-
ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం! : మాజీ మంత్రి షబ్బీర్అలీ
నిజామాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి షబ్బీర్అలీ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మరో రెండింటిని కూడా త్వరలో అమలు చేస్తామని పే ర్కొన్నారు. మున్సిపల్ వార్డుల్లో ఐదుగురు సభ్యుల బృందంతో పాటు నోడల్ అధికారులు కలిసి ఈ పథకాలను అమలు చేస్తారని చెప్పారు. అంతా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఫస్ట్రేషన్లో పిల్లచేష్టలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూంలు, రుణామాఫీ పథకాలు అమలు చే యలేదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రజాపాలన సెంటర్లను పరిశీలించారు. నగరంలో అభయహస్తం దరఖాస్తులు లక్ష అందించగా, 88వేల వచ్చాయన్నారు. దరఖాస్తుల గడువు పెంచాలని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు, నాయకులు భక్తవత్సలం, వైశాక్షి సంతోష్, వేణురాజ్, మైనారిటీ జావీద్, ప్రీతమ్, రేవతి పాల్గొన్నారు. ఇవి చదవండి: ఒక్కొక్కరుగా.. ముఖ్య నేతల జంప్! -
తెలంగాణ నుంచి సోనియా పోటీ.. కాంగ్రెస్ పీఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా సమావేశం కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. కాగా, పీఏసీ సమావేశం అనంతరం పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్కార్డులు పంపిణీ చేస్తాం. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేశారు. ఇక, త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్టీ. అలాగే, ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక్కో మంత్రికి ఇంఛార్జి భాధ్యతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ స్థానాల వారీగా బాధ్యతలు అప్పగింత.. సీఎం రేవంత్ రెడ్డి: చేవెళ్ల, మహబూబ్నగర్ భట్టి విక్రమార్క: ఆదిలాబాద్ పొంగులేటి: ఖమ్మం ఉత్తమ్ కుమార్ రెడ్డి: నల్లగొండ పొన్నం ప్రభాకర్: కరీంనగర్ -
ఎవరైతేనేం..? పోటీకి ఏమాత్రం తగ్గేదేలే..!
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రత్యర్థులపై చేసిన విమర్శలకు వారి నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. సీఎం కేసీఆర్ను ఓడించి కామారెడ్డి ప్రజలు కొత్త చరిత్ర రాస్తారని పేర్కొంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం పేరును ప్రకటించగా.. కాంగ్రెస్నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి నిలవడం దాదాపు ఖాయమైంది. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో అందరి దృష్టి కామరెడ్డిపైనే కేంద్రీకృతమైంది. గజ్వేల్ అభివృద్ధి నమూనాగా కామారెడ్డిని ప్రగతి పథంలో నడిపిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా.. అక్కడ అభివృద్ధి ఏమోగానీ వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్లో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపిస్తానంటూ బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. కార్యక్రమానికి ఒకరోజు ముందే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి చలో గజ్వేల్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్అలీ ఇటీవల వాహనాల్లో గజ్వేల్కు తరలివెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటన్న దానిపై అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఇలా కేసీఆర్ ప్రత్యర్థులిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరు నేతలు నిత్యం జనంలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఎదురుదాడి.. మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై అటు షబ్బీర్ అలీ, ఇటు వెంకటరమణారెడ్డి ఎదురుదాడికి దిగారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కమీషన్లపై కక్కుర్తితో డబుల్ బెడ్రూం ఇళ్లను నాసిరకంగా నిర్మించారని ఆరోపించారు. దళితబంధు పథకంలో అధికార పార్టీ నేతలు రూ. మూడు లక్షల చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని, అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి టీఆర్ఎస్ నాయకుడికి బీఫామ్ ఇచ్చి తనను ఓడించే కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి విమర్శలపై బీజేపీ నేత వెంకటరమణారెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ను ఓడించి తీరుతానన్నారు. సీఎం గజ్వేల్ను పూర్తిగా వదిలేసి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ను ఓడించకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. బీఆర్ఎస్ సభా వేదికపై ఉద్యమకారుడొక్కరూ లేరన్నారు. మంత్రి కేటీఆర్కు తన పేరు ఉచ్చరించడం కూడా రాలేదని, ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి జీవితంలో మరిచిపోలేని దెబ్బకొడతానని పేర్కొన్నారు. ఇలా కేటీఆర్ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగడంతో కామారెడ్డిలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలున్నాయి. కేటీఆర్ విమర్శలు.. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్.. ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా షబ్బీర్ అలీ పోటీ చేయ గా, మిత్ర ధర్మంతో మద్దతు ఇచ్చి గెలిపించా మని పేర్కొన్నారు. అలాంటి షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎన్నికల్లో డిపాజిట్టు కూడా రాకుండా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ నేత వెంకటరమణారెడ్డిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పేరు ప్రకటించగానే పోటీ నుంచి తప్పుకుని ఇంట్లో పండుకుంటానన్నాడన్నారు. కేసీఆర్ మీద పోటీ చేయడమంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టేనని పేర్కొన్నారు. రెండు పార్టీలకు డిపాజిట్టు కూడా రాకుండా దిమ్మ తిరిగే దెబ్బకొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
TS Election 2023: షబ్బీర్ అలీకి లైన్క్లియర్..! ఎల్లారెడ్డి నుంచి ఇద్దరి పేర్ల పరిశీలన..!
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ నాయకత్వం దరఖాస్తులను వడపోసి, ఒక్కో నియోజకవర్గంనుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో జాబితాను రూపొందించింది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డి నుంచి నలుగురు దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన పీసీసీ ఎన్నికల కమిటీ.. పీసీసీ ప్రధాన కార్యదర్శి సుభాష్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్మోహన్రావుల పేర్లను సిఫారసు చేసింది. జుక్కల్ నుంచి ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ముగ్గురి పేర్లను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్తో పాటు తోట లక్ష్మీకాంత్రావ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గం టికెట్టు కోసం 16 మంది దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్రాజు పేరుతో పాటు మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేశారు. వారి వివరాలు తెలియరాలేదు. ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
‘ప్రజలే నా బలగం’
నిజామాబాద్: నియోజకవర్గ ప్రజలే తన బలగమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం భిక్కనూరులో ని ర్వహించిన కార్యక్రమంలో పలువురు యువకులు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త తీవ్రంగా కృషిచేయాలని సూచించారు. తాను ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. అధికారంలో లేనప్పటికి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. వానలతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నా సీ ఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్హౌస్ వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు. అధికారంలో కి వస్తే అమలు చేసే కార్యక్రమాలను ఆయ న ప్రజలకు వివరించారు. సమవేశంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యా ల సుదర్శన్, సీనియర్ నేతలు దయాకర్రెడ్డి, గజ్జె సురేశ్, సిద్ధగౌడ్, నీల అంజయ్య, దుర్గయ్య, ద్యాగల కిరణ్, చేపూరి రాజు, కొట్లని స్వామి తదితరులు పాల్గొన్నారు.
Pagination
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement