-
సైలెంట్గా హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి.. ఫోటోలు వైరల్
-
Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ రెండో కుమార్తె జుయే తరచూ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కిమ్ వారసురాలు ఆమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జుయే వయసు కేవలం పదేళ్లు మాత్రమే. తన తోటి వయసు పిల్లల కంటే పొడవుగా పెద్దదానిలా జుయే కనిపిస్తుందని గతంలోనే దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. అంత చిన్న వయసున్న జుయే ఖండాంతర క్షిపణి పరీక్షల ప్రయోగాలకు హాజరు కావడం విస్మయ పరుస్తోంది. ఆ ప్రయోగాల సమయంలోనే తొలిసారిగా మీడియా కంటపడింది. తాజాగా ఆదివారం కిమ్, తన కుమార్తెతో కలిసి శాస్త్రవేత్తలు, ఇతర అధికారులతో చర్చిస్తున్న ఫోటోలను అధికారిక మీడియా విడుదల చేసింది. -
అక్కతో కలిసి..
తమిళసినిమా: నటుడు శరత్కుమార్ రెండో కూతురు కూడా చిత్రరంగ ప్రవేశం చేసింది. శరత్కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మీ నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పోడా పోడీ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన వరలక్ష్మి బాలా దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మహిళల రక్షణ కోసం సేవ్ శక్తి అనే స్వచ్ఛంద సం స్థను ప్రారంభించన వరలక్ష్మి తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం గా రూపొందుతున్న శక్తి అనే చిత్రం లో నటిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్ శిష్యురాలు ప్రియదర్శని తొలిసారిగా మోగాఫోన్ పడుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారట. దీని గురించి ఆమె చెబుతూ ఇది పోలీస్ అధికారిణికి విలన్కు మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కిస్తు న్న యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు పూజ కాస్ట్యూం డిజైనర్గా పరిచయం అవుతోందని తెలిపా రు. చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది మార్చిలో శక్తి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. -
కూతుర్ని తనివితీరా చూడకుండానే...
విశాఖపట్నం: తన రెండో కుమార్తెతో అదృష్టం కలిసొచ్చిందని ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ భావిస్తున్నాడు. ఇటీవల జన్మించిన తన కుమార్తెను చూసి మురిసిపోయేందుకు సమయం చిక్కడం లేదని వాపోయాడు. తన కూతుర్ని చూసేందుకు అక్టోబర్ లో బంగ్లాదేశ్ టూర్ నుంచి కుక్ స్వదేశం చేరుకున్నాడు. అయితే 18 గంటలు మాత్రమే అతడు కుటుంబంతో గడిపాడు. తన ముద్దుల కూతుర్ని తనివితీరా చూడకముందే భారత్ కు పయనమయ్యాడు. టీమిండియాతో రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసి తన రికార్డు మెరుగుపరుచుకున్నాడు. ‘కేవలం 18 గంటల పాటు నా కుమార్తెను చూడడానికి సమయం చిక్కింది. ముద్దులొలికే పాపాయిని వదిలిరావడానికి చాలా కష్టపడ్డా. ఆమె పుట్టగానే అదృష్టం కలిసివచ్చి మరిన్ని పరుగులు సాధించాన’ని కుక్ చెప్పాడు. అయితే తనను బ్రాడ్మన్ తో పోల్చవద్దని కోరాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి టీమిండియాతో జరగనున్న రెండో టెస్టులోనూ రాణించేందుకు కుక్ సన్నద్దమవుతున్నాడు. -
హల్చల్ చేస్తున్న పవర్స్టార్ లిటిల్ ప్రిన్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమార్తె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుకల్లో సందడి చేసిన ఈ చిన్నారి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పవన్, అన్నా లెజెనివా ల ముద్దుల తనయ 'పోలెనా' ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ అభిమాన హీరో లిటిల్ ప్రిన్స్ తాజా ఫోటోలతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించిన శ్రీజ- కళ్యాణ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా కొత్త కళను తీసుకొచ్చిందని అభిమానులు మురిసిపోయారు. మరోవైపు ఈ లిటిల్ ప్రిన్స్.. అల్లు అర్జున్ కొడుకు అయాన్, ఇతర మెగా ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటూ సందడి చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement