-
Telangana: పొలం నుంచి మిల్లుకు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలపు వరి కోతలు ఊపందుకున్నాయి. చాలా జిల్లాల్లో 40శాతం వరకు కోతలు, నూర్పిడి పూర్తయి ధాన్యం రాశులు పోగుపడ్డాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అవసరాలకు, అప్పులు తీర్చడానికి డబ్బులు లేక.. ఇంకా వేచి చూడలేక.. దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, మిల్లర్లు అగ్గువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి మద్దతు ధరకన్నా మూడు వందల నుంచి ఆరు వందలదాకా తక్కువ రేటు చెల్లిస్తున్నారు. దీనికితోడు తేమశాతం, తాలు పేరుతో తరుగుతీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పౌరసరఫరాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడో వంతు కేంద్రాలే.. ప్రస్తుత వానాకాలంలో పెరిగిన వరి సాగుకు అనుగుణంగా 6,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. కోటీ రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం కోతలు మొదలై 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు తెరిచిన కొనుగోలు కేంద్రాలు 2,142 మాత్రమే. ముఖ్యంగా నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో వరికోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయంలో పౌరసరఫరాల శాఖ తాత్సారం చేస్తోంది. తెరిచిన కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. వడ్లు కొనే పరిస్థితి లేదు. నల్లగొండ నుంచి పెద్దపల్లి దాకా పెద్ద సంఖ్యలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమ టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటంతోనే గడిచిపోతోందని నల్లగొండకు చెందిన రమేశ్ అనే రైతు వాపోయారు. రాష్ట్రంలో కోటి టన్నులకుపైగా ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.36 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి ఉన్నాయి. వానలు పడితే తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకన్నా తక్కువతో.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, ఏర్పాటైన చోట కొనుగోళ్లకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి కారణంగా రైతులు నేరుగా మిల్లర్లను, దళారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వెంటనే కొనుగోలు చేస్తుండటం, డబ్బులు చెల్లిస్తుండటంతో.. అగ్గువ సగ్గువకైనా ధాన్యాన్ని అప్పగిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొంటున్న దళారులు, మిల్లర్లు.. రకం, తేమశాతం, ఇతర అంశాలను బట్టి క్వింటాల్కు రూ.1,360 నుంచి రూ.1,650 వరకే చెల్లిస్తున్నారు. వరి ఏ గ్రేడ్కు రూ.1,960.. బీ గ్రేడ్కు రూ.1,940గా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఇవి ఐదారు వందలదాకా తక్కువ కావడం గమనార్హం. సన్న వడ్లకే కాస్త ధర.. వచ్చే యాసంగి నుంచి దొడ్డు బియ్యం, ఉప్పుడు (పారాబాయిల్డ్ రైస్)ను కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పలు సూచనలు చేసింది. దీంతో వానాకాలం పంట విషయంలో కూడా మిల్లర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దొడ్డు వడ్లను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్న వడ్లను మాత్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నరకాలకు క్వింటాల్ రూ.1,600 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుండగా.. రైతులెవరైనా దొడ్డు వడ్లను తెస్తే మరో రెండు, మూడు వందలు తక్కువగా ఇస్తున్నారు. దీనికితోడు తేమ, తాలు అంటూ మరింత కోత పెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటికే వరి దిగుబడి దశకు చేరింది. కోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ భువనగిరి, సూర్యాపేటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పలు కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో శనివారం మొదలు కానున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు విక్రయిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ పూర్తికాకున్నా.. గత యాసంగికి సంబంధించిన లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లుల్లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ఆ ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి పంపించాల్సి ఉంది. కానీ ఆ పని ఆపేసి.. రైతుల నుంచి వానాకాలం పంటను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకే సన్నరకాల ధాన్యం కొనవచ్చని.. డిమాండ్ వచ్చినప్పుడు రెట్టింపు రేటుకు అమ్ముకోవచ్చన్నది మిల్లర్లు ఆలోచన అని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. రూ.1,650కే అమ్ముకోవాల్సి వచ్చింది నాకున్న ఒకటిన్నర ఎకరం భూమిలో సన్నరకం వరి వేశాను. పదిహేను రోజుల కింద పంటకోసి నూర్పిడి పూర్తయింది. ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు కాలేదు. వానలు పడతాయన్న భయంతో వడ్లను వ్యాపారులకు అమ్ముకున్నా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ.1,650 రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. – షేక్ నిస్సార్, బర్ధీపూర్ గ్రామరైతు, బోథ్ మండలం -
ఇక ఆన్లైన్ లో పంటల అమ్మకం
భైంసాలో ఈ-నామ్ కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం దిగుబడులకు అధిక ధర భైంసా : జాతీయ వ్యవసాయ మార్కెట్(నామ్) విధానంతో దేశంలో ఎక్కడైనా ఒక చోట మార్కెట్లో పంటలు అమ్మకానికి తీసుకువచ్చి ధర అధికంగా ఉన్నచోట అమ్ముకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతీయ వ్యవసాయ మార్కెట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నామ్ కింద మన జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా మార్కెట్ కమిటీలు ఎంపిక చేశారు. రైతులు వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి పంట తీసుకురాగానే ప్రవేశ ద్వారం వద్ద ఈ-నామ్లో గేటువద్ద ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయించాలి. దీంతో ఆ వివరాలు నామ్ కింద ఉన్న అన్ని దేశీయ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వెళ్తుంది. ఆ పంటకు సంబంధించి ఏఏ మార్కెట్లో ఎంతెంత ధర ఉందో తెలుస్తుంది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 585 మార్కెట్లను నామ్ కింద ఎంపిక చేయనుంది. అందులో భాగంగానే 2015-16 సంవత్సరానికి 250 మార్కెట్లలో 2016-17లో 200 మార్కెట్లలో, 2017-18లో 135 మార్కెట్లలో నామ్ ప్రవేశపెట్టడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరర్ కోపరేటివ్ స్మాల్ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎన్ఎఫ్ఏసీ) ద్వారా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు చేస్తుంది. ఒక్కోమార్కెట్కు సాఫ్ట్వేర్కు అవసరమయ్యే కంప్యూటర్లు, ప్రింటర్ ఇతర సామగ్రిని అందజేస్తుంది. రెండో దశలో మన జిల్లాలోనే రెండు మార్కెట్ కమిటీలను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి.. ఇప్పటికే భైంసా మార్కెట్ కమిటీకి కేంద్ర నామ్ అధికారులు వచ్చారు. ఆన్లైన్ ఈ-నామ్ ఎంట్రీగదితోపాటు ఇతరాత్రా రికార్డులు అందించారు. ఈ-నామ్ కింద ఎలా నమోదు చేయాలో అనే విషయాలపై సిబ్బందికి శిక్షణ కూడా అందించారు. కేంద్ర అధికారిక యంత్రాంగం ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. నేటి నుంచి ప్రారంభం భైంసా పట్టణంలో సోమవారం నుంచి ఈ-నామ్ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. గాంధీగంజ్ ప్రవేశద్వారం పక్కనే ఎంట్రిగదిని నిర్మించారు. ఈ గదిలో కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు. రైతులు రాగానే గ్రామం పేరు, బ్యాంకు ఖాతా, సెల్ నంబరు, పంట వివరాలను నమోదు చేస్తారు. నామ్ కింద ఉన్న అన్ని జాతీయ మార్కెట్లలో ఈ వివరాలు నమోదవుతాయి. అక్కడక్కడ సంబంధిత పంటకు ఉన్న ధరలు కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతు ఇష్టం మేరకు పంటను సంబంధిత మార్కెట్లకు విక్రయిస్తారు. రైతు సమ్మతి లేకుంటే తిరిగి మళ్లీ రెండో సారి ఈ-నామ్లో వివరాలు నమోదు చేస్తారు. ఒక చోట ఫీజు చెల్లిస్తే చాలు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం వల్ల దేశంలో ఎక్కడైనా ఒక చోట మార్కెట్ ఫీజు చెల్లిస్తే అన్ని చోట్ల వర్తిస్తుంది. రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. గతంలో మధ్య వర్తులు కొనుగోలు చేసి దళారులకు, బడా వ్యాపారులకు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఆ పంటను నేరుగా మధ్యవర్తుల ప్రమేయంలేకుండా వ్యాపారులే కొనుగోలుచేసే అవకాశం ఉండడంతో గిట్టుబాటు ధరలు రైతులకు దక్కే అవకాశం ఉంది. ఈ విధానం ప్రారంభంతో రైతులకు ఎలా మేలుచేకూరుతుందో ఆన్లైన్ పంట అమ్మకాలు ఎలా జరుగుతాయో అనే దాని కోసం భైంసా రైతాంగం ఎదురుచూస్తోంది. ఎక్కడి వ్యాపారులైనా... ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న వ్యాపారులే రైతుల సరుకులను పరిశీలించి బీట్ నిర్వహిస్తారు. బీట్లో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వచ్చేది. స్థానికంగా ఉన్న ఖరీదుదారులకు ఉన్న గోదాం, ఆర్థిక స్థితికి అనుకూలంగానే పంటలను కొనేవారు. కానీ నామ్ కింద జాతీయ వ్యవసాయ మార్కెట్లలోని బడా వ్యాపారులు సైతం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విధానంతో బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్తోపాటు పలు మార్కెట్లలోనూ ఆన్లైన్లో కొనుగోళ్లు చేపట్టవచ్చు. దేశంలోని అన్ని మార్కెట్యార్డుల్లో ఈ సరికొత్త విధానంలో పంటలు అమ్మిన రైతులకు డబ్బులు ఇచ్చేందుకు ఎస్క్రో అకౌంట్ పేరుతో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రైతులు మార్కెట్లో సరుకులు అమ్మితే అడితిదారులు, కమీషన్ ఎజెంట్లు డబ్బులు చెల్లించేవారు. నూతన విధానంతో కొనుగోలుదారులు రైతులకు పంట సరుకు విలువను మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించే ఎస్క్రో అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఖరీదుదారు సంబంధిత డబ్బులను ఈ అకౌంట్లో వేయగానే రైతు తీసుకువచ్చిన సరుకును విలువకట్టి సంబంధిత రైతు ఖాతాలో జమ చేస్తారు. తద్వారా రైతులకు దళారుల బెడద తగ్గనుంది. ఎక్కడెక్కడ ఎంత ధర ఉందో కూడా తెలుసుకునే అవకాశం రైతులకు ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Taylor Swift: 14 స్పాట్లలో టాప్లో నిలిచిన తొలి ఆర్టిస్ట్గా.. రికార్డుల సునామీ!
ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం
ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
హీరామండిలో రిచా చద్దా లుక్స్.. ఫోటోలు
వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్గా లాంగ్ ఫ్రాక్స్
భారత్పై జో బైడెన్ షాకింగ్ కామెంట్స్
కూటమికి బిగ్ షాక్
గరిష్ఠాలను చేరిన మార్కెట్ సూచీలు
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement