-
ఎయిర్పోర్టులో అభిమానితో సెల్పీ, ఫొటో షేర్ చేసిన రాజీవ్ కనకాల
ప్రస్తుతం లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు తమకు సంబంధించిన పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా నటుడు రాజీవ్ కనకాలను షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఓ అభిమాని పట్ల ఆయన చూపించిన ఔదార్యానికి ఫిదా అవుతున్నారు. ఓ అభిమానితో సెల్ఫీ తీసుకున్న ఫొటోను తన ట్విటర్లో శుక్రవారం షేర్ చేస్తూ 2018లో ఎయిర్పోర్టులో తనకు ఎదురైన అనుభవం గురించి రాజీవ్ వివరించాడు. ‘ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇది 2018 నాటి ఫొటో. చెన్నై ఎయిర్ పోర్టులో ఒకసారి నేను నడుచుకుంటూ వెళుతున్నాను. అక్కడే క్లీనింగ్ డిపార్టుమెంటులో పనిచేసే ఓ వ్యక్తి నన్ను చూసి పరుగెత్తుకుంటు వచ్చాడు. అప్పుడు అతని మొహంలో ఉత్సహాన్ని చూశాను. ఆనందంతో అతడి మొహం వెలిగిపోతుంది. ఇక నా దగ్గరికి వచ్చి తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని నా ఫోన్లోనే సెల్ఫీ తీయమని కోరాడు. నేను తీశాను. ఆ తర్వాత దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనుకున్నా కానీ, మరిచిపోయాను. అయితే ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఆ వ్యక్తికి ఈ పోస్టు చేరి, ఈ ఫొటోను సేవ్ చేసుకుంటాడని ఆశిస్తున్నా’ అంటు రాసుకొచ్చాడు. అయితే సాధారణంగా తమ అభిమాన నటీనటులను చూడగానే అభిమానులు ఉప్పోంగిపోతారు. మరు క్షణం ఆలోచించకుండా వారి దగ్గరకి పరుగులు తీసి సెల్ఫీలు తీసుకుంటారు. అయితే కొన్ని సార్లు సెలబ్రిటీ మూడ్ సరిగా లేకపోతే.. అభిమానులకు చీవాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అభిమానులకు సెల్పీ ఇచ్చామా వెళ్లిపోయామా అన్నట్టు ఉండే సెలబ్రెట్రీలతో పోల్చితే రాజీవ్ భిన్నమని నిరుపించుకున్నాడు. ‘ఇంతకాలం వరకు కూడా ఓ అభిమాని సెల్పీని మీ ఫోన్లో ఉంచుకున్నారంటే మీరు గ్రేట్ సార్’, ‘మీ ఔదార్యానికి హాట్సాఫ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Iam not aware of this person but, this was in 2018 when I was walking to catch my flight in Chennai Airport. He belongs to the airport staff cleaning department. With lots of excitement on his face, he rushed towards me, introduced himself, pic.twitter.com/rI2ZlveHiI — Rajeev kanakala (@RajeevCo) June 3, 2021 -
సెల్ఫీ ఖరీదు ప్రాణం..!
బొమ్మ తుపాకీ పట్టుకున్న బాలురపై పాక్ పోలీసు కాల్పులు లాహోర్: డమ్మీ తుపాకీతో సెల్ఫీ దిగాలనుకుని ఓ బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో సోమవారం జరిగింది. ఫర్హాన్(15), ఫహాద్(14) బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగి సోషల్ సైట్లలో తమ ఫొటోలు పెట్టాలని భావించారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే తుపాకీతో ఉన్న వీరిద్దరినీ చూసిన ఓ పోలీసు అధికారి.. వారిని దొంగలుగా భావించి ఎటువంటి హెచ్చరికలూ లేకుండా కాల్పులకు దిగాడు. దీంతో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఫర్హాన్ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దోపిడీకి ప్రయత్నించారని భావించి తాను వారిపై కాల్పులు జరిపినట్టు ఎస్హెచ్వో ఫర్యాద్ చీమా తెలిపాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి చీమా, మరో నలుగురు అధికారులను అరెస్ట్ చేశామని, వారిపై హత్య కేసు నమోదు చేశామని పంజాబ్ న్యాయ శాఖ మంత్రి రానా సనావుల్లా తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement