-
సర్వీస్ రిజిస్టర్లో జబ్బుల చిట్టా
-ముందుగా ఉద్యోగులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ -ఒక్కొక్కరికి 20 టెస్టులతో కూడిన చెకప్...రూ.2200 అంచనా -అనంతరం బీపీ, షుగర్ వంటివి ఉంటే ఎస్ఆర్లో చేర్చాలని యోచన -పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టులు చేయద్దన్న వైద్య ఆరోగ్యశాఖ -ఫిట్నెస్ బావున్న ఉద్యోగులకు పారితోషికాలివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న జబ్బులను ఇకపై సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లో చేరిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నాన్ గెజిటెడ్ అఫీసర్స్ అసోసియేషన్ (ఎన్జీవో)ల సంఘం దీనిపై విజ్ఞప్తి చేసిందని, దీనిపై ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 4.83 లక్షల మంది ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఎస్ఆర్లో జబ్బుల జాబితాను రూపొందిస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం 20 రకాల టెస్టులు (మాస్టర్ హెల్త్చెకప్) పేరుతో ఒక్కొక్కరికి రూ.2200 వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మధుమేహం, సీబీపీ, మూత్రపరీక్షలు, రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు ఉన్నాయి. ఇలా పురుష, మహిళా ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి డయాబెటిక్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులుంటే వాటిని ఎస్ఆర్లో పొందుపరిస్తే జాగ్రత్తలు తీసుకుంటారని, ఎన్జీవో సంఘం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను కోరినట్టు అధికారులు చెప్పారు. అయితే ఈ ఆలోచనకు కొంతమంది అధికారులు విభేదించారు. క్యాన్సర్, హెచ్ఐవీ వ్యాధులుంటే ఎస్ఆర్లో పొందుపరిస్తే చూడ్డానికి, చెప్పుకోవడానికి కూడా బావుండదని, ప్రతి ఉద్యోగికి కావాలంటే ప్రత్యేకంగా మెడికల్ రికార్డు నిర్వహిస్తే బావుంటుందని సూచించారు. తిరిగి దీనిపై సెప్టెంబర్లో ఒకసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులతో పాటు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్ణయించింది. పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టు అక్కర్లేదు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టులు అక్కర్లేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సర్వీసులో ఉన్నవారికి మాత్రమే మాస్టర్ హెల్త్ చెకప్ చేద్దామని, ఇందులో పెన్షనర్లను చేరిస్తే తమ కుటుంబ సభ్యులకు కూడా చేయాలని అడుగుతారని, అందుకే ఉద్యోగులకు మాత్రమే ఇది వరిస్తుందని ఆరోగ్యశాఖ తమ నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య పరీక్షలు వర్తించవని తేల్చిచెప్పింది. బాక్స్ ఫిట్గా ఉంటే పారితోషికాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.83 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఫిట్నెస్ బాగా ఉన్న ఉద్యోగులకు పారితోషికం ఇద్దామన్న ప్రతిపాదన వచ్చింది. మొత్తం జరిగే 20 పరీక్షల్లోనూ సాధారణ రిపోర్టులు (నార్మల్) వస్తే అలాంటి వారికి మాత్రమే ఇన్సెంటివ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇవి క్యాష్ రూపంలోనా లేదా ఇంక్రిమెంట్ల రూపంలోనా అలాంటివేమీ తేల్చలేదు. సెప్టెంబర్ మాసంలో జరిగే సమావేశాలో ఎన్జీవోలు, సెక్రటేరియల్ ఉద్యోగుల సంఘం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ అందరితో సమావేశమై నిర్ణయిద్దామని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. -
రూ.వెయ్యిస్తే ఎస్సార్!
విద్యాశాఖ, ఎల్ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతివాటం రెండు నెలలుగా అందని పీఆర్సీ వేతనాలు ఎయిడెడ్ టీచర్ల ఆవేదన విశాఖపట్నం: పిల్లలు బడికి వచ్చారో లేదో తెలుసుకోవడానికి టీచరు హాజరు పట్టీలో పేర్లను వరసగా పిలుస్తారు. అలా పిలిచేటప్పుడు వచ్చిన వారు ‘ఎస్ సార్’ అంటారు. ఆ విద్యార్థి వచ్చాడని నిర్ధారించుకుని ఆ మాస్టారు పట్టీలో హాజరు వేస్తారు. ఇప్పుడు పీఆర్సీ జీతాల బకాయిల చెల్లింపులకు అవసరమైన ఎస్సార్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదుకు ఇటు డీఈవో కార్యాలయ సిబ్బంది, అటు ఎల్ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతులు తడపనిదే పని జరగడం లేదని ఎయిడెడ్ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఫలితంగా రెండు నెలలుగా కొత్త జీతాలకు నోచుకోలేదని వాపోతున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం టీచర్లకు జీతాల పీఆర్సీ అమలయింది. వీటిని పొందాలంటే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు సంబంధిత కరస్పాండెంట్ల నుంచి జిల్లాలో ఎంఈవోలు, అర్బన్ పరిధిలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ల (డీఐ)ల ద్వారా, హైస్కూళ్లయితే డిప్యూటీ డీఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికి పీఆర్సీ ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. డీఈవో కార్యాలయంలో వీటిని పరిశీలించి ఎల్ఎఫ్ ఆడిట్కు పంపుతారు. అక్కడ అభ్యంతరాలుంటే రిమార్కులో ఉంచుతారు. లేదంటే ఎస్సార్లో నమోదు చేస్తారు. దీంతో అభ్యంతరాల్లేని ఉపాధ్యాయులు పీఆర్సీ జీతాలకు లైన్ క్లియర్ అవుతుంది. కానీ డీఈవో కార్యాలయంలో సంబంధిత సిబ్బంది ఒక్కో టీచరు నుంచి రూ.వెయ్యి, ఎల్ఎఫ్ ఆడిట్ ఆఫీసులో మరో రూ.వెయ్యి చొప్పున వసూలు చే స్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. అలా చెల్లించిన వారికి ఎస్సార్లో నమోదు చేయడంతో పీఆర్సీ జీతాలు పొందారని, లేనివారికి ఆగిపోయాయని పేర్కొంటున్నారు. జిల్లాలోని 26 ఎయిడెడ్ హైస్కూళ్లలో 16, రెండు ఓరియంటల్ స్కూళ్లు (సింహాచలం ఎస్వీఎల్ఎన్ సంస్కృతోన్నత పాఠశాల, చోడవరం హిందీ మహావిద్యాలయ)లతో పాటు పలు ప్రాథమిక పాఠశాలలు పీఆర్సీకి నోచుకోలేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే పీఆర్సీ జీతాలు అందుకోగా రెండు నెలలవుతున్నా తమకు మాత్రం సిబ్బంది చేతివాటంతో జాప్యం జరుగుతోందని ఈ ఎయిడెడ్ టీచర్లు అంటున్నారు. లంచం అడిగితే చర్యలు.. పీఆర్సీ నమోదులో డీఈవో కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. లంచం ఇచ్చిన టీచర్లపైనా చర్యలుంటాయి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఎయిడెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్ టీచర్ల పీఆర్సీ ప్రతిపాదనలు వేగవంతం చేస్తాం. ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఈ విషయాన్ని స్పష్టం చేశాం. -ఎం.వి.కృష్ణారెడ్డి, డీఈవో -
ఎస్ఆర్ ఎలా?
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు రిజిష్టర్(ఎస్ఆర్) గుండెకాయలాంటిది. అలాంటి పుస్తకం అనూహ్యంగా పాడైపోతే ఆ ఉద్యోగి పరిస్థితి ప్రశ్నార్థకమే. ఇప్పుడా పరిస్థితి జిల్లా విద్యాశాఖ పరిధిలోని కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు పుస్తకాలు కాలిబూడిదయ్యాయి. దీంతో వారిలో అయోమ యం నెలకొంది. సర్వీసుబుక్ లేకపోతే ఏమి చేయాలో తెలియక రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరలో ఉన్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సర్వీసు రెగ్యులరైజేషన్, పేఫిక్సేషన్, ఇతర ప్రయోజనాల కోసం కార్యాలయంలో సమర్పిస్తే అగ్నిప్రమాదంలో కాలి పోయాయని, ఇప్పుడు తమ పరిస్థితి ఎలా అని అక్కడున్న అధికారులతో వాకబు చేస్తున్నారు. సర్వీసు రిజిష్టర్లు సమర్పించిన రుజువు/రశీదులను చూపి కొత్తగా సర్వీసు పుస్తకాలు తెరిచేందుకు అనుమతి ఉత్తర్వులు పొందాలని డీఈఓ ప్రకటించినా సమగ్ర వివరాలతో సర్వీసు బుక్కులు మళ్లీ చేతికొచ్చేదాకా ఇబ్బందేనని మదనపడుతున్నారు. సర్వీస్ బుక్లో ఏముంటాయంటే.. ఉద్యోగి నియామకపు తేదీ నుంచి రిటైర్మెంట్ తేదీ వరకు అతని ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు, సంఘటనలు సర్వీసు రిజిష్టర్లో నమోదు చేస్తారు. ఉద్యోగి విధుల్లో చేరిన వెంటనే ఎస్ఆర్ తెరుస్తారు. ఏమేమి నమోదు చేస్తారంటే.. ఉద్యోగి సర్వీసు పుస్తకంలో పేరు, తండ్రి పేరు, చిరునామా ముందు పేజీలో ఉంటాయి. విద్యార్హతలు, మొదటి నియామకపు ఉత్తర్వులు, తేదీ, జీతం వివరాలు, ఇంక్రిమెంట్లు, పేఫిక్సేషన్లు, ప్రొబేషనరీ, డిక్లరేషన్, పాసైన టెస్ట్లు, సర్వీసులోని అంతరాయాలు, సస్పెన్షన్, క్యాజు వల్, సెలవేతర సెలవులు, రికవరీలు, నామినేషన్ వివరాలు నమోదు చేస్తారు. బదిలీలు, రిలీవ్ తేదీలు, కొత్తస్థానంలో చేరిన తేదీలు, సంబంధిత ఉత్తర్వులు ఉంటాయి. సర్వీస్ వెరిఫికేషన్.. ఉద్యోగి సంవత్సర కాలంలో సంతృప్తికరంగా పనిచేశారని తెలుపుతూ పైఅధికారి సర్వీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఉన్నతాధికారితో ప్రవర్తిం చిన తీరుపై రిమార్కులను నమోదు చేస్తారు. రిటైర్మెంట్, పెన్షన్ వివరాలు, సంపాదిత సెల వుల (ఈఎల్లు) అకౌంట్లు, మెడికల్ లీవ్ల అకౌంట్లు, హాఫ్ పే లీవ్ అకౌంట్ల వివరాలుంటాయి. ఒరిజినల్ ఎస్ఆర్ పోతే.. సహజంగా కొందరు ఉద్యోగులు తమవద్ద డూప్లికేట్ ఎస్ఆర్ ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వాటిల్లో అన్ని నమోదులపై కార్యాలయ అధిపతితో ధ్రువీకరణ పొందవచ్చు. ఒరిజినల్ ఎస్ఆర్ పోయినపుడు ఈ డూప్లికేట్ ఎస్ఆర్లోని నమోదుల ఆధారంగా తాజా ఎస్ఆర్ను పొందవచ్చు. ఈ మేరకు 1964 జూన్ 22న జీఏడీ 216 జీఓ జారీ చేసింది. అయితే చాలా మందికి డూప్లికేట్ ఎస్ఆర్ నిర్వహణ చేసేంత ఓపిక ఉండదు. ఒరిజినల్లో నమోదులు చేయించుకునేందుకు బద్దకిస్తుం టారు. అలాంటి వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరమే. ఒకవేళ డూప్లికేట్ ఉన్నా మంచి వివరాలు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపి శిక్షలు, ఇతర అంతరాయాలను నమోదు చేయించుకుంటారనే నమ్మకం లేదు. శిక్షల నమోదును తెలియజేస్తారా..? ఉద్యోగులకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపి కొత్త సర్వీసు బుక్ను ప్రారంభించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పలు సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. తనకు అనుకూలమైన వివరాలను చెప్పవచ్చునేమో కానీ శిక్షలు, సస్పెన్షన్లు, ఇతర వివరాలను వెల్లడిం చకపోతే ఎలాగనేది తెలియని పరిస్థితి. సస్పెన్షన్కు గురైన వివరాలు, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసిన వివరాలు, ఇతర హెచ్చరికలు, శిక్ష విధించిన వివరాలను ఉద్యోగి గోప్యంగా ఉంచి, సంబంధిత డాక్యుమెంట్లను వెల్లడించకపోతే అవి కొత్తపుస్తకంలో నమోదయ్యే అవకాశం లేకుండా పోతుంది. జిల్లా కార్యాలయంలో ఉంటాయా అంటే ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పూర్తిగా కాలిపోయింది. కొన్ని కాగి తాలు లభ్యమైనా అవి ఎవరివి, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటీ అని విశ్లేషించే పరిస్థితులుంటాయా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎస్ఆర్ ఎలా?
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు రిజిష్టర్(ఎస్ఆర్) గుండెకాయలాంటిది. అలాంటి పుస్తకం అనూహ్యంగా పాడైపోతే ఆ ఉద్యోగి పరిస్థితి ప్రశ్నార్థకమే. ఇప్పుడా పరిస్థితి జిల్లా విద్యాశాఖ పరిధిలోని కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు పుస్తకాలు కాలిబూడిదయ్యాయి. దీంతో వారిలో అయోమ యం నెలకొంది. సర్వీసుబుక్ లేకపోతే ఏమి చేయాలో తెలియక రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరలో ఉన్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సర్వీసు రెగ్యులరైజేషన్, పేఫిక్సేషన్, ఇతర ప్రయోజనాల కోసం కార్యాలయంలో సమర్పిస్తే అగ్నిప్రమాదంలో కాలి పోయాయని, ఇప్పుడు తమ పరిస్థితి ఎలా అని అక్కడున్న అధికారులతో వాకబు చేస్తున్నారు. సర్వీసు రిజిష్టర్లు సమర్పించిన రుజువు/రశీదులను చూపి కొత్తగా సర్వీసు పుస్తకాలు తెరిచేందుకు అనుమతి ఉత్తర్వులు పొందాలని డీఈఓ ప్రకటించినా సమగ్ర వివరాలతో సర్వీసు బుక్కులు మళ్లీ చేతికొచ్చేదాకా ఇబ్బందేనని మదనపడుతున్నారు. సర్వీస్ బుక్లో ఏముంటాయంటే.. ఉద్యోగి నియామకపు తేదీ నుంచి రిటైర్మెంట్ తేదీ వరకు అతని ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు, సంఘటనలు సర్వీసు రిజిష్టర్లో నమోదు చేస్తారు. ఉద్యోగి విధుల్లో చేరిన వెంటనే ఎస్ఆర్ తెరుస్తారు. ఏమేమి నమోదు చేస్తారంటే.. ఉద్యోగి సర్వీసు పుస్తకంలో పేరు, తండ్రి పేరు, చిరునామా ముందు పేజీలో ఉంటాయి. విద్యార్హతలు, మొదటి నియామకపు ఉత్తర్వులు, తేదీ, జీతం వివరాలు, ఇంక్రిమెంట్లు, పేఫిక్సేషన్లు, ప్రొబేషనరీ, డిక్లరేషన్, పాసైన టెస్ట్లు, సర్వీసులోని అంతరాయాలు, సస్పెన్షన్, క్యాజు వల్, సెలవేతర సెలవులు, రికవరీలు, నామినేషన్ వివరాలు నమోదు చేస్తారు. బదిలీలు, రిలీవ్ తేదీలు, కొత్తస్థానంలో చేరిన తేదీలు, సంబంధిత ఉత్తర్వులు ఉంటాయి. సర్వీస్ వెరిఫికేషన్.. ఉద్యోగి సంవత్సర కాలంలో సంతృప్తికరంగా పనిచేశారని తెలుపుతూ పైఅధికారి సర్వీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఉన్నతాధికారితో ప్రవర్తిం చిన తీరుపై రిమార్కులను నమోదు చేస్తారు. రిటైర్మెంట్, పెన్షన్ వివరాలు, సంపాదిత సెల వుల (ఈఎల్లు) అకౌంట్లు, మెడికల్ లీవ్ల అకౌంట్లు, హాఫ్ పే లీవ్ అకౌంట్ల వివరాలుంటాయి. ఒరిజినల్ ఎస్ఆర్ పోతే.. సహజంగా కొందరు ఉద్యోగులు తమవద్ద డూప్లికేట్ ఎస్ఆర్ ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వాటిల్లో అన్ని నమోదులపై కార్యాలయ అధిపతితో ధ్రువీకరణ పొందవచ్చు. ఒరిజినల్ ఎస్ఆర్ పోయినపుడు ఈ డూప్లికేట్ ఎస్ఆర్లోని నమోదుల ఆధారంగా తాజా ఎస్ఆర్ను పొందవచ్చు. ఈ మేరకు 1964 జూన్ 22న జీఏడీ 216 జీఓ జారీ చేసింది. అయితే చాలా మందికి డూప్లికేట్ ఎస్ఆర్ నిర్వహణ చేసేంత ఓపిక ఉండదు. ఒరిజినల్లో నమోదులు చేయించుకునేందుకు బద్దకిస్తుం టారు. అలాంటి వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరమే. ఒకవేళ డూప్లికేట్ ఉన్నా మంచి వివరాలు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపి శిక్షలు, ఇతర అంతరాయాలను నమోదు చేయించుకుంటారనే నమ్మకం లేదు. శిక్షల నమోదును తెలియజేస్తారా..? ఉద్యోగులకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపి కొత్త సర్వీసు బుక్ను ప్రారంభించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పలు సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. తనకు అనుకూలమైన వివరాలను చెప్పవచ్చునేమో కానీ శిక్షలు, సస్పెన్షన్లు, ఇతర వివరాలను వెల్లడిం చకపోతే ఎలాగనేది తెలియని పరిస్థితి. సస్పెన్షన్కు గురైన వివరాలు, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసిన వివరాలు, ఇతర హెచ్చరికలు, శిక్ష విధించిన వివరాలను ఉద్యోగి గోప్యంగా ఉంచి, సంబంధిత డాక్యుమెంట్లను వెల్లడించకపోతే అవి కొత్తపుస్తకంలో నమోదయ్యే అవకాశం లేకుండా పోతుంది. జిల్లా కార్యాలయంలో ఉంటాయా అంటే ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పూర్తిగా కాలిపోయింది. కొన్ని కాగి తాలు లభ్యమైనా అవి ఎవరివి, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటీ అని విశ్లేషించే పరిస్థితులుంటాయా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆదాయం, ఉద్యోగుల వివరాలివ్వొద్దు
ఆర్థిక శాఖకు మినహా ఎవరికైనా ఇస్తే క్రమశిక్షణ చర్యలు అంతర్గత సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, ఉద్యోగుల వివరాల వెల్లడిపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఆదాయం, ఉద్యోగులకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ మినహా ఎవరు అడిగినా ఇవ్వరాదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ అంతర్గత సర్క్యులర్ను గురువారం జారీ చేశారు. సర్క్యులర్కు విరుద్ధంగా ఎవరు వివరాలిచ్చినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రాం తాల వారీగా ఆదాయ వివరాలు, ఉద్యోగుల వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే సర్క్యులర్ జారీ చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరు అడిగినా ఇవ్వాల్సి ఉంటుంద న్న విషయాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలు చేయాల్సిన శాఖాధిపతే ఆ చట్టం నిబంధనలకు విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సర్వీసు రిజిస్టర్ ఆధారంగా వారి స్వస్థలాల సమాచారాన్ని అంతర్గతంగా సేకరిస్తోంది. సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న స్వస్థలం ఆధారంగా ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలను తయారు చేస్తోంది. ఏ జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తోంది. ఏ జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా సేకరిస్తోంది. ఇవన్నీ కూడా అనధికారికంగానే అంతర్గత సమాచారం పేరుతో ఉన్నతస్థాయి సూచనల మేరకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయ, ఉద్యోగుల వివరాల సమాచారం కావాలంటూ ఎప్పుడు ఆదేశాలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకే అంతర్గతంగా సమాచార సేకరణ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement