప్రత్తి శ్రీనివాసరావు, గోవాడ మురళీకృష్ణ, గూడవల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వాతావరణం సహకరించలేదు.... కృష్ణా తూర్పు కాలువకు పూర్తిస్థాయిలో పది వేల క్యుసెక్కుల నీరు విడుదలవుతున్నా వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని డీఈ అప్పలరాజు విలేకరులకు తెలిపారు. ఇరిగేషన్ బంగ్లాలో రైతుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఏఈలు ఎంకె బేగ్, విజయకుమార్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement