-
2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని, ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని, అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ సుప్రీం రాజ్యాంగ బెంచ్ తీర్పునకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. చదవండి: లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట ఎస్ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమాధానమిచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు, ఇతర ఏ అంశాలను చేపట్టలేమని, ఇందులో లోపాలున్నాయని తెలిపారు. -
1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఏడాదిలో 1.5 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందివ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే చేరుకుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మూడేళ్లలో 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి ఏడాది 1.5 కోట్ల కనెక్షన్లు జారీచేయాలని నిర్దేశించుకుంది. మూడేళ్లకు రూ.8 వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని 2016–17 బడ్జెట్లో ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్ఈసీసీ) సమాచారం ఆధారంగా గుర్తించిన నిరుపేద కుటుంబ మహిళ పేరిట ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ జారీచేస్తారు. -
దయనీయం.. పల్లె భారతం
-
దయనీయం.. పల్లె భారతం
మూడింట ఒకవంతు గ్రామీణ కుటుంబాలకు సాగుభూమి లేదు సగానికి పైగా కుటుంబాలకు కూలిపనే జీవనాధారం ♦ మూడింట ఒక వంతు నిరక్షరాస్యులే ♦ 75% కుటుంబాల్లోని అత్యధిక సంపాదన పరుడి ఆదాయం ఐదువేలే ♦ 2011 జనగణనలో వెల్లడైన వాస్తవాలు ♦ ఈ వివరాలను ప్రభుత్వ పథకాల అమలుకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం ♦ కులగణన వివరాలను వెల్లడించని వైనం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ‘2011 సామాజిక, ఆర్థిక , కుల జనగణన(ఎస్ఈసీసీ)’ వివరాలు గ్రామీణ భారత దయనీయ ముఖచిత్రాన్ని కళ్లకు గట్టాయి. గ్రామాల్లోని ప్రతీ మూడు కుటుంబాల్లో ఒకటి కూలి పనిని జీవనోపాధిగా చేసుకున్న సాగుభూమి లేని నిరుపేద కుటుంబమేనని ఎస్ఈసీసీలో తేలింది. 23.52% గ్రామీణ కుటుంబాల్లో చదువుకున్న పెద్దలెవరూ(25 ఏళ్లు పైబడినవారు) లేరని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన జనగణన-2011 వివరాలను శుక్రవారం ఆ శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. ఈ సెన్సస్లో వివరాల నమోదుకు పేపర్ను ఉపయోగించకపోవడం విశేషం. చేతిలో ఇమిడే 6.4 లక్షల ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో పౌరుల వివరాలను నమోదు చేశారు. 1932 తరువాత కులాల వారీగా వివరాలను నమోదు చేసిన సెన్సస్ ఇదేనని జైట్లీ పేర్కొన్నారు. అయితే, ఈ సెన్సస్లో సామాజిక, ఆర్థికాంశాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో విధాన రూపకర్తలకు ఈ నివేదిక అత్యంత విలువైనదన్నారు. ‘ఈ నివేదికలో ప్రాంతం, వర్గం, కులం, ఆర్థిక స్థితి.. మొదలైన విభాగాల వారీగా గణాంకాలున్నాయి. ఏ ప్రాంతం, ఏ సామాజిక వర్గం ప్రజలు ఆర్థికంగా, జీవన ప్రమాణాల పరంగా ఉన్నత స్థాయికి వెళ్లారనే వివరాలున్నాయి. వీటి ద్వారా భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను నిర్ధారించుకోవచ్చు’ అని జైట్లీ వివరించారు. వీటి ద్వారా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకుని పేదరిక నిర్మూలనకు శాస్త్రీయంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని బీరేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల వాస్తవ లబ్ధిదారుల ఎంపికకు ఇవి ఉపయోగపడ్తాయన్నారు. ఈ నివేదిక పేరు(ఎసీఈసీసీ)లో కుల గణన అని ఉన్నప్పటికీ.. ఆ గణాంకాలను వెల్లడించడం లేదన్నారు. ఎస్ఈసీసీ గణాంకాలు అందరికీ ఇళ్లు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి హామీ తదితర పథకాల్లో ఉపయోగపడ్తాయన్నారు. పేదరికాన్ని నిర్ధారించే ‘బీపీఎల్’ విధానం ఆధారంగా కాకుండా ఈ గణాంకాల ఆధారంగానే పథకాల అమలు ఉంటుందన్నారు. 30 శాతం గ్రామీణ కుటుంబాలు ఎస్సీ, ఎస్టీలే గ్రామీణ కుటుంబాల్లో 29.43% షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవేనని తాజా ఎస్ఈసీసీ గణాంకాల్లో తేలింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఎస్సీ జనాభా పంజాబ్లో అత్యధికంగా(36.74%) ఉండగా, తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్(28.45%), తమిళనాడు(25.55%) ఉన్నాయి. ఎస్టీల జనాభా మిజోరంలో అత్యధికంగా(98.79%) ఉండగా, లక్షద్వీప్(96.59%), నాగాలాండ్(93.91%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల సగటు దేశవ్యాప్తంగా 18.46%, 10.97%. నిరక్షరాస్యతలో 4వ స్థానంలో తెలంగాణ మూడింట ఒక వంతు పల్లె దేశీయులు నిరక్షరాస్యలు. వారిలో అక్షరాస్యత శాతం 64%. వీరు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్(47.58%), మధ్యప్రదేశ్(44.19%) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 40.42% పల్లె నిరక్షరాస్యులతో 4వ స్థానంలో ఉంది. కేరళ 11.38% నిరక్షరాస్యులతో ఆఖర్న ఉంది. ఎస్ఈసీసీ - 2011 ముఖ్యాంశాలు.. ♦ దేశంలో మొత్త 24.39 కోట్ల కుటుంబాలున్నాయి. పల్లెల్లోని కుటుంబాలు 17.91 కోట్లు. ఈ పల్లె కుటుంబాల్లో 10.69 కోట్లు నిరుపేద కుటుంబాలు. ♦ 2.37 కోట్ల(13.25%) గ్రామీణ కుటుంబాలు కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న ఒకే ఒక్క గదిలో నివసిస్తున్నాయి. ♦ 51.14% పల్లె కుటుంబాలు(9.16కోట్లు) కూలిపనిపై, 30.10% కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. 14.01%(2.5 కోట్లు) ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లాంటి వాటిపై ఆధారపడి ఉన్నాయి. ♦ 4.08 లక్షల మంది చెత్త ఏరుకోవడం ద్వారా, 6.68 లక్షల మంది భిక్షాటన, ఎన్జీవోల సాయం ద్వారా జీవనం గడుపుతున్నారు. ♦ గ్రామాల్లో మాన్యువల్ స్కావెంజర్స్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర(2.5%)తొలి స్థానంలో ఉంది. ఈ విషయంలో దేశ సగటు 0.10%(18.06 లక్షలు)గా ఉంది. గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మణిపూర్, అస్సాం తదితర 9 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థను నిర్మూలించాయి. ♦ పల్లెల్లో ఎక్కువ మొత్తం సంపాదించే కుటుంబ సభ్యుడి సంపాదన నెలకు సగటున రూ.5 వేల లోపే ఉన్న కుటుంబాలు74.49%(13.34 కోట్ల కుటుంబాలు). 1.48 కోట్ల కుటుంబాల్లోని (8.29%) అత్యధిక సంపాదనాపరుడైన వ్యక్తి నెలవారీ సంపాదన మాత్రం రూ. 10 వేలుగా ఉంది. ♦ గ్రామాల్లో నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగస్తుల కుటుంబాలు 9.68%. ఈ కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లిస్తోంది 4.6% కులాలవారీ వివరాలు లేవు కులాధారిత గణాంకాలను ఈ నివేదికలో ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన సామాజిక, ఆర్థిక వివరాలకే ప్రాధాన్యమిచ్చామని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్లనే కులాలవారీ వివరాలను వెల్లడించడం లేదన్న విమర్శలపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ స్పందిస్తూ.. దీనికి, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఏయే వివరాలను వెల్లడించాలన్నది సెన్సస్ డీజీ పరిధిలోని అంశమన్నారు. 2011లో ఈ జనగణన ప్రక్రియ ప్రారంభమైన సమయంలో.. కులాలవారీ గణన చేపట్టాలన్న డిమాండ్ భారీగా వచ్చింది. ఎస్పీ నేత ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ తదితరులు గట్టిగా పట్టుపట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement