-
సీఎం వైఎస్ జగన్తో క్షత్రియ సేవా సమితి నేతల భేటీ
సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్ను క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నాని రాజు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేసినందుకు సీఎం వైఎస్ జగన్ను సన్మానించారు. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? అలాగే అల్లూరి 125వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ధన్యవాదాలు తెలిపారు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ సామాజికవర్గంలోని పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రఘురామరాజు, వి.వెంకటేశ్వరరాజు, అఖిల భారత క్షత్రియ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ దాట్ల, భీమవరం క్షత్రియ పరిషత్ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు, దక్షిణ భారత క్షత్రియ సంఘం సభ్యులు మంతెన సోమరాజు తదితరులు పాల్గొన్నారు. -
డూండి పరువు తీయొద్దు
విజయవాడ(మ«ధురానగర్) : డూండి గణేష్ సేవా సమితికి విరాళంగా వచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి లెక్కలు ఉన్నాయని, ఇటీవల కోగంటి సత్యం గత సంవత్సరం లెక్కలలో రూ.30 లక్షలు తేడాలన్నాయంటూ అసత్య ఆరోపణలతో సంస్థ పరువుతీస్తున్నారని సేవాసమితి కోర్ కమిటీ సభ్యులు దర్శి వెంకట సుబ్బారావు, పీ రాకేష్, వీ శ్రీనివాసరావు, పీ రవి పేర్కొన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ఏడాది డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 63 అడుగుల మహాశివ నాట్యగణపతిని ఏర్పాటు చేశామన్నారు. డూండీ గణేష్ సేవాసమితికి అధ్యక్షుడిగా కోగంటి సత్యం, కార్యదర్శిగా దర్శి వెంకట సుబ్బారావు, కోశాధికారిగా విస్సంశెట్టి వెంకట శ్రీనివాసరావు, పారేపల్లి రాకేష్ ను ఫౌండర్గా చేసి కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీకి కోగంటి సత్యం అధ్యక్షతన మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ అధ్యక్షుడిగా కోగంటి సత్యం, అధ్యక్షుడిగా తొండెపు హనుమంతరావు, కార్యదర్శిగా గడ్డం రవి, కోశాధికారిగా దర్శి వెంకట సుబ్బరావులను ఎన్నుకున్నట్లు వివరించారు. గత సంవత్సరం ఆయన తాలూకా నుంచి ఇనుము, సర్వేబాదులు, కరెంటు సామగ్రి, చందాలు నుంచి సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఇవ్వాల్సిన సొమ్ము సంస్థకు ఇవ్వకుండా సంస్థ పరువును పాడుచేసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. విరాళాలలో లెక్కలపై దాతలకు ఎటువంటి అనుమానాలున్నా తమను సంప్రదించవచ్చునన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement