-
టీమిండియాతో మ్యాచ్కు ముందు పాక్కు ఎదురుదెబ్బ
ఆసియాకప్లో టీమిండియా, పాకిస్తాన్లు ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ షాహనవాజ్ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్కు దూరమయ్యాడు. నిజానికి హాంగ్ కాంగ్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తూనే దహనీ గాయపడ్డాడు. అయితే మ్యాచ్లో దహనీ తన కోటా ఓవర్లను పూర్తి చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్కు దహనీ స్థానంలో ముహ్మద్ హస్నైన్, హసన్ అలీలలో ఎవరు ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పీసీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. '' సూపర్-4లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగనున్న మ్యాచ్లో దహనీ అందుబాటులో ఉండడం లేదు. పక్కటెముకల గాయంతో మ్యాచ్కు దూరమయ్యాడు. హాంకాంగ్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడే దహనీ గాయపడ్డాడు. మరో 48 గంటలు గడిస్తే దహనీ గాయంపై మరింత స్పష్టత వస్తుంది. కాగా దహని స్థానంలో హసన్ అలీ లేదా ముహ్మద్ హస్నైన్లలో ఎవరో ఒకరు ఆడుతారు.'' అంటూ తెలిపింది. ఇక దహనీ గాయపడినా.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ల రూపంలో పాకిస్తాన్కు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. చదవండి: Mohammad Hafeez: టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం పాక్తో బిగ్ ఫైట్కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్ పెట్టుకుని..! -
'ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను'
ఎంతో మంది యువ క్రికెటర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదర్శ ప్రాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని యువ ఆటగాళ్లకి జట్టుతో సంబంధం లేకుండా విలువైన సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ధోనిను కలవడంతో తన కల సాకరమైంది అని పాకిస్తాన్ యువ సంచలనం షానవాజ్ దహానీ తెలిపాడు. ధోని తనకు విలువైన సూచనలు చేశాడాని అతడు చెప్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్- భారత్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మెంటార్గా వ్యవహరిస్తున్న ధోనిను దహానీ కలిశాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ను కలవాలనే కోరికను కూడా అతడు వెల్లడించాడు. తంలో న్యూజిలాండ్ మాజీ స్పీడ్స్టర్ షేన్ బాండ్ని ఫాలో అయ్యేవాడిని అని, ప్రస్తుతం ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఆర్చర్ను అనుసరిస్తున్నాని దహానీ పేర్కొన్నాడు. దహానీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సూల్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లాహోర్ ఖలందర్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో దహానీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ముల్తాన్ సుల్తాన్ ఫైనల్కు చేరడంలో దహానీ కీలక పాత్ర పోషించాడు. "నేను న్యూజిలాండ్ స్టార్ బౌలర్ షేన్ బాండ్ను ఫాలో అయ్యే వాడిని. అతడు లాగే ఫాస్ట్ బౌలర్ కావాలి అని అనుకున్నాను. కానీ అతడు రిటైర్మెంట్ తర్వాత, నేను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ని అనుసరించడం ప్రారంభించాను. త్వరలో ఆర్చర్ను కలవాలనేది నా కోరిక. ఇక మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గరించి చెప్పాలంటే నాకు చాలా సమయం పడుతుంది. అతడిని కలవడం నా కల నెరవెరింది. ఇప్పటికి అతడిని కలిసిన ఆ క్షణం మర్చిపోలేను. ఎందుకంటే జీవితం గురించి, పెద్దలను గౌరవించడం గురించి ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఊపయోగపడ్డాయి. క్రికెట్లో మంచి, చెడు రోజులు వస్తాయని, వాటిని స్వీకరించాలని ధోని చెప్పాడు. అటువంటి సమయంలో కేవలం ఆటపై దృష్టి సారించాలి అని అతడు చెప్పాడు" అని దహానీ క్రికెట్ పాకిస్తాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Emma Raducanu: వెంబడించి, వేధించాడు.. చాలా భయపడ్డా..! నిషేదాజ్ఞ జారీ! -
యార్కర్తో వికెట్ పడగొట్టాడు.. అభిమానులకు దండం పెట్టాడు!
పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా ముల్తాన్ సుల్తాన్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. లాహోర్ ఖలందర్స్ బ్యాటర్ బెన్ డంక్ను అద్భుతమైన యార్కర్తో ముల్తాన్ సుల్తాన్ బౌలర్ షానవాజ్ దహానీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 20 వేసిన దహానీ బౌలింగ్లో స్కూప్ షాట్కు ప్రయత్నించిన బెన్ డంక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో దహానీ వెరైటీ సెలబ్రేషన్ జరపుకున్నాడు. స్టాండ్స్లో ఉన్న ప్రేక్షకులు వైపు చూస్తూ దహానీ దండం పెడతూ సెలబ్రేషన్ జరపుకున్నాడు. ఈ మ్యాచ్లో దహానీ తన నాలుగు ఓవర్ల కోటాలో 44 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముల్తాన్ సుల్తాన్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో దహానీ సెలబ్రేషన్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగల భారీ స్కోరు సాధించింది. లాహోర్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (76), కమ్రాన్ గులాం(43) పరుగులతో రాణించారు. ఇక 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్ కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముల్తాన్ సుల్తాన్ విజయంలో షాన్ మసూద్(83), మహ్మద్ రిజ్వాన్(69) కీలక పాత్ర పోషించారు. Not much to cheer about for Multan Sultans, but this was special from Dahani 🙏🏼🌟#PakistansFirstHDsportsChannel#ASportsHD #HBLPSL7 #LevelHai #PSL7 #PSL2022 #MSvLQpic.twitter.com/16tyBPdAKa — ASports (@asportstvpk) January 29, 2022
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement