-
సమీప నివాసమే ఉపవాసం
ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక మేలు గుణాలు కలగలసిన మహానుభావుడు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. ఈ నెల 23, శుక్రవారం బాబా జయంతి సందర్భంగా ఆయన బోధామృతంలోని కొన్ని చినుకులు... ♦ పిల్లలు తమలోని దైవిక ప్రజ్ఞలను పెంపొందించుకోవడానికి తల్లిదండ్రులు అన్ని అవకాశాలూ కల్గించాలి. యజమాని తోటలో తోటమాలి మొలకల్ని పెంచిన రీతిగా తల్లిదండ్రులు తమ ఇంట్లో పుట్టిన చిన్నారులను పెంచడానికి భగవంతుడు తమను నియమించాడని భావించాలి. పురాణ పురుషులు, రుషులు, మునుల కథలను చెబుతూ చిన్నారులలో దాగి ఉన్న మంచితనాన్ని ప్రేరేపించాలి. ♦ కొందరు కార్తీక పౌర్ణమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలలో ఉపవాసం పేరిట అన్నపానాలు మాని చిరుతిండ్లు అధికంగా తింటూ ఉంటారు. ఇది ఉపవాసం కాదు. భగవంతునికి సమీప నివాసమే ఉపవాసం. ♦ భగవంతుని నామ సంకీర్తనంతో అఖండ భజనలతో హృదయాకాశాన్ని ప్రకాశింప చేయాలి. అప్పుడే అంతులేని ఆత్మానందం కలుగుతుంది. కనుక జీవితం ఉన్నంత వరకు నామ సంకీర్తనం చేయాలి. ♦ సాధన ద్వారా మనోచాంచల్యాన్ని నిరోధించి దైవోన్ముఖం చేయగలిగిన వానికి ఏ విధమైన వర్ణాశ్రమధర్మాలూ అవరోధం కాజాలవు. ♦ ముక్తికోసం మానవుడు అడవులకు, ఆలయాలకు, యాత్రలకు వెళ్లనవసరం లేదు. ముక్తిపొందటానికి కులగోత్రాలతోనూ, ఏకాంత దీక్షతోనూ, వనవాసంతోనూ ప్రమేయం లేదు. మానవునికి కర్మద్వారానే ముక్తి లభిస్తుంది. అదెలాగంటే, కర్మ చేసేటప్పుడు ఇంద్రియ ప్రభావాన్ని బుద్ధి నిలకడతో అణచివెయ్యాలి. అలా ఇంద్రియాల శక్తిని అరికట్టిన అంధుడైనా మోక్షం పొందుతాడు. భవబంధాలను దూరం చేసుకుని భగవంతుని యెడల ప్రగాఢ భక్తివిశ్వాసాలు పెంచుకొనటమొక్కటే మానవుని ముక్తికి కావలసిన అర్హతను ప్రసాదిస్తుంది. -
రేపు సత్యసాయి ఆరాధనోత్సవం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి ప్రశాంతి నిలయం కేంద్రంగా ఈనెల 24న భగవాన్ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోన్న పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద వెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజుగా పిలువబడే సత్యసాయిబాబా జన్మించారు. చిన్న నాటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపిన ఆయన 1940లో తన 14వ యేట సత్యసాయిబాబాగా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి ఏకరూప వస్త్రధారి అయిన ఆయన దేశ,విదేశాలు సంచరిస్తూ మానవతా విలువలు, ఆధ్యాత్మికతను బోధిస్తూ తన ప్రేమ సామ్రాజ్యాన్ని సుమారు 180 దేశాల్లో నెలకొల్పారు. తక్కువ కాలంలోనే పుట్టపర్తికి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో నిత్యం విదేశీయులు వేలాదిగా పుట్టపర్తికి విచ్చేస్తుంటారు. అపర భగీరథుడు సత్యసాయిబాబా : భక్తులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్య వైద్యం, తాగునీళ్లు,ఉచిత భోజన వసతి అందిస్తున్నారు. వరుస కరువులతో గుక్కెడు నీళ్లు దొరకని వందలాది గ్రామాల్లో తాగునీరు అందించి అపర భగీరథుడయ్యారు. 2011 ఏప్రిల్ 24న సత్యసాయి శివైక్యం పొందారు. ఆ తర్వాత నుంచి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి కూడా తాగునీళ్లు అందించారు. రెండేళ్ల క్రితం సుమారు రూ.100 కోట్లతో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు తాగునీటి వసతి కల్పించారు. ఇక పేదలను నయాపైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీ నెలకొల్పి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యసాయి సేవలు అనితర సాధ్యమైనవని భక్తులు చెప్పుకుంటున్నారు. యేటా ఏప్రిల్ 24న పుట్టపర్తిలో వైభవంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
భారతదేశం వేదాలకు నిలయం
పుట్టపర్తి అర్బన్: భారతదేశం వేదాలకు నిలయమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సత్యసాయి 92వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ వేద సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి గవర్నర్ చేరుకున్నారు. మొదట సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సదస్సులో మాట్లాడుతూ.. శాంతి, ప్రేమ, ధర్మాలను స్థాపించడం వేద అధ్యయనంతోనే సాధ్యమన్నారు. వేడుకల్లో 42 దేశాలకు చెందిన 15 వేల మంది వేద పండితులు హాజరై వేదపారాయణం చేశారు. -
సత్యసాయిగా మళయాల నటుడు
చనిపోయిన విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు సినిమా టీజర్ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో ఇంట్రస్టింగ్ న్యూస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే నాగరాహువు షూటింగ్ పూర్తి చేసిన కోడి రామకృష్ణ, ఆ సినిమాతో పాటు సత్య సాయిబాబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను కూడా చాలా వరకు పూర్తి చేశాడు. చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమాకు నిర్మాత దొరకటం, తరువాత నటీనటులను ఎంపిక చేయటం ఆలస్యం కావటంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ముందుగా మళయాల నటుడు దిలీప్ను సత్యసాయి పాత్రకు ఎంపిక చేసినా.. అతడి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానంతో విరమించుకున్నాడు. ఫైనల్గా మరో మళయాల నటుడు శ్రీజిత్ విజయ్ను బాబా పాత్రకు ఎంపిక చేసిన కోడి రామకృష్ణ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు. సత్య సాయిబాబ భక్తుల సహకారంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో ఐదు నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2017 మొదట్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు బాబాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నందున ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
సత్యసాయిగా మళయాల నటుడు
చనిపోయిన విష్ణువర్ధన్ హీరోగా నాగరాహువు సినిమా టీజర్ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో ఇంట్రస్టింగ్ న్యూస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే నాగరాహువు షూటింగ్ పూర్తి చేసిన కోడి రామకృష్ణ, ఆ సినిమాతో పాటు సత్య సాయిబాబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను కూడా చాలా వరకు పూర్తి చేశాడు. చాలా కాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమాకు నిర్మాత దొరకటం, తరువాత నటీనటులను ఎంపిక చేయటం ఆలస్యం కావటంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ముందుగా మళయాల నటుడు దిలీప్ను సత్యసాయి పాత్రకు ఎంపిక చేసినా.. అతడి స్టార్ ఇమేజ్ దృష్ట్యా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానంతో విరమించుకున్నాడు. ఫైనల్గా మరో మళయాల నటుడు శ్రీజిత్ విజయ్ను బాబా పాత్రకు ఎంపిక చేసిన కోడి రామకృష్ణ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు. సత్య సాయిబాబ భక్తుల సహకారంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో ఐదు నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2017 మొదట్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు బాబాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నందున ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
400 ఓ జోకు.. 200 సీట్లే కష్టం: బీజేపీపై ఎంపీ శశిథరూర్ సెటైర్లు
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
Advertisement