-
టెడ్డీ ఫస్ట్లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది..
నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టెడ్డీ. ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు శక్తిసౌందర్రాజన్. ఈయన ఇంతకు ముందు టిక్ టిక్ టిక్ అనే స్పై చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. గ్రాఫిక్స్తో కూడిన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ఈయన తాజా చిత్రం టెడ్డీలోనూ గ్రాఫిక్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషాసైగల్ నటిస్తున్న చిత్రం ఇది. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఆ సందేహాలను చిత్ర దర్శకుడిని అడిగి తెలుసుకుందాం! ప్ర: ఈ చిత్రానికి టెడ్డీ అని పేరు నిర్ణయించడానికి కారణం? జ: చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ చూస్తేనే టైటిల్ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం. ప్ర: ఇంతకు ముందు బ్యాంకు దోపిడీ. జోంబి, అంతరిక్షం నేపథ్యాల్లో చిత్రాలను తెరకెక్కించారు. మరి ఈ టెడ్డీ ఏ జానర్లో ఉంటుంది? జ: దీన్ని ఒక్క మాటలో పలానా జానర్ చిత్రం అని చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్కు సంబంధించిన పాత్ర ఉంటుంది. దాన్ని రూపాన్ని గ్రాఫిక్స్లో మాత్రమే ఆవిష్కరించాల్సి ఉంటుంది. అదే టెడ్డీబేర్ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. చిత్రంలో సెకెండ్ పాత్ర ఇదే. టెడ్డీబేర్ను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్నాం. ఈ టెడ్డీబేర్ ఫైట్స్ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్ర: వివాహానంతరం ఆర్య, సాయేషాలను హీరోహీరోయిన్లుగా నటింపజేయాలన్న ఆలోచన గురించి? జ: నిజం చెప్పాలంటే వారిద్దరినీ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి భయపడ్డాను. అయితే కథ విన్న వారం రోజుల్లోనే పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటి సాయేషా నటించడానికి అంగీకరించారు. ప్ర: అజర్బైజాన్ దేశంలో షూటింగ్ చేయడానికి కారణం? జ:అది చాలా పురాతన దేశం. ఇప్పుడు అదే రష్యా. అప్పట్లో భారతీయ చిత్రాలను అక్కడి ప్రజలు ఎక్కువగా చూసేవారు. నటి సాయేషా ప్రఖ్యాత నటుడు దిలీప్కుమార్ మనవరాలు అని తెలవగానే అక్కడి ప్రజలు సంతోషంగా దిలీప్కుమార్ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఒక బామ్మ నటుడు ఆర్యను పట్టుకుని అటూ ఇటూ ఊపేసింది. ఎందుకమ్మా? అని అంటే మదరాసు పట్టణం చిత్ర సీడీ చూపించి ఇందులో నటించింది నువ్వేగా అని అడిగింది. అంతగా ఇండియన్ చిత్రాలను ఇప్పటికీ య్యూట్యూబుల్లో అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్ర: చిత్ర నిర్మాత జ్ఞానవేల్రాజా గురించి? జ: టిక్ టిక్ టిక్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్రాజాను కలిశాను. బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ వంటివి ఏమీ అడగకుండా చిత్రం చేద్దాం అని చెప్పారు. ఇప్పటికీ ఇంత బడ్జెట్ అని నిర్ణయించలేదు. చిత్రానికి అవసరం అయిన వన్నీ సమకూర్చుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్రాజా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిర్మాణ సంస్థలో చాలా మైలురాయి చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఈ టెడ్డీ చిత్రం కూడా చేరుతుందని చెప్పగలను -
‘కాప్పాన్’తో సూర్య అభిమానులు ఖుషీ
చాలా కాలం తరువాత నటుడు సూర్య అభిమానుల్లో ఆనందం తాండవిస్తోంది. కారణం సూర్య నటించిన తాజా చిత్రం కాప్పాన్. సూర్యకు జంటగా నటి సాయేషా సైగల్ నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, ఆర్య ప్రదాన పాత్రలను పోషించారు. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. శుక్రవారం భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చిన కాప్పాన్ చిత్రం సూర్య అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పలు ఆసక్తికరమైన మలుపులతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా ఈయన కాప్పాన్ చిత్రంలోనూ తనదైన దర్శకత్వ శైలిని ప్రదర్శించారు. సినిమాలో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. దేశ భద్రత, దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా మోహన్లాల్ పడే తపన, అందు కోసం చేసే కృషి, పాకిస్థాన్ ఉగ్రవాదుల దురాగతాలు, స్వదేశంలోని కార్పొరేట్ల స్వార్థం, కొందరు మంత్రుల అక్రమ రాజకీయాలు, బయోవార్, రైతుల సంరక్షణ, ప్రేమ వంటి అంశాలను టచ్ చేశారు. బడా కార్పొరేట్ శక్తులు తన స్వార్థం కోసం రైతుల కడుపు కొట్టాలని ప్రయత్నిస్తారు. అందుకు ప్రధాని అంగీకరించకపోవడంతో ఆయన్నే మట్టు పెట్టే ప్రయత్నానికి పాల్పడతారు. దాన్ని ప్రధాని సెక్యూరిటీ సూర్య ఎలా ఎదుర్కొన్నాడు..? రైతుల భూములను ఎలా కాపాడాడు? లాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కాప్పాన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సూర్య తనదైన శైలిలో ఆకట్టకున్నారు. మోహన్లాల్ ప్రధానమంత్రిగా హుందాగా నటించారు. కథానాయకిగా నటి సాయేషా సైగల్ తన పరిధిలో నటించింది. ఆర్య తనదైన హాస్యధోరణిలో కథలో కీలకంగా నిలిచారు. చిత్రానికి ఛాయాగ్రహణ హైలైట్. హరీస్ జయరాజ్ నేపథ్య సంగీతం బాగా కలిసివచ్చింది. -
బందోబస్త్ రెడీ
‘గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘బందోబస్త్’. సాయేషా సైగల్ కథానాయికగా నటించారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాని నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...’ అంటూ సాగే దేశభక్తి గీతానికి, ‘చెరుకు ముక్కలాంటి...’ అనే మాస్ పాటకు మంచి స్పందన వచ్చింది. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ ప్రధాని పాత్రలో మోహన్లాల్ చెప్పిన డైలాగ్స్, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్. -
బందోబస్త్కు సిద్ధం
దేశాన్ని రక్షించే కమాండోగా సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారత ప్రధానిగా మోహన్లాల్ నటించారు. సయేషా కథానాయిక. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘సూర్య డిఫరెంట్ గెటప్స్లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. ఇటీవలే తమిళంలో రజనీకాంత్గారు ఆడియో రిలీజ్ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే తెలుగు పాటలను విడుదల చేసి, గ్రాండ్గా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్. కెమెరా: ఎం.ఎస్. ప్రభు. -
సూర్యకు నటన రాదనుకున్నా!
‘‘తన సహనటులెవరికీ చెడ్డ పేరు రాకూడదనుకుంటారు శివకుమార్. వాళ్ల అబ్బాయిలు సూర్య, కార్తీని కూడా అలానే పెంచారు. తొలి సినిమా ‘పరుత్తివీరన్ (‘మల్లిగాడు’)లో కార్తీ అద్భుతంగా చేశాడు. సూర్య ఫస్ట్ సినిమా చూసి తనకు నటించడం రాదేమో? అనుకున్నాను. తనని తాను మలచుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు’’ అని రజనీకాంత్ అన్నారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్). సయేషా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్లాల్, ఆర్య, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈరోజు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు కేవీ ఆనంద్ నా ‘శివాజీ’ సినిమాకు కెమెరామేన్. ఆయనకు కథ మీద మంచి జడ్జిమెంట్ ఉంది. నేను ఆయనతో ఓ సినిమా చేయాలి కానీ ఆగిపోయింది. మోహన్లాల్ గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. హ్యారిస్ మ్యూజిక్ బావుంటుంది. ‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య నటన ఆశ్చర్యం కలిగించింది. తమిళ ఇండస్ట్రీకు దొరికిన వరం నిర్మాత సుభాస్కరన్. ప్రస్తుతం ‘ఇండియన్ 2, దర్బార్, పొన్నియిన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. ‘శివపుత్రుడు, గజిని, సింగం, సింగం 2’ వంటి గొప్ప సినిమాలు చేశారు సూర్య. విద్యా వ్యవస్థపై సూర్య చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ‘అగరం’ సంస్థ ద్వారా ఎందర్నో విద్యావంతుల్ని చేస్తున్నారు సూర్య’’ అన్నారు. ‘‘కేవీ ఆనంద్గారు, నేను చేస్తున్న మూడో (వీడొక్కడే, బ్రదర్స్) సినిమా ఇది. అందర్నీ మెప్పించేలా ఈ సినిమా తీశారాయన. సుభాçస్కరన్గారికి థ్యాంక్స్. ఆర్య ముందే సాయేషాతో ప్రేమగా నటించే సీన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాను (నవ్వుతూ). రజనీకాంత్గారికి, శంకర్గారికి థ్యాంక్స్. ఒకరి దారి రహదారి.. మరొకరేమో తన సినిమాలతో ఇండస్ట్రీను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తున్నారు. నా బలం ఫ్యాన్సే. కుటుంబం తర్వాతే సమాజం గురించి ఆలోచించండి (అభిమానులను ఉద్దేశిస్తూ..)’’ అన్నారు సూర్య. ‘‘ఈ కాప్పాన్కు (రక్షించేవాడు) పైనున్న కాప్పాన్ అండగా నిలుస్తాడనుకుంటున్నాను’’ అన్నారు మోహన్లాల్. ‘‘సూర్య రానురాను యువకుడిలా మారిపోతున్నాడు. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి’’ అన్నారు శంకర్. ‘‘ఈ సినిమాలో మోహన్లాల్ ప్రధానమంత్రి పాత్ర చేశారు. సూర్యకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. సీన్ అద్భుతంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు సూర్య’’ అన్నారు ఆనంద్. ‘‘సమాజం మీద బాధ్యత ఉన్న కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. నటుడిగా ఆల్రెడీ నిరూపించుకున్నారు’’ అన్నారు రచయిత వైరముత్తు. ‘‘6వ తరగతిలో పెయింటింగ్ పోటీలో నా చేతుల మీదగా ఆవార్డ్ తీసుకున్నారు ఆనంద్. సూర్యకు, తనకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు శివకుమార్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement