-
2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని, ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని, అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ సుప్రీం రాజ్యాంగ బెంచ్ తీర్పునకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. చదవండి: లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట ఎస్ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమాధానమిచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు, ఇతర ఏ అంశాలను చేపట్టలేమని, ఇందులో లోపాలున్నాయని తెలిపారు. -
పల్లెతల్లి ఒడిలోనే..
► పల్లెటూళ్లలోనే 81.02 శాతం కుటుంబాలు ► 18.98 శాతం కుటుంబాలదే పట్టణవాసం ► 17.26 శాతం కుటుంబాల్లో మహిళలదే పెత్తనం ► భూమిలేని కుటుంబాలు 62.38 శాతం ► రోజు కూలీపైనే 62.25 శాతం కుటుంబాల జీవనం ► ఉద్యోగంపై సంపాదిస్తున్నది 4.19 శాతమే.. ► 83.88 శాతం కుటుంబాలు ‘హలో’ అంటున్నాయి ► సామాజిక, ఆర్థిక, కులగణన తాజా నివేదికలో వెల్లడి సాక్షి, కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా చూస్తే అధికశాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే 81.02 శాతం కుటంబాలు పల్లెతల్లి ఒడిలోనే సాగిస్తున్నాయి. జిల్లాలో మొత్తంగా 9,27,865 కుటుంబాలకు 7,51,791 (81.02 శాతం) కుటుంబాలు గ్రామీణ ప్రాం తాల్లోనే నివాసం ఉంటున్నాయి. 18.98 శాతం (1,76,074) కుటుంబాలు నగరం, పట్టణాల్లో ఉన్నాయి. నెల మొదట్లో జీతం ముఖం చూసే కుటుం బాలు 31,531 (4.19 శాతం) మాత్రమే. 4,67,959 (62.25 శాతం) కుటుంబాలు రోజు కూలీపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ గణంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్ఈసీసీ) స్పష్టం చేసింది. గ్రామీణ భారత పరిస్థితులు, వారు గడుపుతున్న జీవితం, ఆదాయ మార్గాల అన్వేషణ, షెడ్యూల్డ్ కులాలు, తెగల్లో ఆర్థిక సాధికారిత, కనీస మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఉద్యోగం తదితర అంశాలు ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. అధికారులు ఈ నివేదికను ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు ఢిల్లీలో అందజేశారు. 2011 మార్చిలో ప్రారంభమైన ఈ సర్వే 2016 డిసెంబర్లో పూర్తయ్యింది. భూమిలేని నిరుపేదలు 62.38 శాతం.. సొంత వ్యవసాయం చేస్తున్నది 37.62 శాతం.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 57.54 శాతం భూమిలేని నిరుపేద కుటుంబాలు ఉంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 62.38 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 7,51,791 కుటుంబాలకు గాను.. వీరిలో 62.38 శాతం కుటుంబాలకు చెందిన వారు భూమిలేని నిరుపేదలు. 2,82,837 కుటుంబాలకే భూమి ఉంది. మొత్తం 71,71,158.41 ఎకరాల భూమి ఉంటే 11,29,310 (15.75 శాతం) ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేదు. 55,83,294 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉండగా... ఇందులో 4,58,552 (6.39 శాతం) ఎకరాల్లోనే రెండు పంటలు సాగవుతున్నాయి. సొంతంగా వ్యవసాయంపై గ్రామీణ ప్రాంతాల్లో 37.62 శాతం కుటుంబాలు మాత్రమే ఆధారపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాగా డ్రిప్, స్ప్రింక్లర్లు, ఎలక్ట్రికల్ మోటార్లు తదితర పరికరాలను సొంతంగా వినియోగిస్తున్న రైతు కుటుంబాలు 86,411 (11.49 శాతం) కాగా, 24,559 (3.27 శాతం) కుటుంబాలు వ్యవసాయ యాంత్రీకరణను పాటిస్తున్నాయి. రూ.50 వేలకు పైన పరిమితి ఉన్న కిసా¯ŒS క్రెడిట్ కార్డులు 2,772 (0.45 శాతం) కుటుంబాలకే ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నది 31,531 కుటుంబాలు.. 62.25 శాతం కుటుంబాలు రోజూ కూలీపైనే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 7,51,791 కుటుంబాలకు.. ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నది 31,531 (4.19 శాతం) కుటుంబాలే. ప్రభుత్వ ఉద్యోగులుగా నెల మొదట్లో డబ్బు ముఖం చూసేది ఈ కుటుంబాలే. ఈ 31,531 కుటుంబాల్లో 15562 (2.07 శాతం) కుటుంబాలు ప్రభుత్వ సెక్టారులో, 13,328 కుటుంబాలు ప్రైవేట్ సెక్టారులో ఉద్యోగం చేస్తున్నారు. 5,92,161 కుటుంబాలు రూ.5 వేల కంటే తక్కువ, 1,28,371 కుటుంబాలు రూ.5 వేల నుంచి 10 వేల మధ్యన సంపాదిస్తుండగా, రూ.10 వేలపైన సంపాదిస్తున్న కుటుంబాలు 31,240 మాత్రమే. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 26,011 కుటుంబాలు ఆదాయ, వృత్తి పన్ను చెల్లిస్తుండగా, 17,833 కుటుంబాలు సొంత వ్యాపారాలపై సంపాదిస్తున్నాయి. అత్యధికంగా 4,67,959 (62.25 శాతం) కుటుంబాలు రోజూ కూలీ ద్వారా జీవనం సాగిస్తున్నాయి. 83.88 శాతం ‘హలో’ అంటున్నారు.. పెళ్లికాని వారు 40.17 శాతం.. ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో 83.88 శాతం మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు సామాజిక, ఆర్థిక, కులగణన నివేదిక తేల్చింది. 6,30,619 (83.88 శాతం) కుటుంబాలు మొబైల్ ఫోన్లు వాడుతుండగా, 6,476 కుటుంబాలు ల్యాండ్లైన్ ఫోన్లు, 6,244 కుటుంబాలు ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్లు వాడుతున్నాయి. ల్యాండ్ఫోన్, మొబైల్ ఫోన్లు లేని కుటుంబాల సంఖ్య 1,08,451 (14.43 శాతం)గా ఉంది. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాలు తదితర వాహనాలను 1,77,052 (23.55 శాతం) కుటుంబాలు వాడుతుండగా, 39,548 (5.26 శాతం) కుటుంబాల్లో ఫ్రిజ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం గ్రామీణ జనాభా 28,70,716 కాగా, స్త్రీ, పురుషులు 14,74,920 మంది వైవాహిక జీవితం గడుపుతుండగా, 11,53,078 (40.17 శాతం) మంది పెళ్లికాని వారు ఉన్నారు. 1,72,451 మంది పెళ్లయి వితంతువులుగా ఉండగా.., 24,655 మంది ఒంటరిగా, 8,040 మంది విడాకులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో మొత్తంగా 6,21,974 (82.73 శాతం) కుటుంబాలు పురుషుల నేతృత్వంలో సాగుతుండగా, 1,29,791 (17.26 శాతం) కుటుంబాలు మహిళల నేతృత్వంలో నడుస్తున్నాయి. మూడు గదులకుపైన ఇళ్లు ఉన్న కుటుంబాలు 10.46 శాతమే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 7,07,184 కుటుంబాలు సొంత ఇళ్లలో.. 5.52 శాతం మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. 94.07 శాతం మందికి సొంత ఇళ్లున్నా.. మూడు గదులకుపైన ఉన్న కుటుంబాలు 78,642 (10.46 శాతం) మాత్రమే. అత్యధికంగా రెండు గదుల ఇళ్లు 4,32,192 (57.48 శాతం) కాగా, మూడు గదులున్న ఇళ్లు 1,17,386 (15.61 శాతం), ఒక్క గది ఉన్న ఇళ్లు 1,22,082 (16.23 శాతం) ఉన్నాయి. కాగా.. వెదురు, గడ్డి, తాటాకు ఇళ్లలో 4,319 కుటుంబాలు, ప్లాస్టిక్ పాలిథిన్ గుడారాల్లో 800, కర్ర ఇళ్లలో 1,222 కుటుంబాలు జీవనం గడుపుతుండగా.. మట్టి, కాల్చని ఇటుకతో కట్టిన ఇళ్లలో 52,542 కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పచ్చ మేనిఫెస్టోలో పచ్చి మోసాలు
స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
నా స్నేహితుడు: అల్లు అర్జున్
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కి అల్లు అర్జున్ ప్రచారం!
తప్పక చదవండి
- ‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement