-
తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్
అధికారులకు చంద్రబాబు ఆదేశం.. పలు అంశాలపై సమీక్ష హైదరాబాద్: ఆదాయ వనరులు, రుణ పరపతి పెంపు విషయంలో తెలంగాణ స్థాయికి సీమాంధ్రను తీసుకువెళ్లడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలని కాబోయే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర విభజన, సీమాంధ్రలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. చంద్రబాబు మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. కొత్తగా విమానాశ్రయాలను ఎక్కడ ఏర్పాటు చేయవచ్చు, రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు లేని ప్రాంతాలు ఏవి? వీటి కోసం ఎంత మేర పెట్టుబడులు అవసరం అవుతాయో తెలియజేయూలన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై వారంలో నివేదికలు సమర్పిస్తామని నూతన ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు చెప్పారు. -
సీమాంధ్రలో సమరభేరి
175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల రణం ఊపందుకుంది. వచ్చే నెల 7న పోలింగ్ జరగనున్న 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా.. తొలి రోజే నామినేషన్ల పర్వం జోరందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకివే తొలి సార్వత్రిక ఎన్నికలు కాగా.. ఆ పార్టీ సీమాంధ్రలోని అసెంబ్లీ, లోక్సభ స్థానాలన్నింటికీ ఒకేసారి జాబితా విడుదల చేయాలని నిర్ణయించింది. సోమవారమే ఆ జాబితా వెలువడనుందని విశ్వసనీయ సమాచారం. జాబితా ప్రకటనకు ఒక్క రోజు ముందు ఆదివారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి రెండు దఫాలుగా సీమాంధ్ర అభ్యర్థుల జాబితా ప్రకటించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 87 అసెంబ్లీ, 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 15 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలను తీసేస్తే.. ఇంకా 73 అసెంబ్లీ, 7 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎం, సీపీఐలు ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం తన జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జోరుగా ప్రచారం.. ఇప్పటికే ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసిన వైఎస్సార్ సీపీ అగ్ర ప్రచారకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిల రెండో దఫా పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం గుంటూరు జిల్లాలో రెండో దఫా ప్రచారం ప్రారంభించగా.. అధ్యక్షుడు జగన్ సోమవారం జాబితా ప్రకటన అనంతరం కర్నూలు జిల్లా ప్రచారానికి బయల్దేరనున్నారు. షర్మిల ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సీమాంధ్రతోపాటు ఆరు రాష్ట్రాలలోని స్థానాలకు నోటిఫికేషన్ ఎనిమిదో దశలో సీమాంధ్రతోపాటు ఎన్నికలు జరుగనున్న ఆరు రాష్ట్రాల్లోని 39 లోక్సభ నియోజకవర్గాలకూ శనివారం నోటిఫికేషన్ వెలువడింది. మే 7న ఉత్తరప్రదేశ్లోని 15 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గం కూడా ఉంది. బీహార్లోని ఏడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు, జమ్మూ కాశ్మీర్లో రెండు, ఉత్తరాఖండ్లో ఐదు, పశ్చిమ బెంగాల్లో ఆరు నియోజకవర్గాలకు అదే రోజు ఎన్నికలు జరుగుతాయి. -
సీమాంధ్రలో 5 సీట్లకేనా?
