-
హడలెత్తించిన శశికాంత్
సాక్షి, ఒంగోలు: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు బౌలర్ కేవీ శశికాంత్ తన పేస్ పదును మరోసారి ప్రదర్శించాడు. హైదరాబాద్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు. ఫలితంగా ఆంధ్ర జట్టుతో ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకే ఆలౌటైంది. శశికాంత్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తన్మయ్, అక్షత్ రెడ్డి, మల్లికార్జున్, సీవీ మిలింద్, హిమాలయ్ అగర్వాల్లను శశికాంత్ అవుట్ చేశాడు. మరో బౌలర్ యెర్రా పృద్విరాజ్ మూడు వికెట్లు తీయగా... పైడికాల్వ విజయ్ కుమార్, బండారు అయ్యప్ప ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్లో ఓ ఇన్నింగ్స్లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం శశికాంత్కిది ఐదోసారి. ఇందులో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున, రెండుసార్లు నాలుగేసి వికెట్ల చొప్పున తీశాడు. హైదరాబాద్ జట్టులో జావీద్ అలీ (161 బంతుల్లో 98; 16 ఫోర్లు) తప్ప మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు. జావీద్ రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం ఆంధ్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (4 బ్యాటింగ్; ఫోరు), ప్రశాంత్ (9 బ్యాటింగ్; ఫోరు) క్రీజులో ఉన్నారు. విజయ్ రికార్డు... ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయడం ద్వారా విజయ్ కుమార్ రంజీల్లో ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. కెరీర్లో 71వ రంజీ మ్యాచ్ ఆడుతున్న విజయ్ 243 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. -
మెరిసిన శశికాంత్, స్టీఫెన్
జైపూర్: పేస్ బౌలర్లు కోడిరామకృష్ణ వెంకట శశికాంత్ (4/50), చీపురుపల్లి స్టీఫెన్ (4/67) మరోసారి చెలరేగడంతో... రాజస్తాన్తో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ మ్యాచ్లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 49.5 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్ జ్ఞానేశ్వర్ (32 బ్యాటింగ్; 5 ఫోర్లు), రికీ భుయ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రశాంత్ కుమార్ (31; 5 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (0) అవుటయ్యారు. మరో 70 పరుగులు చేస్తే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ బ్యాట్స్మెన్ ఏ దశలోనూ కుదురుగా కనిపించలేదు. అశోక్ మేనరియా (74; 8 ఫోర్లు, 2 సిక్స్లు) తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. తాజా రంజీ సీజన్లో ఒకే ఇన్నింగ్స్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం శశికాంత్, స్టీఫెన్లకు ఇది నాలుగోసారి కావడం విశేషం. హైదరాబాద్ వేదికగా కేరళతో ఆరంభమైన మ్యాచ్లోనూ హైదరాబాద్ బౌలర్లు ఆకట్టుకున్నారు. రవి కిరణ్ (3/24), సిరాజ్ (2/36) రాణించడంతో కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అంతకుముందు రోజు నగరంలో కురిసిన భారీ వర్షంవల్ల మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అంపైర్తో గిల్ వాగ్వాదం... ఢిల్లీతో రంజీ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్, భారత ‘ఎ’ జట్టు కెపె్టన్ శుబ్మన్ గిల్ తనను అవుట్గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్తో గొడవకు దిగి విమర్శల పాలైయ్యాడు. గిల్ తన వ్యక్తిగత స్కోరు 10 వద్ద ఢిల్లీ మీడియం పేసర్ సుబోధ్ భాటి బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దీనిపై ఫీల్డర్లు అప్పీల్ చేయగా అంపైర్ మొహమ్మద్ రఫీ... గిల్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన గిల్ అంపైర్ వద్దకు నేరుగా వెళ్లి బ్యాట్కు బంతి తగలలేదంటూ గొడవకు దిగాడు. దీంతో ఆ అంపైర్ స్క్వేర్ లెగ్ అంపైర్ పశి్చమ్ పాఠక్ను సంప్రదించి తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాడు. ఈ గొడవ కారణంగా మ్యాచ్ దాదాపు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే గిల్ మరో 13 పరుగులు మాత్రమే జోడించి అవుట్ కావడం గమనార్హం. గిల్ ప్రవర్తనపై తాము మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడం లేదని ఢిల్లీ జట్టు మేనేజర్ వివేక్ ఖురానా, ఢిల్లీ క్రికెట్ సంఘం జనరల్ సెక్రటరీ వినోద్ తిహారా తెలిపారు. మహారాష్ట్ర 44 ఆలౌట్ సర్వీసెస్ తో జరుగుతోన్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్లో మహారాష్ట్ర 44 పరుగులకే కుప్పకూలింది. రంజీ చరిత్రలో మహారాష్ట్ర జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. 1941–1942 సీజన్లో నవా నగర్తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర 39 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్ బౌలర్ పూనమ్ పునియా 5 వికెట్లతో చెలరేగాడు. ఆట ముగిసే సమయానికి సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 141 పరుగులు చేసి 97 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
అదరగొట్టిన ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: సొంత మైదానంలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. శుక్రవారం ముగిసిన గ్రూప్–‘ఎ’ రంజీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన ఆంధ్ర 9 వికెట్ల తేడాతో ఏడు సార్లు రంజీ చాంపియన్ అయిన ఢిల్లీని చిత్తు చేసింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (5/41), స్టీఫెన్ (5/91) చెలరేగడంతో ఢిల్లీ తన రెండో ఇన్నింగ్స్లో 72.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది 16 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర 2.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (0) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా... సారథి హనుమ విహారి (4) త్వరగా అవుట్ అయ్యాడు. మనీశ్ (15 నాటౌట్; 3 ఫోర్లు), ప్రశాంత్ కుమార్ (1 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. ఓవర్నైట్ స్కోరు 89/6తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఢిల్లీని లలిత్ యాదవ్ (145 బంతుల్లో 55; 11 ఫోర్లు), వికాశ్ మిశ్రా (151 బంతుల్లో 36; 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఏడో వికెట్కు 61 పరుగులు జోడించి ఢిల్లీకి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించారు. అర్ధ శతకంతో నిలకడగా ఆడుతున్న లలిత్ యాదవ్ను శశికాంత్ పెవిలియన్కు పంపగా... వికాశ్ మిశ్రాను స్టీఫెన్ వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్కు తెరపడటానికి ఎంతో సేపు పట్టలేదు. ఈ విజయంతో ఆంధ్ర ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. -
విజయం దిశగా ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: రికీ భుయ్ (313 బంతుల్లో 144 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీకి తోడు... బౌలింగ్లో చీపురుపల్లి స్టీఫెన్ (4/47), శశికాంత్ (2/24) హడలెత్తించడంతో... ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో ఆంధ్ర విజయం దిశగా సాగుతోంది. 153 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 64 పరుగులు చేయాలి. ప్రస్తుతం లలిత్ యాదవ్ (23 బ్యాటింగ్; 4 ఫోర్లు), వికాస్ మిశ్రా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు మ్యాచ్కు చివరి రోజు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 249/6తో బ్యాటింగ్ కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రకు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఒకదశలో 8 వికెట్లకు 250 పరుగులతో ఉన్న ఆంధ్ర జట్టుకు ఆధిక్యం 50 పరుగులు దాటుతుందో లేదో అనే అనుమానం కలిగింది. అయితే రికీ భుయ్ పట్టుదలతో ఆడి చివరి వరుస బ్యాట్స్మెన్ స్టీఫెన్ (60 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్కు 76 పరుగులు... విజయ్ కుమార్ (20 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి పదో వికెట్కు 42 పరుగులు జోడించి ఆంధ్రకు భారీ ఆధిక్యం లభించడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఆంధ్ర ఇన్నింగ్ విజయం
హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు టోర్నీలో ఆంధ్ర జట్టు వైస్ కెప్టెన్ కె. వి. శశికాంత్ (53 నాటౌట్, 4/47, 7/61) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు... మధ్యప్రదేశ్పై ఇన్నింగ్స విజయాన్ని సాధించింది. కడపలో జరిగిన ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు తొలిఇన్నింగ్లో 61.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో శశికాంత్ 4, వేణు 6 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్రజట్టు కరణ్ (73), ప్రణీత్ (55), శశికాంత్ (53నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 159 ఓవర్లలో 9 వికెట్లకు 362 పరుగుల వద్ద ఇన్నింగ్సను డిక్లేర్ చేసింది. దీంతో ఆంధ్రకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్సను ప్రారంభించిన మధ్యప్రదేశ్ శశికాంత్ (7/61) ధాటికి 57.1 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి !
దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ
అవగాహన లేమి.. తగ్గుతున్న దిగుబడి!
గుణాత్మక బోధనతో మంచి ఫలితాలు
సూర్యాపేట
భీంరెడ్డి పోరాట చరిత్ర మరువలేనిది
పుత్తూరులో సీఎం జగన్ రోడ్ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
వాతావరణం చల్లబడింది
మట్టపల్లిలో నిత్యకల్యాణం
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement