-
శతమానం భారతి:లక్ష్యం 2047.. పీఎస్యూలు
చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి స్వాతంత్య్రాన్ని ఇచ్చి వెళ్లింది బ్రిటిష్ ప్రభుత్వం! మరి నాలుగు డబ్బులెలా చేతిలో ఆడటం? పరిశ్రమలే మనకు ప్రాణాధారాలు అన్నారు జవహర్లాల్ నెహ్రూ. పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రభుత్వమే కానీ, ప్రైవేటు వ్యక్తుల వల్ల కాని పరిస్థితి ఆనాటిది. దాంతో ప్రభుత్వమే.. కూడబెట్టుకున్న డబ్బుతో కూడు, గుడ్డ, నీడతో పాటు.. ఆర్థికంగా అండనిచ్చే విధంగా.. ఉపాధి కల్పన, స్వావలంబన సాధించేలా పరిశ్రమల్ని నెలకొల్పింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెట్ వంటి భారీ కంపెనీలను స్థాపించింది. అవి కాస్త పుంజుకోగానే ప్రైవేటు వ్యక్తులూ ధైర్యం చేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అలా వచ్చిన పరిశ్రమలే ‘పీఎస్యు’లు. అంటే.. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు. వచ్చే పాతికేళ్లలో పీఎస్యులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోగతిని సాధించేందుకు ఈ అమృత మహోత్సవాల సందర్భంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. 51 శాతం కన్నా ఎక్కువ ప్రభుత్వ వాటాలు ఉన్న సంస్థలను పీఎస్యూలనీ, 100 శాతం ప్రభుత్వ వాటాలుంటే పీఎస్ఈలనీ అంటారు. నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ ద్రవ్యీకరణ పథం కింద పీఎస్యు ఆస్తుల విక్రయం ద్వారా రానున్న ఏళ్లలో 2.5 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. అందుకే 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ అధీనంలోని పీఎస్ఈ ఆస్తుల అమ్మకం ద్వారా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని కోరింది. -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
ప్రేమమ్ నాగవల్లి
‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. ‘అ..ఆ..’ సినిమా ట్రైలర్లో వినిపించే ఈ డైలాగ్తో తెలుగు సినిమా అభిమానుల మనస్సుల్లోకి దూసుకొచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నిజానికి అంతకన్నా ముందే ఒక మలయాళ సినిమాతో తెలుగు కుర్రకారుకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాయే ‘ప్రేమమ్’. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే, అదే పాత్రలో మళ్లీ కనిపించి మెప్పించింది అనుపమ. పరిచయమైతే మలయాళ పరిశ్రమలోనే అయినా, ఇప్పుడు ఈ హీరోయిన్ స్టార్గా దూసుకెళ్తోంది మాత్రం తెలుగులోనే! ఈ లేటెస్ట్ స్టార్ సెన్సేషన్ గురించి కొన్ని విశేషాలు... తెలుగులోనే స్టార్గా... అనుపమ మలయాళ సినిమాతోనే హీరోయిన్ అయినా ప్రస్తుతానికి ఆమె కెరీర్ తెలుగులోనే సూపర్ సక్సెస్తో దూసుకుపోతోంది. ‘అ..ఆ..’ విడుదలైన వెంటనే అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘శతమానం భవతి’, ‘ప్రేమమ్’ సినిమాలతో వరుసగా సూపర్హిట్స్ వచ్చాయి. దీంతో మిడిల్ బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు స్టార్ అనుపమనే! ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తోన్న ‘హలో గురూ ప్రేమకోసమేరా!’ దసరా కానుకగా విడుదల కానుంది. కాలేజీకి నో చెప్పి సినిమాల్లోకి! అనుపమ పరమేశ్వరన్ పుట్టి, పెరిగిందంతా కేరళలోనే! మలయాళ భామ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ కలలు కనేది. ఆ పిచ్చే ఆమెకు ‘ప్రేమమ్’ సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది. కొత్తవాళ్ల కోసం దర్శకుడు ఆల్ఫన్స్ పుత్రన్ వెతుకుతూ ఉంటే అనుపమ ఫొటోషూట్ ఆయన కంట్లో పడింది. వెంటనే ‘ప్రేమమ్’లోని మూడు ప్రేమకథల్లో ఒక కథకు హీరోయిన్గా ఎంపికచేశాడు. అప్పటికి అనుపమ వయసు 18 ఏళ్లు. తన డ్రీమ్ కావడంతో కాలేజీకి కూడా నో చెప్పేసింది. డబ్బింగ్ చెప్పిందంటే... ‘అ..ఆ..’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుపమకు తెలుగు రాదు. కానీ ఆ సినిమాలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అనుపమ స్పెషాలిటీస్లో ఆ వాయిస్ కూడా ఒకటి. అందుకే అప్పట్నుంచీ అన్ని సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. అనుపమ వాయిస్ను తెలుగు ప్రేక్షకులు, తెలుగులో విన్నది ‘అ..ఆ..’ ట్రైలర్లోని ఈ డైలాగ్తోనే – ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’. లైఫ్లో అదే పెద్ద మిరాకిల్! చిన్న వయసులోనే కెరీర్లో పెద్ద సక్సెస్ చూసిన అనుపమ, సినిమాల్లోకి రావడమే తన జీవితంలో జరిగిన పెద్ద మిరాకిల్ అని చెప్తుంది. ఇప్పటికీ ఇదంతా కలలా ఉంటుందని, ఒక్కోసారి ఎలాంటి సినిమాలు ఎంపికచేసుకోవాలో తెలియనప్పుడు దర్శకులు త్రివిక్రమ్, ఆల్ఫన్స్ పుత్రన్లను అడుగుతానని అంటుంది. ఈ దర్శకులే అనుపమను తెలుగు, మలయాళ సినీ పరిశ్రమలకు పరిచయం చేశారు. బ్లాక్బస్టర్ డెబ్యూట్ ‘ప్రేమమ్’ విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బస్టర్. మలయాళ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులు సైతం ఆన్లైన్లో వెతుక్కొని మరీ చూసేలా చేసింది. అలా తెలుగులోకి రాకముందే ‘ప్రేమమ్’లో మేరీ పాత్రలో కనిపించిన అనుపమ ఇక్కడ కూడా ఫేమస్. ఆ క్రేజే ఆమెను వెంటనే తెలుగుకు తీసుకొచ్చింది. తెలుగులో ‘అ..ఆ..’లో నాగవల్లి రోల్తో డెబ్యూట్ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా కూడా బ్లాక్బస్టర్ అయింది. తమిళంలో ‘కోడి’ అనే సినిమాతో డెబ్యూట్ ఇచ్చింది. ఆ సినిమా కూడా బ్లాక్బస్టర్. -
దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్
శతమానం భవతి సినిమా సమయంలో దిల్ రాజు, రాజ్ తరుణ్ మధ్య విబేధాలొచ్చాయన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. శతమానం భవతి సినిమాను ముందుగా రాజ్ తరుణ్ హీరోగా చేయాలని భావించాడు దిల్ రాజు. అయితే చివరి నిమిషంలో శర్వానంద్తో సినిమా చేశాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో రాజ్ తరుణ్ చేతులారా మంచి హిట్ సినిమాను చేజార్చుకున్నాడని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రాజ్ తరుణ్, దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నాడట. శతమానం భవతి సినిమా సమయంలో అప్పటికే ఏకె ఎంరట్టైన్మెంట్స్తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. అందుకే మరోసారి దిల్ రాజు ఆఫర్ ఇవ్వగానే వెంటనే ఒప్పేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రాజ్ తరుణ్. -
శతమానం... తెలుగు సినిమాకు గర్వకారణం
‘‘తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉంది. ‘దిల్’రాజు, సతీశ్ వేగేశ్నల కృషితో ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్రసీమకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, తోటి నిర్మాతను గౌరవించిన అల్లు అరవింద్గారిని అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. శర్వానంద్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘శతమానం భవతి’కి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరపున చిత్రనిర్మాత, దర్శకుడు, హీరోలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్మానించారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ సన్మానం కార్యక్రమం జరిగింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘జీవితంలో గొప్ప ఘనత సాధించిన సమయంలోనే... పెద్ద అండ (భార్య)ను కోల్పోయాను. నా సన్నిహితులైన అరవింద్గారికి ఆ బాధ ఎలాంటిదో తెలుసు. జాతీయ పురస్కారం కంటే 15ఏళ్లుగా అరవింద్గారి వంటి మంచి వ్యకితో స్నేహాన్ని గొప్పదిగా భావిస్తున్నా’’ అన్నారు. నందమూరి కల్యాణ్రామ్ మాట్లాడుతూ – ‘‘మా ఆవిడ ‘శతమానం భవతి’ చూసి, ‘అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు చెయ్యొచ్చు కదా’ అనడిగింది. నేనూ ఇలాంటి మంచి కుటుంబ కథాచిత్రం చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించాలనే ‘దిల్’ రాజు తపనే అవార్డు రావడానికి కారణమైంది’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘నేషనల్ అవార్డు రావడం నా కెరీర్లో ఫస్ట్టైమ్. నా జీవితంలో సంతోషకరమైన క్షణమిది’’ అన్నారు శర్వానంద్. ఈ వేదికపై ‘రుద్రవీణ’కు నర్గిస్దత్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ, అది తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన అవార్డుగా భావించానన్నారు చిరంజీవి. అల్లు అర్జున్, నాని, అల్లు శిరీష్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement