-
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
TS EAMCET: ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. -
ఇమ్రాన్ ఖాన్కు పదవీ గండం.. పాక్-ఆసీస్ సిరీస్పై నీలినీడలు..!
Political Tensions In Pakistan: పాకిస్థాన్లో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసీస్-పాక్ మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్పై ప్రభావం చూపేలా ఉన్నాయి. దాయాది దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఈ నెలాఖర్లోగా (మార్చి 28 నుంచి 30 మధ్యలో) తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇమ్రాన్కు పదవీ గండం తప్పేలా లేదని తెలుస్తోంది. పాక్లో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆసీస్-పాక్ సిరీస్ కొనసాగడం అనుమానంగా మారింది. ఇరు జట్ల మధ్య మార్చ్ 29 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకావల్సి ఉండగా, అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఇస్లామాబాద్లో భారీ ర్యాలీలు జరగనున్నాయి. ఈ ర్యాలీలు జరిగే ప్రదేశం క్రికెటర్లు బస చేసే హోటల్కు అతి సమీపంలో ఉండటంతో తదుపరి సిరీస్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్ వేదికల మార్పు అంశాన్ని పీసీబీ పరిశీలిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేదికను లహోర్కు మార్చే ఆలోచనలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా.. పాకిస్థాన్లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో పాక్తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్లు డ్రా కాగా, ఈ నెల 21 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం ఈనెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. హర్భజన్ సింగ్కు బంపర్ ఆఫర్ -
షెడ్యూల్ మార్చండి.. ముందుగా టీ20లు నిర్వహించండి..!
కొలొంబో: వచ్చే నెలలో టీమిండియాతో జరగబోయే సిరీస్ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది. రెండు టెస్ట్లు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు లంక జట్టు ఫిబ్రవరి 25న భారత్కు రావాల్సి ఉండగా.. ఈ సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐని అభ్యర్ధించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్లో తొలుత టెస్ట్లు, ఆతర్వాత టీ20లు జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు కంటిన్యూయేషన్గా భారత్తో తొలుత టీ20లు, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ నిర్వహిస్తే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్ఎల్సీ పేర్కొంది. దీని వల్ల ఆటగాళ్లను వెనక్కి పిలిపించే సమస్య ఉండదని విన్నవించుకుంది. ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టునే భారత్కు పంపించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రయాణ భారంతో పాటు బయో బబుల్ సమస్య కూడా తలెత్తదని వివరించింది. కాగా, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 25న తొలి టెస్ట్, మార్చి 5న రెండో టెస్ట్, అనంతరం మార్చి 13,15,18 తేదీల్లో మూడు టీ20లు జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, దేశంలో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో లంకతో సిరీస్ను ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు వేదికల్లో(బెంగళూరు, మొహాలి, ధర్మశాల, లక్నో) కాకుండా రెండు వేదికల్లోనే కుదించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. బెంగళూరు, లక్నో నగరాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మొహాలి, ధర్మశాలల్లో మ్యాచ్లను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తుంది. చదవండి: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు -
రెండు వేదికల్లోనే ...
ముంబై: వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే వన్డే, టి20 సిరీస్ల షెడ్యూల్లో బీసీసీఐ మార్పులు చేసింది. 3 వన్డేలు, 3 టి20ల కోసం గతంలో ఆరు వేదికలను ప్రకటించగా, ఇప్పుడు కరోనా ఇబ్బందుల కారణంగా వాటిని రెండుకు కుదించారు. వన్డే సిరీస్ మొత్తం అహ్మదాబాద్లో, టి20 సిరీస్ మొత్తం కోల్కతాలోనే జరుగుతుందని బోర్డు వెల్లడించింది. భారత్, విండీస్ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డేలు...16, 18, 20 తేదీల్లో టి20లు నిర్వహిస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
Advertisement