మోడీ హవా ఉంటే పరిమిత సీట్లకే పోటీ చేయడమేంటన్న మీడియా ప్రశ్నకు వెంకయ్యనాయుడు తటపటాయింపు ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నామని జవాబు హైదరాబాద్: ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీదే హవా అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలకు ఆంధ్రప్రదేశ్లో ఇరకాట పరిస్థితి ఏర్పడింది. మోడీ హవా అంతగా ఉంటే సీమాంధ్రలో ఐదు లోక్సభ సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు ఆ పార్టీ నేతలు తడబడుతున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుదీ ఇదే పరిస్థితి. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురవగా.. జవాబు చెప్పేందుకు ఆయన కాసేపు తటపటాయించారు. కొద్ది క్షణాల తరువాత ‘అలా నిర్ణయం తీసుకున్నాం’ అని బదులిచ్చారు. ‘‘మా పార్టీ నిర్ణయాలపై మీరు(మీడియా) ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చినప్పటికీ.. మా బలమేంటో ప్రజలే తీర్పిస్తారు’’ అని అంటూ.. సీమాంధ్రలో ఓట్లు చీలకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. బీజేపీ-టీడీపీల పొత్తుపై కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. గతంలో వారు పొత్తులు పెట్టుకున్నప్పడు ఒప్పయింది.. ఇప్పుడు తప్పెలా అవుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి కాకుండా ఇతరులకు ఓటు వేస్తే అస్థిరత్వానికి ఓటు వేసినట్టే అవుతుందని చెప్పారు. తాను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని.. అన్నిచోట్లా నరేంద్ర మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనూ లోక్సభకు మోడీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నార న్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడుదశల పోలింగ్లో బీజేపీ ముందుకు దూసుకుపోతోందని స్పష్టమైందని, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు కూడా ఊహించని ఫలితాలొస్తాయని జోస్యం చెప్పారు. మోడీ ప్రభావంతోనే యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటున్నారన్నారు. మన్మోహన్సింగ్ ప్రధాని పదవిలో కొనసాగినా అధికారిక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలాయించారని ప్రధానికి సలహాదారునిగా పనిచేసినవారు రాసిన పుస్తకంపై ఆ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నా.. ఎన్నికల తర్వాత మళ్లీ అందర్నీ కూడగట్టి వెనుక నుంచి అధికారం చలాయించే ప్రమాదముందని హెచ్చరించారు. -
నాడు తిట్లు.. నేడు పొగడ్తలు
మాచర్లటౌన్, న్యూస్లైన్: నాడు కాంగ్రెస్ నాయకులను విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు వారినే తన పార్టీలో చేర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సీమాంధ్ర రాజధానికి ప్యాకేజీ అడిగిన చంద్రబాబు నిత్యం కాంగ్రెస్ నాయకులను విమర్శించారన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులం దరిని చంద్రబాబు దుమ్మెత్తి పోశారని, నేడు వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ టీడీపీలో చేర్చుకుంటూ పార్టీ బలోపేతమవు తుందని చెప్పుకుంటున్నారన్నారు. బాబు రాజకీయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. అంతేకాక సీమాంధ్రను అభివృద్ధి చేయగలిగిన శక్తిమంత నేత జగన్ అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు జగన్ అన్నారు.అందుకే ఆయనపై విశ్వాసంతో అన్ని ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలువబోతున్నారన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమా వేశంలో మార్కెట్యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తెగిన బంధం...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతాయని సాగునీటి శాఖ గుర్తించిన 205 గ్రామాల (134 రెవెన్యూ గ్రామాలు)తో పాటు మరో మూడు గ్రామాలు కలిపి మొత్తం 208 గ్రామాలను తెలంగాణ నుంచి మినహాయిస్తున్నట్లు మంగళవారం లోక్సభ ఆమోదించిన బిల్లులో పేర్కొన్నారు. పోలవరం కడితే మునిగిపోతాయని సాగునీటి శాఖ 2005 జూన్ 27న విడుదల చేసిన జీవోనెం.111లో గుర్తించిన 205 గ్రామాలతో పాటు బూర్గంపాడు మండల పరిధిలోకి వచ్చే సీతారాంనగరం, బూర్గం పాడు, కొండ్రెక గ్రామాలను సీమాంధ్రలో కలుపుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు గ్రీన్సిగ్నల్ లభించింది. దీంతో ఇన్నాళ్లూ ముంపు ప్రాంతాలు కూడా తెలంగాణలోనే ఉంటాయనే జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆదివాసీ సంఘాలు, తెలంగాణవాదుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని కనుమరుగు చేయడంతో పాటు లక్షలాది ఎకరాల అటవీ భూములను గోదావరిలో ముంచొద్దని తాము చేస్తున్న పోరాటాలను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తాము ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరో 18 గ్రామాల పరిస్థితేంటి? అయితే, పోలవరం రికార్డుల్లో 205 గ్రామాలనే పేర్కొన్నా వాటితో పాటు మరో 18 గ్రామాలు ఖచ్చితంగా ముంపునకు గురవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం లేకపోయినా... కూనవరం మండలంలోని ముల్లూరు,భీమవరం, లేళ్లవాయి, లక్ష్మిపురం, కొండ్రాజ్పేట,కొత్తూరు ,శ్రీరాంపురం,చినార్కూరు, కరకగూడెం,పొట్లవాయిగూడెం,పైదిగూడెం,రేపాకకాలని,నర్సింగపేట, చింతూరు మండలంలోని నర్శింగపేట, వీఆర్పురం మండలంలోని చిరుగువాడ,భొవనగిరి,జల్లివారిగూడెం ,శబరిరాయిగూడెం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మరి, ఈ గ్రామాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న సర్వత్రా వస్తోంది. మండలాల్లో మార్పులేదు తొలుత పేర్కొన్న విధంగా జిల్లాలోని నాలుగు మండలాలు పూర్తిగా మునిగిపోతాయని, ఆ నాలుగు మండలాలు జిల్లా చిత్ర పటం నుంచి వెళ్లిపోతాయని అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లాకు చెందిన ఏ ఒక్క మండలం కూడా పూర్తిగా ముంపునకు గురికావడం లేదు. అయితే, గ్రామం ఉంటే పొలాలు, పొలాలుంటే గ్రామా లు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలు యథాతథంగా ఉంటాయని, ముంపునకు పోను మిగిలిన గ్రామాలతో మండలాలు కొనసాగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నా... తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా, జిల్లాలోని పంచాయతీలలో 208పంచాయతీలు తగ్గుతాయని భావిస్తున్నారు. జీవోనెం.111 ప్రకారం పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలివే..... భద్రాచలం మండలం...13 గ్రామాలు రాచగొంపల్లి, గౌరిదేవిపేట, నందిగామ, నందిగామపాడు, మురుమూరు, గొమ్ముమురుమురు, కాపవరం, టిపివీడు, గోగుబాక, గొమ్ముకొత్తగూడెం, గొమ్ముకోయగూడెం, గొల్లగూడెం, సీతాపురం కూనవరం మండలం.....48 గ్రామాలు చినపోలిపాక ,పెదపోలిపాక, గుండువారిగూడెం,పోచవరం,పోచవరం కాలనీ, కాచవరం,దూగుట్ట, కూళ్ళపాడు, టేకుబాక, వెంకటాయిపాలెం, కోట్లవాయి, గొమ్ముయ్యవారిగూడెం, పెదనర్సింగపేట,చిననర్సింగ పేట, కరకగూడెం, అయ్యవారిగూడెం,కొండాయిగూడెం,గొమ్ముగూడెం,కుమారస్వామిగూడెం,మర్రిగూడెం, పల్లూరు, జగ్గవరం, జగ్గవరం కాలని, చూచిరేవులగూడెం, చూచిరేవుల,కూనవరం, టేకులబోరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, జిన్నెలగూడెం,బండారుగూడెం,పెదార్కూరు,రేపాక,ముసురగూడెం, భగవాన్ పురం, ముల్లూరు, కూటూరు,అభిచర్ల,లింగాపురం,కొడేరు,తాళ్ళగూడెం,బొజ్జరాజుగూడెం, రేగులపాడు, రావిగూడెం, వెంకన్నగూడెం,పండ్రాజ్పల్లి, శబరికొత్తగూడెం,వాల్ఫర్డ్పేట. చింతూరు... 17 గ్రామాలు చింతూరు, చిడుమూరు, వీరాపురం, చట్టి, కుమ్మూరు, బండారుగూడెం, గొర్రెల గూడెం, మామిళ్లగూడెం, కల్లేరు, కుయిగూరు, చూటూ రు, ముకునూరు, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, జల్లివారిగూడెం, ఉలుమూరు, మల్లెతోట. వీఆర్పురం...45 గ్రామాలు చొప్పలి, రామవరం, రామవరంపాడు,సోములగూడెం,కొప్పల్లి, రావిగూడెం, బోరిగూడెం, అడవి వెంకన్నగూడెం,ప్రత్తిపాక,తుష్టివారిగూడెం, గుండుగూడెం,చింతవేవుపల్లి, కన్నాయగూడెం, సున్నంవారిగూడెం,నూతిగూడెం,మిట్టిగూడెం,ఉమ్మిడివరం,గుర్రంపేట,అన్నవరం, రేఖపల్లి, వడ్డిగూడెం,ధర్మతాళ్ళగూడెం, వీఆర్పురం,తోటపల్లి,రాజుపేట,రాజుపేటకాలని,సీతంపేట,శ్రీరామగిరి, చొక్కనపల్లి, కొత్తూరు,కల్తునూరు,జీడిగుప్ప,ఇసునూరు, రావిగూడెం, ములకపల్లి,ముత్యాలమ్మగండి, భీమవరం, ఇప్పూరు,కొత్తూరుగొమ్ము,పోచవరం, తుమ్మిలేరు,కొండేపూడి, కొల్లూరు,గొందూరు,నర్సింగపేట. బూర్గంపాడు మండలం: 9 గ్రామాలు శ్రీధర, వెలేరు, రాయిగూడెం, వెంకటాపురం, అల్లిగూడెం, బోనగిరి, గుంపెనపల్లి, ఇబ్రహీం పేట, గణపవరం, (ప్రస్తుతం లోక్సభ ఆమో దం పొందిన బిల్లు ప్రకారం ఇదే మండలంలోని సీతారాంనగరం, కొండెరక, బూర్గంపా డు గ్రామాలు కూడా ఈ జాబితాలో చేరతాయి.) కుక్కునూరు మండలం.. 34 గ్రామాలు తొండిపాక,మెట్టగుడెం,బంజరగుడెం,అమరవరం,కోమట్లగుడెం, ఉప్పేరు, కొయ్యగుడెం, రెడ్డిగుడెం, దామరచర్ల,ఎల్లప్పగుడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాధవరం, కౌడిన్యముక్తి, వింజరం, ముత్యాలమ్మపాడు, కొండపల్లి, కోయగుడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగుడెం, కుక్కునూరు, రామసింగారం, కిష్టారం, కుర్లపాడు, లంకాలపల్లి,ఇసుకపాడు, దాచవరం, బెస్తగుడెం, ఉప్పరమద్దిగట్ల, సీతారామచంద్రపురం, కొత్తూరు, గొమ్ముగుడెం. వేలేరుపాడు మండలం: 39 గ్రామాలు రుద్రమకోట, పాతపూచిరాల, పూచిరాలకాలనీ, లచ్చిగుడెం, రేపాకగొమ్ము, నడిమిగొమ్ము, మద్దిగట్ల, వేలేరుపాడు, నాగులగుడెం, తాట్కూరుగొమ్ము, భూదేవిపేట, శ్రీరాంపురం, జగన్నాధపురం, చాగరపల్లి, కొర్రాజులగుడెం, తిర్లాపురం, కన్నాయిగుట్ట, పాతనార్లవరం, నార్లవరంకాలనీ, కొత్తూరు, చిగురుమామిడి, బోళ్ళపల్లి, ఎడవల్లి, బుర్రెడ్డిగుడెం, కట్కూరు, టేకూరు, కాచారం, కొయిదా, తాళ్ళగొంది, పూసుగొంది, టేకుపల్లి,పేరంటాలపల్లి, చిట్టంరెడ్డిపాలెం, సిద్దారం, చింతలపాడు, పడమటిమెట్ట, బుర్రతోగు, తూర్పుమెట్ట, కాకిస్నూరు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement