-
అగ్ని ప్రమాదాలను తగ్గించిన ‘ఫైర్లైన్స్’
సాక్షి, జన్నారం(మంచిర్యాల): వేసవిలో అడవిలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న ఫైర్లైన్స్ విధానం సత్ఫలితాలనిస్తోంది. అడవుల్లో అగ్నిప్రమాదాల వల్ల అడవి కాలడంతోపాటు వన్యప్రాణులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉంటుంది. అగ్ని ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నూతన విధానాన్ని రూపొందించింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించి, అడవికి నిప్పు తగులకుండా ఆపేందుకు అధికారులు కొత్త పద్ధతి అమలు చేస్తున్నారు. అడవిలో కూలీల ద్వారా ఫైర్లైన్స్(అగ్గి వరుస) ఏర్పాటు చేసి వాటికి నిప్పు పెడితే అడవంతా రగిలే అవకాశం ఉండదనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు. దీంతో వేసవిలో అడవికి నిప్పు తగులకుండా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో మూడు అటవీ రేంజ్ల పరిధి అన్ని బీట్లలో ఫైర్లైన్ పనులు చేయిస్తున్నారు. జిల్లాలో ఫైర్లైన్స్ కోసం కాంపా స్కీం కింద రూ.10 లక్షలు కేటాయించారు. గత సంవత్సరం 40 కిలోమీటర్ల దూరం ఫైర్లైన్స్ చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 22 కిలోమీటర్ల దూరం చేశారు. ఆకులు శుభ్రం చేసే బ్లోయర్లు గత సంవత్సరం ఆరు కొనుగోలు చేయగా ఈసారి మరో నాలుగు బ్లోయర్లు కొనుగోలు చేశారు. ఫైర్లైన్స్ అంటే అడవిలో ప్రస్తుతం ఆకులు రాలిపోతాయి. దీంతో పశువుల కాపరులు గాని, అడవికి వెళ్లిన వారు గాని బీడీ, చుట్ట తాగి అలాగే పడేస్తే ఎండిన ఆకులకు అంటుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. దీని ద్వారా మంటలు అడవంతా వ్యాపించి, పక్షులు, చెట్లు, వన్యప్రాణులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైర్లైన్ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రతీ బీట్లోని అటవీ ప్రాంతాల్లో ఎడ్లబండ్ల తొవ్వలు, కాలి నడక తొవ్వలకు ఇరువైపులా ఎండిన ఆకులను 5 మీటర్ల వెడల్పులో పోగు చేస్తారు. ఈ తొవ్వలపై వేసి అడవికి అంటకుండా నున్నగా చేసి పోగు చేసిన ఆకులకు నిప్పు పెట్టి కాలుస్తారు. ఆకులు కాలే వరకు పర్యవేక్షిస్తారు. ఫలితంగా దారి వెంట ఎవరైన బీడీ కోసం నిప్పంటించుకుని పడేస్తే నిప్పంటుకునే అవకాశం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు దారులపై ఎండిన ఆకులను ఉండకుండా చూస్తారు. ప్రమాదవశాత్తు నిప్పంటినా ఈ దారుల వరకే వ్యాపించి ఆగుతుంది. దీంతో అడవిలో అగ్ని ప్రమాదం జరుగకుండా ఉంటుం ది. అన్ని డివిజన్లలోని కంపార్ట్మెంట్, బీట్, డివిజన్, బౌండరీలలో ఈ అగ్గి వరుసలు వేస్తారు. శాటిలైట్ ద్వారా ఫైర్ అలర్ట్ అటవీశాఖ ఉన్నత అధికారులు అగ్ని ప్రమాదాలను నివారించేందుకు శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రడూన్ ఆధ్వర్యంలో శాటిలైట్ ద్వారా ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా సమాచారం చేరవేస్తారు. ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరుగుతున్న ప్రదేశం గురించి సంబంధిత అధికారులకు మొబైల్ ఫోన్కు మేసేజ్ వస్తుంది. కంపార్టుమెంట్ నంబర్, ఏరియాతో సహా తెలియపరుస్తారు. దీంతో సంబంధిత అధికారులు జీపీఎస్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పివేస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా శాటిలైట్ ద్వారా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం 90 సార్లు డివిజన్లో అగ్ని సమాచారాలు రాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫైర్లైన్ చేసి ఆకులు కాల్చుతున్న కూలీలు కూలీలకు చేతినిండా పని వేసవిలో కూలీలకు చేతినిండా పని ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు ఈ పనులు నిరంతరంగా జరుగుతాయి. ఎండిన ఆకులను ఉండకుండా ఎప్పటికప్పుడు పోగు చేసి నిప్పంటించడం, ఆ నిప్పు అడవిలోకి వ్యాపించకుండా చూడడం కూలీల పని. ఇందుకు 5 మీటర్ల వెడల్పు, ఒక మీటర్ పొడవుకు రూ.5.50 కూలి ఇస్తారు. ఒక్కో కూలీ రోజుకు 20 నుంచి 40 మీటర్ల వరకు ఫైర్లైన్ వేస్తారు. దీంతో మూడు నెలల వరకు కూలీలకు పని దొరుకుతుంది. గ్రామాల్లో అవగాహన సదస్సులు అటవీ సమీప గ్రామాల్లో శాటిలైట్ ద్వారా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు అగ్ని ప్రమాదాలు సంభవించే అటవీ సమీప గ్రామాల ప్రజలకు అగ్ని ప్రమాదాలు, నష్టంపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పశువుల కాపరులు అగ్గిపెట్టలు, సిగరేట్, బీడీలు అడవులకు పట్టుకెళ్లకుండా చూస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు పొలాల్లో గడ్డికి నిప్పు పెట్టడం, చెత్త అడవిలో వేసి కాల్చడం వంటివి చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. కొందరు బీడీ ఆకులు, ఇప్ప పువ్వు కోసం చెట్లకు నిప్పు పెట్టే అవకాశం ఉన్నందున అలాంటివి జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరినీ అనుమతించకపోవడం, పశువులను మేత కోసం పంపకపోవడం, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి అవగాహన కల్పించడంతోపాటు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. జీరో పర్సెంట్ ప్రమాదాలకు చర్యలు గత సంవత్సరం 80 వరకు ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కటి కూడా జరుగకుండా చూశాం. గత సంవత్సరం మొత్తం 90 సార్లు శాటిలైట్ ద్వారా అగ్నిప్రమాదాల గురించి మేసేజ్లు వచ్చాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రాలేదు. అంటే డివిజన్లోని అడవుల్లో జీరో పర్సెంట్ అగ్ని ప్రమాదాలకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫైర్లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రతీ రోజు బీట్ల వారీగా పనుల వివరాలు తెలుసుకుని ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నాం. – రవీందర్గౌడ్, ఎఫ్డీవో -
చిక్కలళ్లాపురం ఇక శాటిలైట్ టౌన్
= సర్వతోముఖాభివృద్ధి చేస్తా = రైల్వే ప్రాజెక్టుల పూర్తికి దశలవారీ నిధులు = కోలారు వద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి త్వరలో చర్యలు = ఇచ్చిన 169 హామీల్లో 60 నెరవేర్చాం = మిగతావి నాలుగేళ్లలో పూర్తి చేస్తాం = చిక్కబళ్లాపురం- కోలారు రైలు ప్రారంభోత్సవ సభలో సీఎం చిక్కబళ్లాపురం, న్యూస్లైన్ : బెంగళూరులో జనసంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తద్వారా తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం చిక్కబళ్లాపురాన్ని శాటిలైట్ టౌన్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీని వల్ల చిక్కబళ్లాపురంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. నగరంలోని నందిరంగ మందిరంలో నైరుతి రైల్వే మండలి ఏర్పాటు చేసిన చిక్కబళ్లాపురం - కోలారు రైల్వే బ్రాడ్గేజ్, నూతన రైలును ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు. చిక్కబళ్లాపురలో రైల్వేస్టేషన్ విస్తరణ కోసం ఇళ్లను కోల్పోయే చిక్కబళ్లాపురం, చామరాజపేట కాలనీ వాసులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. అందులో భాగంగా 13 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కోలారు వద్ద రూ1,400 కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వాటా కింద రూ. 700 కోట్లు ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందన్నారు. ఈ నెల 13 తేదీకి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంటుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 169 హామీల్లో ఇంతవరకు 60 హామీలను నెరవేర్చామని తెలిపారు. మిగిలిన వాటిని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. రైల్వే శాఖ మంత్రి మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ రూ.440 కోట్లతో 87 కిలోమీటర్లు పొడవైన కోలారు - చిక్కబళ్లాపురం రైలు మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నిర్మాణంతో అన్ని వర్గాల వారికీ మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ, కేహెచ్ మునియప్ప, రాష్ట్ర ఆహార పౌరసర ఫరాల శాఖామంత్రి దినేశ్గుండూరావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్హెచ్ శివశంకరరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, రాజణ్ణ, జేకే కృష్ణారెడ్డి, ఎస్ఎన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఏ నారాయణస్వామి, జెడ్పీ అధ్యక్షుడు చిన్నప్ప, కలెక్టర్ ఆర్ విశాల్, ఎస్పీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement