-
ఎల్జీ అద్భుత ఆవిష్కారం: త్వరలో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ తన దూకుడును పెంచింది. విలక్షణమైన ఇంకా ఎవరూ కనిపెట్టని కొత్త వినియోగ అనుభవాలతో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నఎల్జీ తన ఎక్స్ప్లోరర్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి మోడల్ సెప్టెంబర్ 14న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీజర్ వీడియోను విడుదల చేసింది. ఎల్జీ తన గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసిన వీడియో ప్రకారం రొటేటింగ్, డ్యుయల్ స్క్రీన్ హ్యాండ్సెట్ను టీ షేప్ డిజైనుతో ఆవిష్కరించనుంది. ఎల్జి మొబైల్ గ్లోబల్ ఫేస్బుక్ , యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా సెప్టెంబర్ 14 న వర్చువల్ గా ఈ డివైస్ ను లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి నిర్దిష్ట వివరాలను కంపెనీ అందించలేదు. అయితే క్వాల్కమ్, రేవ్, ఫిక్టో, ట్యూబి, నావర్లతో సహా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం. ఎల్జీ వింగ్ గా భావిస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లపై ఇలా ఉన్నాయి. ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్ ఫీచర్లు 6.8 అంగుళాల డిస్ ప్లే 1:1 యాస్పెక్ట్ రేషియోతో 4 అంగుళాల మరో స్క్రీన్ స్నాప్డ్రాగన్ 765 జి సాక్ 8జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ధర సుమారు రూ. 73,000 -
జాతి సమైఖ్యతకు ప్రతీక ‘హిందీ’
- నేడు హిందీ దివాస్ భారతదేశ జాతి సమైక్యతకు ప్రతీకగా హిందీ భాష నిలుస్తోంది. విభిన్న భాషల సమాహారంగా ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించే సమయంలో గాంధిజీ ఎక్కువగా హిందీలోనే మాట్లాడేవారు. జాతి మొత్తం ఆ భాషను సులువుగా అర్థం చేసుకునేది. అందుకే 1949 సెప్టెంబర్ 14న హిందీని జాతీయభాషగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజల మధ్య సద్భావన, సంస్కతిని కాపాడడంలో హిందీకి అధికార భాష హోదానిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) రూపొందించారు. అప్పటి నుంచి హిందీ రాజ‡భాషగా హోదాను సంతరించుకుంది. ‘దేవనాగరీలిపి’గా పేరొందిన హిందీని ఎందరో మహాకవులు, రచయితలు సుసంపన్నం చేశారు. వారిలో అనంత వాసులూ ఉన్నారు. వివిధ సేవా కార్యక్రమాలతో పాటు హిందీ ప్రచారానికి తమ వంతు కషి చేస్తూ రాజభాషను అందరికీ దగ్గర చేస్తున్నారు. విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ విద్యార్థి దశనుంచే హిందీపై మక్కువ పెంచుకునేలా ఆ భాషలోనే బోధించేలా ప్రభుత్వం సన్నాహాలు చేయాలి. తెలుగుభాషకు ప్రాధాన్యత కల్పించినట్లు హిందీభాషకు కూడా ప్రాముఖ్యత అందించాలి. ఆంగ్లంపై వ్యామోహాన్ని తగ్గించి జాతీయభాష హిందీని నేర్చుకుని మాట్లాడేలా చొరవచూపాలి. ప్రతి పరీక్షల్లో హిందీభాషలో క్వాలీఫై మార్కులు వస్తేచాలని చెబుతుంటారు. అలా కాకుండా హిందీలో వచ్చిన మార్కులను అన్ని సబ్జెక్టులతోపాటు లెక్కిస్తే హిందీభాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. – వేణుగోపాలాచార్యులు, హిందీ పండిట్ బోధనా భాషగా హిందీని చేర్చాలి జాతీయభాష అయిన హిందీని విస్మరించడం శోచనీయం. ప్రభుత్వం స్పందించి బోధనాభాషగా హిందీని పెట్టి ఆంగ్లంపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించాలి. ఇటీవల హిందీ నేర్చుకునేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు కూడా ఆంగ్లభాష కాకుండా హిందీ వచ్చినవారికే కల్పించేలా ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు చేపట్టాలి. – ఎం.రియాజ్ బాషా, ఉపాధ్యాయుడు, వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల రచనల్లో మేటి డా.జూటూరు షరీఫ్ అనంత కీర్తిని జిల్లా ఎల్లలు దాటించిన హిందీ ప్రచారకులలో జూటూరు షరీఫ్ ఒకరు. ద్విభాషా కవిగా గుర్తింపు పొందిన ఆయన హిందీ పండితునిగా ప్రస్తుతం ధర్మవరం మండలం చిగిచెర్లలో పనిచేస్తున్నారు. భాషా ప్రచారానికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. కెరే జగదీష్ రచించిన ‘రాత్రి సూర్యుడు’ రచనకు షరీఫ్ అనువాదం చేసిన ‘నిశిధికీ సూర్య్’ ఎందరినో ఆలోచింపజేసింది. ముఖ్యంగా కబీర్ అకాడమీని స్థాపించి ఎంతో మంది విద్యార్థుల చేత భాషా ప్రవీణ పరీక్షలను రాయిస్తూ హిందీ పట్ల అభిమానాన్ని పెంచుతున్నారు. హిందీ జాతీయ సదస్సుల్లో అనంత తరుపున తరచుగా వెళ్లే షరీఫ్ మాట్లాడుతూ ‘ జాతీయ స్థాయిలో జాతీయ సమైఖ్యతకు ప్రతిరూపంగా నిలిచిన హిందీభాషను చిన్నచూపు చూడొద్దంటారు. సేవకు ప్రతి రూపం ఆరు పదులు దాటిని తరగని ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనే సూర్యనారాయణరెడ్డి హిందీ భాషా ప్రచారకునిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరుగడించారు. ‘భారతీయ మైత్రికి ప్రతిబింబమైన హిందీని అందరూ అభ్యసించాలి. దేశంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. వారి సాహిత్యాన్ని సంస్కతీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి హిందీభాషే చక్కటి వారధి. అంతేగాక ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం ద్వారా ఉత్తమ పౌరులుగా దేశసమగ్రతకు పాటుపడతామన్న సద్భావం అందరూలోనూ రావాలి’ అని ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి అన్నారు. -
14న సీఏఎస్ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ : వర్సిటీ పరిధిలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి సీఏఎస్ (కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం) ద్వారా పదోన్నతులు కల్పించడానికి 14న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్గా ఐదుగురు, అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లుగా ముగ్గురికి పదోన్నతి లభించనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్టు నిపుణలును నియమించింది. గవర్నర్ నామినీగా ప్రొఫెసర్ వెంటకసుబ్బయ్యను నియమించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement